గుళికల మందు మింగి బలవన్మరణం
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది
అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్టుడే: గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది. పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఇటీవల దాని బాధ తీవ్రం కావడంతో భరించలేక బుధవారం అర్ధరాత్రి ఇంట్లోని విషగుళికలు మింగాడు. గమనించిన కుటుంబీకులు కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా వైద్యం పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడి కుమార్తె భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.
చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలు
భద్రాచలం, న్యూస్టుడే: చెక్ బౌన్స్ కేసులో ఒకరికి భద్రాచలం కోర్టులో ఆరు నెలల జైలుశిక్ష విధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకకు చెందిన వరకా శ్రీనివాస్ భద్రాచలానికి చెందిన లింగమర్ల శ్రీనివాసరావు వద్ద 2016 జనవరిలో రూ.4 లక్షలు అప్పు తీసుకున్నారు. హామీగా చెక్కు ఇచ్చారు. గడువు తీరినా అప్పు చెల్లించలేదు. చెక్ను బ్యాంకులో సమర్పిస్తే బౌన్స్ అయింది. లింగమర్ల శ్రీనివాసరావు.. న్యాయవాదులు పడవల శ్రీనివాస్, పామరాజు తిరుమలరావు ద్వారా 2016లో భద్రాచలం జుడీషియల్ మొదటిశ్రేణి కోర్టులో కేసు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ సూరిరెడ్డి నిందితుడైన వరకా శ్రీనివాస్కు ఆరునెలల జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. డబ్బు చెల్లించకపోతే అదనంగా మరో నెల శిక్ష ఉంటుందని తీర్పులో ప్రస్తావించారు.
అగ్నికీలల్లో సింగరేణి కేబుల్..
కొత్తగూడెం సింగరేణి: సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం వద్దనున్న గుట్టపై బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. విజయవాడ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ అటవీప్రాంతంలో అగ్నికీలలు వ్యాపించి సంస్థ ఐటీ అండర్గ్రౌండ్ కేబుల్ దగ్ధమైంది. దీంతో ఏరియా కార్యాలయంలో ఆన్లైన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. యాజమాన్యం కేబుల్ పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. పనులు మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది.
ఆరు కిలోల గంజాయి పట్టివేత
ముదిగొండ, న్యూస్టుడే: ఆరు కిలోల గంజాయిని పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఖమ్మం గ్రామీణం సీఐ రాజిరెడ్డి తెలిపిన ప్రకారం.. ముదిగొండలో ఎస్ఐ నరేశ్, సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేపట్టారు. ఏడుగురు వ్యక్తులు రెండు బస్తా సంచుల్ని రెండు ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తుండగా ఆపారు. బస్తా సంచుల్లో గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. సువర్ణాపురానికి చెందిన కొట్టె మధు, తోట నవీన్, ఖమ్మం ధంసలాపురం కాలనీకి చెందిన తోట వినయ్కుమార్, కారేపల్లికి చెందిన ఖాజామొహినుద్దీన్, ముగ్గురు మైనర్లు పట్టుబడినట్టు సీఐ వివరించారు. ఆరు కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనపరచుకున్నామన్నారు. ఎస్ఐ నరేశ్, ఏఎస్ఐలు సాంబశివరావు, గురునాథం, హెడ్ కానిస్టేబుల్ భాస్కర్రావు, కానిస్టేబుళ్లు వెంకన్న, కోటేశ్వరరావు, అంజయ్య, గోపిని సీపీ ప్రశంసించినట్లు సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదిలోనూ బాలికలదే హవా
[ 01-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా గతంకంటే కాస్త మెరుగైన స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్ ఫలితాల మాదిరిగానే ఈ పరీక్షల్లోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 12,294 మంది పరీక్షలు రాశారు. -
వార్షిక మరమ్మతుల ప్రణాళికపై సమీక్ష
[ 01-05-2024]
పాల్వంచ కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాన్ని జెన్కో డైరెక్టర్ బి.లక్ష్మయ్య మంగళవారం సందర్శించారు. కేటీపీఎస్లోని బాయిలర్, యాష్ ప్లాంట్, యూసీబీ, కోల్ మిల్, టర్బైన్ తదితర విభాగాలను పరిశీలించి.. అక్కడి వివరాలు ఏరియా ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. -
పది ఫలితాల్లో వెనుకంజ
[ 01-05-2024]
పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఖమ్మం జిల్లా గతేడాదితో పోల్చిచూస్తే వెనుకంజ వేసింది. 92.24 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. గతేడాది 88.72 శాతం ఉత్తీర్ణతతో 18వ స్థానం దక్కించుకోగా.. ఈ ఏడాది మూడు అడుగులు కిందకు దిగజారింది. -
ఖమ్మం కాంగ్రెస్కు కంచుకోట: భట్టి
[ 01-05-2024]
కాంగ్రెస్కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోట లాంటిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ డీసీసీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
దేశంలో భాజపా గెలిచే అవకాశం లేదు: కూనంనేని
[ 01-05-2024]
లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా భాజపా గెలిచే ప్రసక్తి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. దేశంలో జరిగిన రెండు విడతల ఎన్నికల్లో 192 లోక్సభ స్థానాల్లో మెజార్టీ ఓటర్లు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారని తెలిపారు. -
పదిలో మెరిశారు
[ 01-05-2024]
పదోతరగతి ఫలితాల్లో ఉభయ జిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. అనేక మంది 10 జీపీఏ సాధించారు. -
తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ: తుమ్మల
[ 01-05-2024]
తల తాకట్టు పెట్టయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని వ్యవసాయ శాఖామంతి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. -
సంక్షేమం పేరుతో అప్పులమయం
[ 01-05-2024]
పదేళ్లు పాలించిన భారాస అధినేత కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి పేరుతో తెలంగాణను అప్పులపాలు చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
నయనానందకరంగా సీతారామ కల్యాణం
[ 01-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామికి అభిషేకం చేసి అర్చన సాగింది. సింధూర తిలకాన్ని నుదట ధరించిన భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి హనుమాన్ చాలీసాను పఠించారు. -
సింగరేణిలో 92 శాతం బొగ్గు ఉత్పత్తి
[ 01-05-2024]
ప్రస్తుత వార్షిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో బొగ్గు ఉత్పత్తి ఆశాజనకంగా జరిగింది. మొత్తం సింగరేణి వ్యాప్తంగా బొగ్గు గనులు 92 శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాయి.
తాజా వార్తలు (Latest News)
-
12 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
-
తగ్గిన వంటగ్యాస్ వాణిజ్య సిలిండర్ ధర
-
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!
-
సంచలనానికి 50 ఏళ్లు.. ‘అల్లూరి సీతారామరాజు’ తెర వెనక ఎన్ని విశేషాలో..!
-
భర్త పార్లమెంటుకు.. భార్య అసెంబ్లీకి పోటీ