అయ్యో రామా.. ప్రచారంలో అలసత్వమా?
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈనెల 9 నుంచి 23 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈనెల 9 నుంచి 23 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అన్ని రకాల సెక్టార్లలో 35 వేల మంది కూర్చొనే వీలుండగా.. ఆయా టికెట్ల విక్రయం మందకొడిగా సాగుతోంది. ఆన్లైన్తో పాటు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈపాటికే విశేష స్పందన రావాల్సి ఉన్నా తక్కువ సంఖ్యలోనే టికెట్ల విక్రయాలు సాగుతున్నాయి. ప్రచార లోపమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 17న శ్రీరామ నవమి, 18న పట్టాభిషేకం మహోత్సవాలకు వీవీఐపీ, వీఐపీ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్లు ఎక్కడ ఇస్తారో అధికారింగా వెల్లడించాల్సి ఉంది. ఇలాంటి అంశాల్లో గోప్యత పాటిస్తే తగు సమాచారం భక్తులకు చేరదు. అంతిమంగా నష్టం జరిగేది స్వామివారి ఖజానాకే అని గుర్తించాలి.
- రూట్ మ్యాప్ ఉండాలి: ఆహ్వాన పత్రికల్లో ప్రకటించిన ప్రకారం 9న ఉగాదితో బ్రహ్మోత్సవాలను ఆరంభించి 23 వరకు కొనసాగిస్తారు. ఇందులో 10 నుంచి 12 వరకు నిర్వహించే ఉత్సవాలను గత ఏడాది తరహాలో అట్టహాసంగా చేయాలని నిర్ణయించినందున ఈ వివరాలను ప్రకటించాల్సి ఉంది. పార్కింగ్ ప్రదేశాలు, వైద్య శిబిరాలు, ప్రసాదాలు-తలంబ్రాల కౌంటర్లు, చలివేంద్రాలు, హోటళ్లలోని ఆహార పదార్థాల ధరలు, ఆర్టీసీ-రైల్వే సేవలు, వసతి, అన్నదానం, మరుగుదొడ్లు, కంట్రోల్ రూం వంటి వాటి సమాచారాన్ని మ్యాప్ ద్వారా ముందుగానే వెల్లడించడం వల్ల రూట్ మ్యాప్పై స్పష్టత వస్తుంది.
- కల్యాణ మండపం సెక్టార్ మ్యాప్ను వెల్లడించాలి. ప్రధాన ఉత్సవాలు సమీపించిన తర్వాత హడావుడిగా రూట్ మ్యాప్ ఇవ్వడం వల్ల కొత్తగా వచ్చేవారు ఆలయానికి ఏ దారిలో సులువుగా చేరాలో తికమక పడుతుంటారు. గోదావరి వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సకాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి కాకుంటే వేసవిలో జరిగే ఈ ఉత్సవానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉంటాయని గుర్తించాలి. చలువ పందిరి నిర్మాణాలను పెంచాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నట్టేట ముంచే నకిలీలలు
[ 21-05-2024]
కొద్దిరోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభంకానుంది. ఈ ఏడాది సాగుకు సానుకూల వాతావరణం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయిన అన్నదాతలు ఈసారైనా కాలం కలిసొస్తుందన్న కోటి ఆశలతో ఉన్నారు. -
ఉప ఎన్నికల సమరం.. రసవత్తరం
[ 21-05-2024]
ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు అధికారులు సమాయత్తమవుతున్నారు. మరోవైపు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. -
మాతృక.. గిరిపుత్రులకు బాసట..!
[ 21-05-2024]
రెవెన్యూ భూములు కాకుండా.. అటవీశాఖకు సంబంధం లేని మాతృక భూములను భూమిలేని అత్యంత నిరుపేద గిరిజనులకు పంపిణీ చేస్తే వారి జీవితాల్లో వెలుగులు నిండుతాయి. -
పాతాళానికి పరుగులు
[ 21-05-2024]
గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, ఇటీవల మండే ఎండలకు జిల్లాలో భూగర్భ జలం పాతాళానికి పరుగులు తీస్తోంది. చెరువులు, కుంటల్లో నీటి జాడ లేక పూర్తిగా ఎండిపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలమట్టం పడిపోయింది. -
అర్హులందరికీ రేషన్ కార్డులు: పొంగులేటి
[ 21-05-2024]
రాష్ట్రంలో అర్హులందరికీ రేషన్ కార్డులు, పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, ఆరు గ్యారంటీల విషయంలో రాజీపడబోమని స్పష్టం చేశారు. -
కాంగ్రెస్ను నమ్మి మరోసారి మోసపోవద్దు: కేటీఆర్
[ 21-05-2024]
శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హస్తం పార్టీని నమ్మి మరోసారి మోసపోవద్దని ప్రజలను కోరారు. -
పదవికి వన్నె తెచ్చేందుకే పోటీ: తీన్మార్ మల్లన్న
[ 21-05-2024]
మాజీ మంత్రి కేటీఆర్ అమెరికా నుంచి కాదుగదా అంతరిక్షం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని పోటీకి తీసుకొచ్చినా గెలవలేరని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. -
పట్టభద్రుల సమస్యలపై నిలదీసేందుకు భాజపాకు మద్దతివ్వాలి: ఈటల
[ 21-05-2024]
ఉద్యోగులు, పట్టభద్రుల సమస్యలపై చట్టసభల్లో నిలదీసేందుకు భాజపా అభ్యర్థికి మద్దతు తెలపాలని ఆపార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ కోరారు. -
పునాది దశ దాటని వంతెన
[ 21-05-2024]
అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగుపై వంతెన ఈఏడాది వర్షాకాలంలోనూ అందుబాటులోకి రాకపోవచ్చు. పనులు ప్రారంభించి ఏడాది గడిచినా పునాది దశ దాటలేదు. -
ఆదివాసీ సంప్రదాయం ‘చల్ల’గుండాలి
[ 21-05-2024]
వేసవి వచ్చిందంటే ఆదివాసీల వద్ద ఆనప(సొరకాయ) బుర్ర ఉండాల్సిందే. ఇది వారికి కదిలే ఫ్రిజ్. గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ ఉన్న భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ కొద్ది రోజుల నుంచి ఆనప బుర్రను ఉపయోగించి అందులో నీటినే తాగుతున్నారు. -
ఎర్ర చీమల గుడ్లూ.. ఆదివాసీల ఆహారమే..!
[ 21-05-2024]
తెలంగాణ-ఛత్తీస్గఢ్ అడవుల్లో ఆదివాసీలు ఏప్రిల్ మాసం చివరిలో ఎర్ర చీమల గుడ్లతో కూర, పచ్చడి తయారు చేసుకుని తింటుంటారు. -
ప్రజా ఉద్యమాలతోనే సమస్యల పరిష్కారం
[ 21-05-2024]
ప్రజా ఉద్యమాలతోనే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పడిగ ఎర్రయ్య అన్నారు. -
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు దరఖాస్తు చేసుకోండి
[ 21-05-2024]
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. -
హత్య కేసు నిందితుల అరెస్టు
[ 21-05-2024]
ఆస్తికోసం కన్నతల్లిని, ఇద్దరు కూతుళ్లను దారుణంగా హతమార్చిన ఘటనలో నిందితుణ్ని, అతని రెండో భార్యను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
-
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!