logo

కుటుంబం.. మట్టిపాలు

మధ్య కర్ణాటలోని బీళగి తాలూకా యత్నట్టి క్రాస్‌ సమీపంలో ఆదివారం రాత్రి సంభవించిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.

Published : 16 Apr 2024 00:51 IST

లారీ కింద ఐదుగురి విషాదాంతం

బాగలకోటె, న్యూస్‌టుడే : మధ్య కర్ణాటలోని బీళగి తాలూకా యత్నట్టి క్రాస్‌ సమీపంలో ఆదివారం రాత్రి సంభవించిన రోడ్డుప్రమాదంలో ఐదుగురు మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. పొలంలో పని చేసి తమ స్వగ్రామానికి వెళ్లేందుకు వాహనం కోసం వేచి చూస్తూ రోడ్డు పక్కనే నిల్చున్నారు. మట్టి లోడ్‌తో వెళ్తున్న లారీ వేగంగా వచ్చి వారిపై బోల్తా పడింది. మట్టి కింద చిక్కుకుని వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారకుడైన డ్రైవరు లారీని వదిలి పరారయ్యాడు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు, అగ్నిమాపకదళ సిబ్బంది మట్టిలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు. మరికాసేపట్లో ఇంటికి చేరిపోయే వారిని లారీ బలిగొందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతులను యంకప్ప శివప్ప తోలమట్టి (72), అతడి భార్య యల్లవ్వ (66), కుమారుడు పుండలీక (40), కుమార్తె నాగవ్వ (45), యంకప్ప అల్లుడు అశోక నింగప్ప బమ్మన్నవర (48)గా గుర్తించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించి, వారి బంధువులకు మృతదేహాలను సోమవారం అప్పగించారు. బీళగి గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని