ప్రజాధనాన్ని దోచి పెడుతున్న మోదీ
భారత రాజ్యాంగానికి భాజపా ప్రభుత్వం తూట్లుపొడుస్తోందని, మతం పేరిట విభజన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి లబ్ధిపొందేందుకు చూస్తోందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.
హథ్ సే హాథ్ జోడో యాత్రలో మల్లు భట్టివిక్రమార్క
మామునూరులో కూలీలతో మాట్లాడుతున్న భట్టివిక్రమార్క
ఎర్రుపాలెం, న్యూస్టుడే: భారత రాజ్యాంగానికి భాజపా ప్రభుత్వం తూట్లుపొడుస్తోందని, మతం పేరిట విభజన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి లబ్ధిపొందేందుకు చూస్తోందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం మండలం మామునూరు గ్రామంలో గురువారం హాథ్ సే హాథ్ జోడో యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉద్దేశాన్ని, భాజపా మతోన్మాదంతో వ్యవహరిస్తోందని వివరించారు. దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశ పౌరులేనని అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. లౌకికవాదాన్ని పక్కనపెట్టిన మోదీ ప్రభుత్వం మతం పేరిట ప్రజలను విడగొట్టి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దేశ సంపదను మోదీ తన స్నేహితులైన అంబానీ, అదానీలకు ధారాదత్తం చేస్తున్నారని, ఎనిమిదేళ్లలో వాళ్లు రూ.లక్షల కోట్లు సంపాదించారన్నారు. మిరపతోటలో కూలీలతో భట్టి మాట్లాడారు. గ్యాస్, నిత్యావసర ధరలు పెరిగాయని, ఇళ్లు లేవని కూలీలు భట్టికి విన్నవించగా, సమస్యలపై శాసనసభలో మాట్లాడతానన్నారు. గతంలో చేపట్టిన పీపుల్స్మార్చ్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం మామునూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్రెడ్డి, ఎస్.మోహన్రావు, ఎస్.ప్రతాప్రెడ్డి, బి.నరసింహారావు, టి.నాగిరెడ్డి, ఏవీ.కృష్ణారావు, బి.గోవర్ధన్రెడ్డి, కె.శ్రీనివాసరావు, ఎస్.శ్రీనివాసరెడ్డి, ఎం.లక్ష్మణ్రావు, జానీభాషా, ప్రవల్లిక, డి.శ్రీనివాస్, రాజీవ్గాంధీ, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా కార్యకర్తలూ శక్తిమంతులే..
[ 05-05-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాలు ఊపిరి పోశాయని పేర్కొన్నారు. -
ఆకలి చావులు లేకుండా చేసిన ఘనత ఎన్టీఆర్దే: నామా
[ 05-05-2024]
నాడు కాంగ్రెస్ పాలనలో ఆకలి చావులు ఉండేవని, వాటిని అరికట్టేందుకు అన్న ఎన్టీఆర్ తెదేపాను స్థాపించారని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. -
భాజపాతోనే సుస్థిర పాలన: తాండ్ర
[ 05-05-2024]
భాజపాతోనే సుస్థిర పాలన సాధ్యమని ఖమ్మం లోక్సభ స్థానం ఆపార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. సత్తుపల్లి, మధిరలో శనివారం నిర్వహించిన వేర్వేరు సమావేశాల్లో ఆయన మాట్లాడారు. -
ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
[ 05-05-2024]
ఖమ్మం లోక్సభ ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంల రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. సాధారణ ఎన్నికల పరిశీలకుడు సంజయ్ జి.కోల్టేతో కలిసి కలెక్టరేట్లో ఆన్లైన్లో ఈ ప్రక్రియను శనివారం నిర్వహించారు. -
ఉపాధి కూలీలకు భానుడి సెగ
[ 05-05-2024]
భానుడి భగభగతో ఉపాధి హామీ పథకం కూలీలు పని ప్రదేశాల్లో అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలకే సూరీడు సుర్రుమంటున్నాడు. పనిచేసే చోట ఎలాంటి నీడ, కనీస వసతులు లేక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేకపోతున్నారు. -
మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు
[ 05-05-2024]
రబీ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు అధికారులు హడావుడి చేసి 236 కొనుగోలు కేంద్రాలు తెరచి నెల రోజులు దాటిపోయింది. ఇందులో కేవలం 70 కొనుగోలు కేంద్రాల్లో 8,760 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. -
గెలిచే వరకు.. ఆపకు పరుగు
[ 05-05-2024]
‘జీవితమంతా ఉరుకులు పరుగులు’ అన్నది నానుడి. మాట వరుసకు కాకుండా నిజంగా ఓ లక్ష్యం కోసం పరుగునే ఆయుధంగా మలుచుకున్న వారి శ్రమ వృథా కాలేదు. -
దోస్త్కు వేళాయె..!
[ 05-05-2024]
ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు పుష్కలమైన అవకాశాలు ఉన్నప్పటికీ చాలామంది డిగ్రీ కోర్సులనే ప్రధానంగా ఎంపిక చేసుకుంటారు. -
మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
[ 05-05-2024]
ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులుగా 44 నుంచి 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
1,105 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు: కలెక్టర్
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల కోసం జిల్లాలో 1,105 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు.