Crime News: భర్త హత్యకు రూ.10లక్షల సుపారీ
కుందానగరి బెళగావిలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్ హత్య సంఘటన అనూహ్య మలుపు తిరిగింది. ఆయన రెండో భార్య, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇద్దరు భాగస్థులు హత్యకు పథకాన్ని రూపొందించారని,
రాజు దొడ్డబొమ్మన్నవర్ (పాతచిత్రం)
బెళగావి, న్యూస్టుడే : కుందానగరి బెళగావిలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్ హత్య సంఘటన అనూహ్య మలుపు తిరిగింది. ఆయన రెండో భార్య, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇద్దరు భాగస్థులు హత్యకు పథకాన్ని రూపొందించారని, హంతకులకు రూ.పది లక్షల సుపారీ చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని రూపొందించిన హతుడి రెండో భార్య కిరణ, భాగస్థులు ధర్మేంద్ర, శశికాంత్ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 15న ఉదయం రాజు దొడ్డబొమ్మన్నవర్ హత్యకు గురైన విషయం గుర్తుండే ఉంటుంది. ఉదయం మోటార్ సైకిల్పై వచ్చిన దుండగులు ఆయన ముఖంపై కారంపొడి చల్లి హత్య చేసి పరారయ్యారు.
రహదారి పక్కన పడి ఉన్న శవాన్ని వ్యాహ్యాళికి వచ్చిన కొందరు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయి. రాజు దొడ్డబొమ్మన్నవర్కు ముగ్గురు భార్యలు. వారికి వేర్వేరుగా ఇళ్లను నిర్మించారు. డబ్బు విషయంలో రెండో భార్య కిరణతో గొడవలొచ్చాయి. ఇదే అదనుగా వ్యాపారంలో భాగస్థులు ఆమెతో చేతులు కలిపారు. హంతకులతో మాట్లాడి రూ.10 లక్షల సుపారీ ఇచ్చారని పోలీసులు వివరించారు. అనుమానంతో భార్యను అదుపులోనికి తీసుకోవడంతో హత్య సంఘటన దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లైందని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలివిడతకు ఎండపోటు
[ 08-05-2024]
కన్నడనాట ఎన్నికల ఘట్టాన్ని సూర్యదేవుడు వెంటాడాడు. తొలి విడతను మించి.. గ్రామీణ ప్రాంతాలున్న ఉత్తర కర్ణాటకలో- మలివిడతలో ఎక్కువ శాతం పోలింగ్ నమోదవుతుందనుకుంటే ఏమంత ఆశాజనకంగా లేకపోవడం ప్రస్తావనార్హం. -
పెన్డ్రైవ్ల వెనుక సిద్ధు సర్కారు
[ 08-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్ బహిష్కృత)కు సంబంధించిన అశ్లీల వీడియో కేసును కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా మార్చుకుందని జనతాదళ్ రాష్ట్రాధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆరోపించారు. -
ఓటంటేనే వారికి ప్రాణం!
[ 08-05-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా హిక్కద్ కురువె కాళీనది మధ్య ఒక ద్వీపంలో ఉంటుంది. అక్కడ పోలింగ్ బూత్ లేకపోవడంతో గ్రామస్థులు బోటు ఎక్కి అంకోలాకు వచ్చి తమ హక్కు వినియోగించుకున్నారు. -
కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
[ 08-05-2024]
హాసన లైంగిక వేధింపుల కేసులో కీలకమైన పెన్డ్రైవ్ వ్యవహారంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న భాజపా నేత దేవరాజేగౌడను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇక్కడ రేస్కోర్సు రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. -
ఓటరు దేవుడు.. మొండికేశాడు
[ 08-05-2024]
కర్ణాటకలో రెండో విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మొదటి విడతలో 69 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోగా, ఈ విడత పూర్తి గ్రామీణ ప్రాంతాలున్నా.. -
ఓటంటేనే ఓ వేడుక!
[ 08-05-2024]
ఓ వైపు ఎండలు.. మరో వైపు ఎన్నికల్లో ఓటేయాల్సిన బాధ్యత. ఈ రెండింటితో బాధ్యతతోనే ముందడుగు వేశారు మహిళలు, యువకులు, కొత్త ఓటర్లు! -
ఆసాంతం.. ప్రశాంతం
[ 08-05-2024]
బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎన్నిక సోమవారం ఉదయం సజావుగా ప్రారంభమైంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగిసింది. సాయంత్రం 6 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు వారంతా ఓటు వేయడానికి అవకాశం కల్పించారు. -
అక్క ఇంట్లో చెల్లి చోరీ!
[ 08-05-2024]
సొంత సోదరి ఇంట్లో నగదు, బంగారు నగలు చోరీ చేసిన చెల్లి- లగ్గెరె నివాసి ఉమాను కెంగేరి పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.51.90 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ దయానంద్ విలేకర్లకు వివరించారు. -
తలుపులు వేసుకుని..
[ 08-05-2024]
హుబ్బళ్లిలోని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం తలుపులు వేసుకుని భోజనం చేశారు. -
అడ్డగోలుగా గర్భవిచ్ఛితి
[ 08-05-2024]
పాండవపుర ఆరోగ్య శాఖ వసతి గృహాల సముదాయంలో లభించిన పిండాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.