కుటుంబం.. మట్టిపాలు
మధ్య కర్ణాటలోని బీళగి తాలూకా యత్నట్టి క్రాస్ సమీపంలో ఆదివారం రాత్రి సంభవించిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.
లారీ కింద ఐదుగురి విషాదాంతం
బాగలకోటె, న్యూస్టుడే : మధ్య కర్ణాటలోని బీళగి తాలూకా యత్నట్టి క్రాస్ సమీపంలో ఆదివారం రాత్రి సంభవించిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. పొలంలో పని చేసి తమ స్వగ్రామానికి వెళ్లేందుకు వాహనం కోసం వేచి చూస్తూ రోడ్డు పక్కనే నిల్చున్నారు. మట్టి లోడ్తో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి వారిపై బోల్తా పడింది. మట్టి కింద చిక్కుకుని వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవరు లారీని వదిలి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది మట్టిలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. మరికాసేపట్లో ఇంటికి చేరిపోయే వారిని లారీ బలిగొందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతులను యంకప్ప శివప్ప తోలమట్టి (72), అతడి భార్య యల్లవ్వ (66), కుమారుడు పుండలీక (40), కుమార్తె నాగవ్వ (45), యంకప్ప అల్లుడు అశోక నింగప్ప బమ్మన్నవర (48)గా గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించి, వారి బంధువులకు మృతదేహాలను సోమవారం అప్పగించారు. బీళగి గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హాసన సెక్స్ కుంభకోణం.. ఆ బాధితురాలు భవానీ బంధువే
[ 29-04-2024]
హాసన సెక్స్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు- ఎంపీ ప్రజ్వల్పై లైంగిక దౌర్జన్యం కింద కేసు నమోదు చేసిన మహిళ (47).. భవానీ రేవణ్ణకు స్వయానా మేనత్త కుమార్తె. -
ఉత్తరాన మోదీ ఉరుములు
[ 29-04-2024]
రాష్ట్రంలో రెండో విడత ఎన్నికల కోసం భాజపా ప్రచారం వాయువేగంతో ప్రారంభించింది. ఒకే రోజున నాలుగు ప్రాంతాలు, తొమ్మిది నియోజకవర్గాల అభ్యర్థుల విజయం కోసం భాజపా కీలకనేత- ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారాన్ని ఉరకలెత్తించారు. -
చైతన్యమే జయకేతనం
[ 29-04-2024]
ఉద్యాననగరి బెంగళూరువాసులు చైతన్యవంతంగా అడుగు ముందుకేశారు. -
అడిగింది కొండంత... ఇచ్చింది గోరంత
[ 29-04-2024]
కన్నడనాడుకు రూ.18 వేల కోట్ల కరవు పరిహారాన్ని విడుదల చేయాలని కోరితే కేంద్రం రూ.3,454 కోట్లు మాత్రమే ఇచ్చిందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. -
చెలరేగిన నిరసన ప్రజ్వాల
[ 29-04-2024]
లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన లోక్సభ సభ్యుడు, జనతాదళ్ యువ నాయకుడు ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై కఠిన చర్యలు తీసుకోవాలని యువ కాంగ్రెస్ సమితి డిమాండు చేసింది. -
బెళగావిలో నేనే అభ్యర్థిని!
[ 29-04-2024]
బెళగావి లోక్సభ ఎన్నికల్లోనే తానే అభ్యర్థిని అని భావించి ఓటర్లు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. -
చందనసీమలో నమోజపం!
[ 29-04-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం కర్ణాటకలో నాలుగు బహిరంగసభల్లో పాల్గొని భాజపా అభ్యర్థులకు ఓట్లు అభ్యర్థించారు. -
ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తిరిగిస్తా
[ 29-04-2024]
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు వేసిన ప్రతి ఓటు విలువను సంక్షేమ రూపంలో తప్పకుండా తిరిగి ఇస్తానని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం హొసపేటెలో ఏర్పాటు చేసిన విజయసంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. -
అబద్ధాలను విశ్వసించవద్దు : సిద్ధు
[ 29-04-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి యజమానురాలి ఖాతాకు ఏటా రూ.ఒక లక్ష జమ చేస్తామని, రైతుల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీనిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM