logo

Prakash Raj: ప్రధానమంత్రిపై ప్రకాశ్‌రాజ్‌ విసుర్లు

‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఎద్దేవా చేశారు.

Updated : 10 Apr 2024 08:45 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే : ‘ఆయన మహాప్రభువులు.. మహా అబద్ధాల కోరు’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని బహుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్‌ ఎద్దేవా చేశారు. కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకుండా, కర్ణాటక ప్రభుత్వం నేరుగా సర్వోన్నత న్యాయస్థానం ముందు కేంద్రం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించడం విడ్డూరంగా ఉందన్నారు. ‘నేను జంగమను. జంగమను ప్రజలు అందరూ తాను చెప్పినట్లు వినాలని’ కొందరు నేతలు యోచిస్తుంటారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమకు కరవు పరిహారాన్ని విడుదల చేయాలని గత ఏడాది సెప్టెంబరు నుంచి కోరుతూ వస్తున్నా స్పందించకుండా, ఇప్పుడు కర్ణాటక నుంచి విన్నపమే రాలేదంటూ చెప్పడం దారుణమని వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని