దేవరగట్టు.. గెలుపుపై పట్టు
దసరా బన్ని జైత్రయాత్రకు ఆరు రోజుల సమయం ఉంది. పండగ వస్తుందంటే అందరిలో ఉత్సాహం పొంగి పొర్లుతుంది. అక్టోబరు 5న జరిగే దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
అక్టోబరు 5న బన్ని జైత్రయాత్ర
నేడు కంకణధారణ
మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులు
- న్యూస్టుడే, హొళగుంద, ఆలూరు గ్రామీణ
* దసరా బన్ని జైత్రయాత్రకు ఆరు రోజుల సమయం ఉంది. పండగ వస్తుందంటే అందరిలో ఉత్సాహం పొంగి పొర్లుతుంది. అక్టోబరు 5న జరిగే దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
* హొళగుంద మండలంలోని దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామి దేవతామూర్తులను కాపాడుకొనేందుకు నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.
ఉత్సవమూర్తులు దక్కించుకోవాలని
హొళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు డిర్ర్ర్ర్ర్ర్... గోపరాక్.. బహు పరాక్.. అంటూ మూకుమ్మడిగా వచ్చి దేవరగట్టులోని డోళ్లనబండ వద్ద పాలతో బాస చేస్తారు. ‘మేము మూడు గ్రామాల భక్తులం అన్ని వైషమ్యాలు మరచి.. దైవ కార్యం కోసం పాటు పడతాం, ఉత్సవమూర్తులు తిరిగి దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతాం’ అని ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కొండపైకి వెళ్లి స్వామివారి కల్యాణోత్సవం జరిపించడానికి అనుమతి తీసుకుంటారు.
పెరిగిన అవగాహన సదస్సులు
ఈ ఏడాది జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు బన్ని ఉత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. దేవరగట్టుకు వచ్చే గ్రామాల్లో పోలీసులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కర్రలను స్వాధీనం చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి మద్యం రవాణా కాకుండా సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.
ఎక్కడి నుంచి ఎక్కడ
* నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఉన్నతాధికారుల అనుమతి అనంతరం మాళ మల్లేశ్వరస్వామి సన్నిధికి చేరి అక్కడ వారికి కల్యాణోత్సవం జరిపిస్తారు.
* స్వామి పల్లకిని సుమారు 350 మెట్లు దిగి కల్యాణకట్ట వద్దకు తెచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లే సమయంలో మూడు గ్రామాల భక్తులతో అరికెర, అరికెరతండా, కురుకుంద, ఎల్లార్తి, సుళువాయి తదితర గ్రామాల భక్తులు కర్రలతో తలపడతారు.
* ఉత్సవమూర్తులు ఎదురు బసవన్నగుడి వద్దకు చేరుకోగానే కర్రల సమరం ముగుస్తుంది. అక్కడి నుంచి స్వామి పల్లకి రాక్షసపడ వద్దకు వెళ్లి అక్కడ గొరవయ్య తన తొడ నుంచి పిడుకెడు రక్తాన్ని రాక్షసులకు ధారపోసిన తర్వాత తిరిగి పల్లకి ఎదురు బసవన్న గుడికి చేరుతుంది.
* అనంతరం ఆలయ పూజారి జరగబోయే పరిణామాలు, పంటల పరిస్థితి, ధరలపై కార్ణికం (భవిష్యవాణి) వినిపించడంతో మరోమారు కర్రల సమరం జరుగుతుంది. చివరకు ఉత్సవమూర్తులను కల్యాణకట్టకు చేర్చడంతో ఉత్సవం ముగుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?