తొట్టెలపాడు..
మండే ఎండలకు చెరువులు, బావులు, ఇతర జలాశయాలు ఎండిపోతున్నాయి. వేసవిలో పక్షులు, ఇతర మూగజీవాలు నీరు దొరక్క దాహార్తితో అల్లాడుతున్నాయి.
మండే ఎండలకు చెరువులు, బావులు, ఇతర జలాశయాలు ఎండిపోతున్నాయి. వేసవిలో పక్షులు, ఇతర మూగజీవాలు నీరు దొరక్క దాహార్తితో అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో పక్షులకు నీరందించేందుకు తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామ కార్యదర్శి వినోద్ వినూత్న ఆలోచన చేశారు. మట్టి కుండల్ని భాగాలుగా చేసి వాటి సాయంతో నీటితొట్లను తయారు చేస్తున్నారు. ఆ తొట్లను పంచాయతీ సిబ్బంది దారెంట ఉండే చెట్టుకొమ్మలపై ఉంచి కిందపడకుండా దారాలతో కట్టారు. ఇప్పటికే పది తొట్లు అమర్చారు. వీటిలో ప్రతీ రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది నీరు పోస్తున్నారు.
తిరుమలాయపాలెం, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మేడే వేడుకలు
[ 01-05-2024]
మండలంలోని కారేపల్లి, మాదారంతో పాటు పలు గ్రామాల్లో మేడే వేడుకలు నిర్వహించారు. -
పదిలోనూ బాలికలదే హవా
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా గతంకంటే కాస్త మెరుగైన స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ ఫలితాల మాదిరిగానే ఈ పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 12,294 మంది పరీక్షలు రాశారు. -
వార్షిక మరమ్మతుల ప్రణాళికపై సమీక్ష
[ 01-05-2024]
పాల్వంచ కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాన్ని జెన్కో డైరెక్టర్ బి.లక్ష్మయ్య మంగళవారం సందర్శించారు. కేటీపీఎస్లోని బాయిలర్, యాష్ ప్లాంట్, యూసీబీ, కోల్ మిల్, టర్బైన్ తదితర విభాగాలను పరిశీలించి.. అక్కడి వివరాలు ఏరియా ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. -
పది ఫలితాల్లో వెనుకంజ
[ 01-05-2024]
పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఖమ్మం జిల్లా గతేడాదితో పోల్చిచూస్తే వెనుకంజ వేసింది. 92.24 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. గతేడాది 88.72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం దక్కించుకోగా.. ఈ ఏడాది మూడు అడుగులు కిందకు దిగజారింది. -
ఖమ్మం కాంగ్రెస్కు కంచుకోట: భట్టి
[ 01-05-2024]
కాంగ్రెస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట లాంటిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
దేశంలో భాజపా గెలిచే అవకాశం లేదు: కూనంనేని
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా గెలిచే ప్రసక్తి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేశంలో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 192 లోక్సభ స్థానాల్లో మెజార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు. -
పదిలో మెరిశారు
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. అనేక మంది 10 జీపీఏ సాధించారు. -
తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ: తుమ్మల
[ 01-05-2024]
తల తాకట్టు పెట్టయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖామంతి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
సంక్షేమం పేరుతో అప్పులమయం
[ 01-05-2024]
పదేళ్లు పాలించిన భారాస అధినేత కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి పేరుతో తెలంగాణను అప్పులపాలు చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
నయనానందకరంగా సీతారామ కల్యాణం
[ 01-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన సాగింది. సింధూర తిలకాన్ని నుదట ధరించిన భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి హనుమాన్ చాలీసాను పఠించారు. -
సింగరేణిలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి
[ 01-05-2024]
ప్రస్తుత వార్షిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా జరిగింది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులు 92 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ మోసం.. ఏపీ సహా 10రాష్ట్రాల్లో సీబీఐ దాడులు
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!