అశ్వవాహనంపై.. ఆది దంపతులు
శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల తొమ్మిదో రోజు మంగళవారం భ్రమరాంబాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్పాలంకరణలతో దేదీప్యమాన రూపంలో కొలువుదీరి పూజలందుకున్నారు.
క్యాలండర్లను విడుదల చేస్తున్న మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా, ఈవో తదితరులు
శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల తొమ్మిదో రోజు మంగళవారం భ్రమరాంబాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష పుష్పాలంకరణలతో దేదీప్యమాన రూపంలో కొలువుదీరి పూజలందుకున్నారు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై అధిష్ఠింపజేశారు. అర్చకులు, వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవానికి తీసుకురాగా ధర్మకర్తలమండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో ఎస్.లవన్న, ధర్మకర్తలు కర్పూర హారతులతో నారికేళాలు సమర్పించారు. రాజగోపురం నుంచి గంగాధరమండపం, నందిమండపం బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవం కనులపండువగా జరిగింది.
నీరాజన మండపం ప్రారంభం
భ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ హరిజవహర్లాల్ 2023 దేవస్థానం కాలమానినులను ఆవిష్కరించారు. అనంతరం ఆలయ పుష్కరిణి మధ్యలో దాతల సహకారంతో నిర్మించిన నీరాజన మండపాన్ని మంత్రి ప్రారంభించారు. శ్రీశైలానికి మరో బృహత్తర ప్రణాళిక తయారు చేసి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేసిన 19,033 మంది ఉద్యోగులు
[ 09-05-2024]
జిల్లాలో 19,033 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకున్నారు. మొత్తం మూడు రోజుల్లో 19,033 (84.16 శాతం) మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. -
నాసి మద్యం.. బతుకు నరకం
[ 09-05-2024]
ఎన్నికలనగానే ప్రతి పార్టీకి ఓ మ్యానిఫెస్టో ఉంటుంది.. ప్రచార వ్యూహం ఉంటుంది.. ఎత్తుగడలూ ఉంటాయి.. వీటికి అదనంగా ఉండే మరొకటి మందు వ్యూహం.. ఈ దఫా ఎన్నికల్లో మద్యం ఏరులై పారించేందుకు సిద్ధం చేశారు. -
బీసీలకు 50 ఏళ్లకే పింఛను
[ 09-05-2024]
‘‘ బీసీల సంక్షేమానికి తెదేపా పెద్దపీట వేసింది. మ్యానిఫెస్టోలో ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. 50 ఏళ్లకే వారికి పింఛను అందనుంది. ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు అందించనున్నాం. -
‘వైకాపా మూకలకు పోలీసుల అండ’
[ 09-05-2024]
జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెదేపా నాయకులు, కార్యకర్తలపై వైకాపా నేతలు భౌతిక దాడులకు పాల్పడుతుండటం మంచిపద్ధతి కాదని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి హెచ్చరించారు. -
నిధి వెక్కిరింత.. పర్యాటకం ఓ వింత
[ 09-05-2024]
కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహల్లో బ్లోయర్లు పనిచేయక పోవడంతో పర్యాటకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రంగుల దీపాలు సైతం వెలగని దుస్థితి. తెదేపా హయాంలో అప్పటి పర్యాటక మంత్రి భూమా అఖిలప్రియ రూ.50లక్షలు కేటాయించి 12 బ్లోయర్లు ఏర్పాటు చేశారు. -
మా ఓట్లేవీ..
[ 09-05-2024]
ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులకు అటు నంద్యాలలో, ఇటు కర్నూలులోనూ ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు నంద్యాలలో శిక్షణ తీసుకున్నామని.. -
తొడలోకి దూసుకెళ్లిన చెట్టుకొమ్మ
[ 09-05-2024]
ఓ యువకుడి తొడలోకి చెట్టు కొమ్మ దూసుకెళ్లి ప్రాణాపాయ స్థితికి చేరుకోగా కర్నూలు సర్వజన ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మాలిక్ (21) ట్రాక్టర్ డ్రైవరుగా ఉన్నారు. -
వచ్చినప్పుడు ఒక మాట.. వెళ్లాక టాటా
[ 09-05-2024]
ఏటా టమాటా, ఉల్లి రైతులు నష్టపోతున్నామని ఈ ప్రాంతానికి చెందిన కర్షకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ, ఉల్లి ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. -
సమస్యాత్మక కేంద్రాలపై నిఘా
[ 09-05-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1983 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సాధారణ పోలింగ్ కేంద్రాలు 1528 కాగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలు 455 ఉన్నాయి. -
జగన్ తాత్సారం.. నేల నిస్సారం
[ 09-05-2024]
మాది రైతు ప్రభుత్వమని మాటిమాటికి చెప్పుకొనే జగన్ వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ప్రతి మూడు నెలలకోసారి భూసార పరీక్షలు చేయిస్తాం.. వాటి ఫలితాల ఆధారంగా రైతులకు ఎరువులు, సూక్ష్మధాతు పోషకాలను రైతులకు అందిస్తాం.. -
పోస్టల్ బ్యాలట్ చెల్లుబాటయ్యేనా
[ 09-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగుల ఓటు చెల్లుబాటు ప్రశ్నార్ధకంగా మారింది. ఫెసిలిటేషన్ కేంద్రాల వద్ద జాబితాల్లో పేర్లు కనిపించక పోవటం, సాంకేతిక తప్పిదాలు ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్