వేతన జీవికి అందని వైద్యం
ఉమ్మడి కర్నూలులో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద అందాల్సిన సేవలు అధ్వానంగా ఉన్నాయి. దీని పరిధిలో 80 వేల ఉంది ఉన్నారు.
మొక్కుబడిగా ఈహెచ్ఎస్ సేవలు
ఈహెచ్ఎస్ కింద ఓపీ సేవలు అందించే కేంద్రం
కర్నూలు వైద్యాలయం, న్యూస్టుడే: ఉమ్మడి కర్నూలులో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కింద అందాల్సిన సేవలు అధ్వానంగా ఉన్నాయి. దీని పరిధిలో 80 వేల ఉంది ఉన్నారు. నెట్వర్క్ ఆసుపత్రులు 69, కర్నూలు సర్వజన వైద్యశాలతోపాటు నంద్యాల, ఆదోని ఆసుపత్రులు ఉన్నాయి. ప్రధానంగా సర్వజన వైద్యశాలలో ఈహెచ్ఎస్ కింద ఓపీ, ఐపీ సేవలు అందించాల్సి ఉండగా సేవలు అందడం గగనమైంది. ఓపీకి నెలలో 20 మంది కూడా రావడం లేదు. నెట్వర్క్ ఆసుపత్రులకెళ్తే రోగులు, వారి సహాయకులను ఇబ్బంది పెడుతున్నారు.
నెట్వర్క్ ఆసుపత్రుల్లో..
ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెట్వర్క్ ఆసుపత్రులు 69 ఉన్నాయి. ఈహెచ్ఎస్ కింద ప్రధాన ఆసుపత్రులు.. రోగులను చేర్చుకోవడం లేదు. ఒకవేళ చేర్చుకున్నా ఏదో ఒక కారణం చెప్పి భయపెట్టి అదనపు సొమ్ము తీసుకుంటున్నారు తప్ప పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడం లేదు. రోగులు ఫిర్యాదు చేయలేక ఆసుపత్రి ప్రతినిధులు అడిగినంతమేర నగదు చెల్లిస్తున్నారు. తమవారు బతికితే చాలని భావిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. ఇకనైనా స్పందించి ఈహెచ్ఎస్ కింద ఉద్యోగుల కోసం కర్నూలు సర్వజన వైద్యశాలలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుచేసి ఉత్తమ వైద్యం అందించేలా చూడాల్సి ఉంది.
కన్నీరు మిగిల్చారు
జిల్లా పరిషత్లో జూనియర్ సహాయకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు సతీమణి గోకారమ్మ స్పృహ కోల్పోయారు. హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఖర్చు ఎక్కువవుతుందని చెప్పడంతో అక్కడినుంచి కర్నూలు సర్వజన వైద్యశాలలో అత్యవసర విభాగానికి తరలించారు. తర్వాత మెడికల్ ఫిమేల్ వార్డులో చేర్చారు. వివిధ పరీక్షలు చేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని.. ఎంఆర్ఐ చేయాలని వైద్యులు చెప్పారు. ఆమెకు కేటాయించిన బెడ్ వద్ద ఫ్యాన్ లేదు. సమస్యను వైద్యులకు విన్నవించడంతో పక్క వార్డులోకి మార్చారు. రాత్రి సమయంలో ఊపిరి ఆడకపోవడంతో నర్సింగ్ సిబ్బందికి చెప్పడంతో అత్యవసర విభాగానికి తీసుకెళ్లారు. ఒకవైపు భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం.. వైద్యులు పట్టించుకోకపోవడంతో ధైర్యం చేసి ఈహెచ్ఎస్ ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే ఎంఆర్ఐ తీసి ఆపరేషన్ చేయాలని.. పరిస్థితి చెప్పలేమని వైద్యులు తేల్చారు. ఆమెకు బుధవారం ఆపరేషన్ చేశారు. గురువారం ఉదయం 12 తర్వాత ప్రాణాలు వదిలారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించి ఉంటే తన భార్య చనిపోయి ఉండేది కాదని శ్రీనివాసులు కన్నీరుమున్నీరయ్యారు.
ఏం చేయాలి..
కర్నూలు సర్వజన వైద్యశాలలోని పేయింగ్ బ్లాక్లో ఈహెచ్ఎస్ కింద ప్రత్యేకంగా ఓపీ ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. నిత్యం ఒక విభాగం సూపర్ స్పెషాలిటీ వైద్యులతో ఓపీ నిర్వహిస్తారు. ఈ గదిలో ఓ సిస్టర్ ఉంటారు. రోగులు వచ్చినప్పుడు ఆ విభాగం వైద్యులు వచ్చి పరీక్షలు చేసి వెళ్లాల్సి ఉంది. అవసరమైనవారిని ఐపీలో చేర్చుకుంటారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేయాల్సి ఉంటుంది.
ఏం జరుగుతోంది
సర్వజన వైద్యశాలలో ఈహెచ్ఎస్ కింద ఓపీ గదిలో కేవలం ఒక స్టాప్ నర్సు ఉంటున్నారు. ఎవరైనా ఓపీకి వస్తే ఫోన్లో సమాచారం అందిస్తే పీజీ వైద్యులు చూసి మందులు రాసి పంపేస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. పేరుకే సూపర్ స్పెషాలిటీ విభాగం.. నిపుణులైన వైద్యులు ఒక్కరు కూడా వచ్చి చూసిన దాఖలాలు లేవు. ఐపీ కింద చేరితో మంచి వైద్యం అందదని పలువురు ఇక్కడికి రావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?