logo

ఆకలితో అలమటించి

ఐదేళ్ల కిందట తోడు పోయింది.. ఆదుకోవాల్సిన కుమారుడు మత్తుకు బానిసయ్యాడు.. గూడు లేదు.. కూడు లేదు. సత్రాల్లో తలదాచుకుని పొట్టనింపుకొంది.. జబ్బు చేయడంతో సత్రం గడప దాటాలన్నారు..

Published : 30 May 2023 02:56 IST

ఐదేళ్ల కిందట తోడు పోయింది.. ఆదుకోవాల్సిన కుమారుడు మత్తుకు బానిసయ్యాడు.. గూడు లేదు.. కూడు లేదు. సత్రాల్లో తలదాచుకుని పొట్టనింపుకొంది.. జబ్బు చేయడంతో సత్రం గడప దాటాలన్నారు.. విధిలేని పరిస్థితుల్లో శిథిల భవనమే ఇల్లైంది.. జబ్బు పెరగడం.. తిండి లేకపోవడంతో ఆదివారం అవుకు మండలంలోని చెర్లోపల్లెలో మృత్యుఒడికి చేరారు. ఈ ఘటనకు సంబంధించి అనాథ శవంగా ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలి వద్ద లభించిన ఆధారాలతో సంజామల మండలం ఆకులమళ్లకు చెందిన పుల్లమ్మ(75)గా గుర్తించారు. తల్లి చనిపోయినట్లు తెలిసినా కుమారుడు రాకపోవడం, మృతదేహం కుళ్లిపోవడంతో బనగానపల్లి వైద్యులు గ్రామానికి వెళ్లి శవపరీక్ష చేశారు. అధికారుల సమక్షంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించినట్లు ఎస్సై నరేంద్ర తెలిపారు.  

అవుకు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని