logo

కొల్లేరుగా నామకరణం చేయరూ!

నూతన జిల్లాల విభజనలో భాగంగా ఏలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు కొల్లేరుగా నామకరణం చేయాలని కైకలూరు అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఉన్నతాధికారులను కలిసి త్వరలోనే వినతిపత్రం

Published : 28 Jan 2022 02:17 IST

కైకలూరు: నూతన జిల్లాల విభజనలో భాగంగా ఏలూరు కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాకు కొల్లేరుగా నామకరణం చేయాలని కైకలూరు అఖిలపక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఉన్నతాధికారులను కలిసి త్వరలోనే వినతిపత్రం అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక పాత కోర్టు ప్రాంగణంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. కైకలూరు నియోజకవర్గాన్ని ఏలూరులో కలపడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో భాజపా నేత కీర్తి వెంకట రాంప్రసాద్‌, జాతీయ బీసీ సంక్షేమశాఖ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గంగునేని వరప్రసాద్‌, జేఎపీ ఛైర్మన్‌ రుద్రపాక రత్నారావు, బలే చిరంజీవి, బొల్లా శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని