అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
పీఆర్సీ జీవోకు వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి మచిలీపట్నం వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు గురువారం అరెస్టు చేసి సమీప పోలీస్స్టేషన్లకు తరలించారు. అలా పలువురు ఉపాధ్యాయులను
పోలీస్ స్టేషన్ ఎదుటా ఉపాధ్యాయుల నిరసన
గూడూరు: స్టేషన్ ఎదుట నిరసన తెలుపుతున్న
ఫ్యాప్టో నాయకులు, ఉపాధ్యాయులు
గూడూరు, న్యూస్టుడే: పీఆర్సీ జీవోకు వ్యతిరేకంగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి మచిలీపట్నం వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు గురువారం అరెస్టు చేసి సమీప పోలీస్స్టేషన్లకు తరలించారు. అలా పలువురు ఉపాధ్యాయులను గూడూరు పోలీస్స్టేషన్కు తరలించగా నాయకులు, ఉద్యోగులు స్టేషన్ ఎదుట ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నినదించారు.
ముదినేపల్లి: కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి మండలం నుంచి వివిధ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు తరలివెళ్లారు. ఈసందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.రమేశ్ మాట్లాడుతూ ఉద్యోగులకు బకాయిలు ఉన్న మొత్తం డీఏలను ఇప్పుడు ప్రకటించి ఉద్యోగుల జీతాలు తగ్గడం లేదని చెప్పడం సరికాదన్నారు. సీపీఎస్పై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
గంపలగూడెం: తోటమూల నుంచి ప్రదర్శనగా బయల్దేరిన ఉపాధ్యాయులు
గంపలగూడెం: మండలంలో డీపీఆర్టీయూ, యూటీఎఫ్, ఎస్టీయూ సంఘాల తరఫున 50 మంది వరకు ఉపాధ్యాయులు మచిలీపట్నంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి గురువారం తరలివెళ్లారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, సీసీఏ, సీపీఎస్పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వ్యతిరేక నినాదాలు చేస్తూ తోటమూల నుంచి వాహనాల్లో ప్రదర్శనగా వెళ్లారు. ఆందోళనలో పాల్గొన్న గంపలగూడెం మండలానికి చెందిన పలువురు ఉపాధ్యాయులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.
కలిదిండి: తమ సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఎస్టీయూ, డీపీఆర్టీయూ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. పీఆర్సీ, హెచ్ఆర్సీలపై తాజా జీవోలతో పాటు సీపీఎస్ను రద్దు చేయాలని కోరుతూ మచిలీపట్నంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడికి మండలం నుంచి ఆయా సంఘాల ప్రతినిధులు తరలివెళ్లారు.
‘ఉద్యోగులను వంచించడం తగదు’
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్టుడే: పీఆర్సీ పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ప్రభుత్వం వంచించడం తగదని మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ మంత్రులు, శాసనసభ్యులు, ఇతరత్రా ప్రభుత్వ పదవుల్లో ఉన్న నాయకులు రూ.లక్షల్లో జీతాలు, భత్యాలు పొందుతూ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండే ఉద్యోగుల విషయంలో రివర్స్ పీఆర్సీ అమలు చేయడం సిగ్గుచేటన్నారు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని లేనిపక్షంలో వారి పోరాటానికి జనసేన మద్దతుగా ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు లంకిశెట్టి బాలాజీ, సింగలూరి శాంతిప్రసాద్, పినిశెట్టి ఛాయాదేవి, వంపుగడవల చౌదరి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్