నాడు ఓడినా.. నేడు సత్తా చాటేదెలా?
రాష్ట్ర విధానసభకు పది నెలల కిందట నిర్వహించిన ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు నేతలు.. నేడు లోక్సభ బరిలో సత్తాచాటే దిశగా అడుగులు వేస్తున్నారు.
విధానసభ మెట్లెక్కలేక లోక్సభపై నేతల దృష్టి
కె.సుధాకర్ , బి.శ్రీరాములు
ఈనాడు, బెంగళూరు : రాష్ట్ర విధానసభకు పది నెలల కిందట నిర్వహించిన ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు నేతలు.. నేడు లోక్సభ బరిలో సత్తాచాటే దిశగా అడుగులు వేస్తున్నారు. పోటీ చేయడానికి కీలక పార్టీల నుంచి వారికి మరో అవకాశం దక్కడమే దీనికి కారణం. ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దిరోజుల పాటు కుంగిన పరాజితులు- ఓటమికి కారణాలపై విశ్లేషణ మొదలుపెట్టారు. ఓ ఎన్నికలో ఓడారంటే వారి విషయంలో స్థానికంగా వ్యతిరేకత ఉందనే అర్థం. ఆయా పార్టీలు అభ్యర్థుల ఓటమిని అంతగా పరిగణనలోకి తీసుకోకుండా మరో అవకాశం ఇచ్చాయి. గెలుపోటములపై విశ్లేషణ కంటే ఓటమితో కుంగిన నేతలు మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావించాయి. రాష్ట్ర, జాతీయ రాజకీయాల మధ్య ఉన్న వ్యత్యాసం, బలాలు, బలహీనతలను అంచనా వేసిన జాతీయ పార్టీలు తాజా లోక్సభ ఎన్నికల్లో ఓడిన కొందిరిపై విశ్వాసాన్ని చూపాయి. పార్టీలకు చేసిన సేవలు, వారసత్వ బలం, గెలుపుపై ధీమా, సరైన అభ్యర్థి లేకపోవటం వంటి కారణాలతో ఈసారి ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ల నుంచి ఏడుగురు పరాజితులు టికెట్లు సాధించారు.
వి.సోమణ్ణ , జగదీశ్ శెట్టర్
విశ్వాసంతో ముందడుగు
గత విధానసభ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతారని అంచనా వేసినవారు ఓటమిపాలై అటు పార్టీకి, ఇటు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. వీరిలో శిరిసి నుంచి పోటీ చేసిన విశ్వేశ్వరహెగ్డే కాగేరి, బళ్లారి నుంచి బి.శ్రీరాములు, చిక్కబళ్లాపురలో బి.సుధాకర్ ప్రముఖులు. వీరెవరూ తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోతారని అంచనా వేయలేదు. పార్టీల జెండాలతో సంబంధం లేకుండా వీరికున్న వ్యక్తిగత వర్చస్సుతో గెలిచితీరుతారనే భావించారు. వీరిలో డాక్టర్ కె.సుధాకర్ ఓటమి అనూహ్యం. రాజకీయాలకు ఏమాత్రం పరిచయం లేని ప్రదీప్ ఈశ్వర్ చేతిలో పదివేల ఓట్లతో ఓడిపోవటం భాజపాను నివ్వెరపరచింది. చామరాజనగర, వరుణ క్షేత్రాల నుంచి పోటీ చేసిన వి.సోమణ్ణ గెలుపు సత్తా ఉన్న అభ్యర్థే అయినా ఆయన సొంత స్థానం కాదని వేరే చోట పోటీ చేయటం, సిద్ధరామయ్య వంటి ప్రముఖ నేతతో ఢీకొనటంతో ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. జగదీశ్ శెట్టర్ బలమైన నేతగా గుర్తింపు ఉన్న వారే. ఆయన అనూహ్యంగా కాంగ్రెస్లో చేరటంతో గెలుపు అవకాశాలను చేతులారా కోల్పోయారు. వీరిలో విశ్వేశ్వరహెగ్డే కాగేరి స్పీకర్గా ఉండి కూడా ఓడిపోగా.. బి.శ్రీరాములు, కె.సుధాకర్, వి.సోమణ్ణ.. మంత్రులుగా ఉండి ఓడిపోక తప్పలేదు. జగదీశ్ శెట్టర్ ముఖ్యమంత్రిగా పని చేసిన నేత. ఈసారి ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. కాంగ్రెస్ నుంచి అప్పటికే సిట్టింగ్లుగా ఉన్న సౌమ్యారెడ్డి జయనగర నుంచి కేవలం 16 ఓట్లతో, ఖానాపుర ఎమ్మెల్యేగా ఉండి అంజలి నింబాళ్కర్ 54,629 ఓట్లతో ఓటమి పాలయ్యారు. వీరి ఓటమి అనూహ్యమే తప్ప సత్తాలేక మాత్రం కాదని సమీక్షించిన పార్టీలు వీరికి మరో అవకాశాన్ని ఇచ్చాయి.
విశ్వేశ్వరహెగ్డే కాగేరి , సౌమ్యారెడ్డి , అంజలి నింబాళ్కర్
గెలుపు సవాలు..
విధానసభ ఎన్నికల్లో ఓటమితో స్థానికంగా ఎదురైన అవమానాలు, ఎదురైన విమర్శలకు బదులివ్వాలని కొందరు పట్టుబట్టి మరీ లోక్సభ సీటు సాధించగా, మరికొందరు పార్టీ సూచన మేరకు టికెట్ సాధించారు. డాక్టర్ కె.సుధాకర్ స్థానికంగా యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్ నుంచి, వి.సోమణ్ణ మాజీ మంత్రి మాధుస్వామి నుంచి గట్టి పోటీ ఎదురైనా అధిష్ఠానంతో పోరాడి టికెట్ సాధించారు. బెళగావిలో టికెట్ సాధించిన జగదీశ్ శెట్టర్ కోరుకున్న స్థానంలో టికెట్ దక్కకున్నా చివరి ప్రయత్నంగా కుందానగరికి పయనమయ్యారు. బి.శ్రీరాములు, విశ్వేశ్వరహెగ్డే కాగేరీ సులువుగా టికెట్లు సాధించారు. వీరిలో ఒక్క బి.శ్రీరాములు మినహా మిగిలిన వారికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవటంతో కొత్త వేదికపై గెలుపు అంత సులువుగా కాదన్న విశ్లేషణలు మొదలయ్యాయి. బెంగళూరు దక్షిణ టికెట్ సాధించిన సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి అండతో, ఉత్తరకన్నడ నుంచి టికెట్ సాధించిన అంజలి నింబాళ్కర్ పార్టీ కీలక నేతల సాయంతో పార్లమెంట్లో అడుగు పెట్టే అవకాశాలను అందుకుంటున్నా.. ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లొంగుబాటుకు హెచ్డీ రేవణ్ణ ముహూర్తం.. ఇంట్లో తలుపు వేసుకుని..
[ 05-05-2024]
మాజీ మంత్రి హొళెనరసీపుర నియోజకవర్గం ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణకు పూజలు, హోమాలు అంటే ఎక్కడిలేని నమ్మకం. -
అందరిలోనూ ప్రజ్వల్ దడ
[ 05-05-2024]
విదేశాలకు వెళ్లిన ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం హాసన జిల్లాలో అన్ని వర్గాల్లోనూ భయం నెలకొన్న వేళ.. ఈ కేసులో విచారణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులను ఆదేశించారు. -
నేటితో ప్రచారానికి తెర
[ 05-05-2024]
రాష్ట్రంలో చివరి విడత ఎన్నికల బహిరంగ ప్రచారం ఆదివారంతో ముగియనుంది. ఏప్రిల్ 26న తొలి విడత ఎన్నికలు నిర్వహించగా.. -
కలబురగి.. కదనరంగమే
[ 05-05-2024]
పేరుకు- కర్ణాటకలోని కలబురగిలో కాంగ్రెస్ అభ్యర్థిగా రాధాకృష్ణ దొడ్డమని, భాజపా తరఫున డాక్టర్ ఉమేశ్ జాదవ్ పోటీ పడుతున్నా.. వీరి గెలుపోటములు జాతీయ స్థాయిలో ఇద్దరు ఉద్దండుల ప్రతిష్ఠతో ముడిపడింది. -
భాజపాకు మిగిలేది చెంబు: డీకే
[ 05-05-2024]
కన్నడిగులకు ఖాళీ చెంబు ఇచ్చిన భాజపాకు ఈసారి ఓటు వేయకుండా ఖాళీ చెంబు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పిలుపునిచ్చారు. -
జిల్లాలో 50 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
[ 05-05-2024]
లోక్సభ సార్వత్రిక ఎన్నికలు ఈనెల 7న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం పెంచేందుకు జిల్లా వ్యాప్తంగా 50కిపైగా ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ నమూనాల్లో ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. -
పతాక స్థాయికి ప్రచార ఘట్టం
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల బహిరంగ ప్రచారానికి ఆదివారం సాయంత్రం ముగియనుంది. రాజకీయ పార్టీల అభ్యర్థులు, పార్టీ నేతలు, మంత్రి, ఎమ్మెల్యేలు శనివారం ప్రచారం తీవ్రం చేశారు. -
ఉమేశ్రెడ్డిని మించిన కీచకుడు ప్రజ్వల్ రేవణ్ణ
[ 05-05-2024]
సైకో కిల్లర్ ఉమేశ్రెడ్డిని మించిన కీచకుడు హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అని కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్రాధ్యక్షురాలు పుష్పా అమర్నాథ్ పేర్కొన్నారు. -
గనినాడులో ప్రచార రాజసం
[ 05-05-2024]
బళ్లారి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మైసూరు లోక్సభ అభ్యర్థి యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయర్ బళ్లారిలో దళిత మహిళ ఇంటిని సందర్శించారు. -
వేటకత్తితో నరికి.. భార్యను చంపిన భర్త
[ 05-05-2024]
భూస్వాధీనం చేసుకున్న భూమికి పరిహారంగా ప్రభుత్వం అందించిన రూ.2 కోట్లను పుట్టింటికి పంపించిన జయలక్ష్మి (36) అనే మహిళను హత్య చేసిన ఆమె భర్త శ్రీనివాస్ (38)ను దాబస్పేట ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు