పశ్చిమాన సాగునీరు పారిస్తాం
‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది.
వేదవతి ప్రాజెక్టును పూర్తిచేస్తాం
ఆలూరులో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, కర్నూలు, ఆలూరు గ్రామీణం, ఆలూరు, న్యూస్టుడే: ‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది.. తెదేపా అధికారంలోకి రాగానే ఎనిమిది టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తాం.. దీంతో 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది... పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది’’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలొచ్చారు. చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఆలూరు తెదేపా అభ్యర్థి వీరభద్ర గౌడ్ సాధారణ కార్యకర్త, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు కురుబ సామాజిక వర్గానికి చెందిన సామాన్య వ్యక్తి.. వారిద్దరినీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘కురబ కులస్థుడైన బస్తిపాటి నాగరాజు కర్నూలు నుంచి దిల్లీ పార్లమెంటుకు వెళ్లబోతున్నారని ఊహించారా? తెదేపాలో సామాన్య కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం ఇది. అందుకే వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాన్న ఉద్దేశంతో జనసేన అధినేత పనన్ కల్యాణ్ పొత్తుపెట్టుకున్నారని.... జనసేన కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని. వైకాపాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
- ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ కేటాయించారు.. ఆ నమ్మకాన్ని వమ్ముచేయనన్నారు.
- కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ.. ఆలూరు అత్యంత వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
- కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ.. వైకాపా నేతలు మద్యం, మట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమాలు చేశారే తప్ప.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయలేదన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
పశ్చిమ ప్రాంతంలో నీళ్లు లేక పెళ్లిళ్లూ వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.. అధికారంలోకి వచ్చిన వెంటనే సాగు నీటితోపాటు ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల నుంచి ఏటా వేలాది మంది వలస వెళ్తున్నారు. వారికి స్థానికంగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. టమాట రైతులను ఆదుకోవడానికి వీలుగా టమాట శుద్ధి (ప్రాసెసింగ్) పరిశ్రమ తీసుకొస్తాం.. మిరప రైతులకు ఆదోనిలో మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. నగరడోణా ప్రాజెక్టు, వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, బీసీ గురుకుల పాఠశాల కావాలని డిమాండు చేస్తున్నారని... వాటి ఏర్పాటుకు హామీ ఇస్తున్నానని ప్రకటించారు. ఆగిపోయిన జాతీయ రహదారి పనులు పూర్తి చేస్తామన్నారు. ‘జగన్రెడ్డి రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మించారా? సాగు, తాగునీరు ఇచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? డీఎస్సీ నిర్వహించారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మీ జీవితాలు బాగుపడ్డాయా? మీ ఆదాయం పెరిగిందా? మీ కష్టాలు తీరాయా? మిరప, పత్తి, టమాట రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. సభకు హాజరైన ప్రజలు ఆయా ప్రశ్నలకు ‘లేదు... లేదు...’ అంటూ సమాధానం ఇచ్చారు.
ఎండను సైతం లెక్కచేయకుండా..
ప్రజాగళం సభకు జనం భారీగా హాజరయ్యారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన జనం అడుగడుగునా నీరాజనం పలికారు. మహిళలు ఎండను సైతం లెక్కచేయక చంద్రబాబు రాక కోసం ఎదురుచూశారు. చిన్నారులు సైతం పార్టీ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో జనం ఈలలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ ఉత్సాహం కనబరిచారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నమ్ముకున్న నేతలకు న్యాయం చేస్తాం
- ‘వైకుంఠం కుటుంబం తెదేపాకు అండగా ఉండే కుటుంబం. ఎప్పుడు ఆలూరుకు వచ్చినా వైకుంఠం శ్రీరాములు గుర్తుకొస్తారు.. శివప్రసాద్, ఆయన భార్య జ్యోతి ఎప్పుడూ తెదేపాకే పనిచేశారు. కొందరు స్వార్థంతో వెళ్లిపోయినా శివప్రసాద్, జ్యోతి తెదేపాలోనే ఉన్నారు. వారిని పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా కప్పటాళ్ల బొజ్జమ్మకూ న్యాయం చేస్తామన్నారు.
- కోట్ల సుజాతమ్మకు కొన్ని కారణాలతో టికెట్ ఇవ్వలేకపోయాం. ఆమె సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఆమెకు న్యాయం చేస్తాం.. ఆమె అభిమానులందరూ తెదేపా విజయానికి సహకరించాలి’ అని తెదేపాలోని కీలక నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగిన న్యాయం చేస్తామని బహిరంగంగా ప్రజలందరి ముందూ ప్రకటించి వారిలో విశ్వాసం నింపడంతో పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
- ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆదోని అసెంబ్లీ స్థానం భాజపాకు కేటాయించామని, తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నీకు న్యాయం చేస్తానని ఆదోని మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడుకు తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరికలు
[ 02-05-2024]
మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో 30 కుటుంబాలు తెదేపాలో చేరారు. -
శ్యాంబాబును గెలిపించుకుందాం
[ 02-05-2024]
తెదేపా అభ్యర్థి కేఈ శ్యాంబాబుకు ఓటు వేసి గెలిపించుకోవాలని తెదేపా నాయకులు కేఈ.నిఖిలేష్, సుబ్బరాయుడు అన్నారు. -
మంచి మనిషిని చూసి ఓటెయ్యండి
[ 02-05-2024]
మంచి మనిషి సౌమ్యుడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్ను అధిక మెజార్టీతో గెలిపించాలని మాజీమంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మం నారాయణ అన్నారు. -
ఉపాధ్యాయ ఉద్యమ దార్శనికుడు దాచూరి రామిరెడ్డి
[ 02-05-2024]
ఉపాధ్యాయ ఉద్యమ దార్షనికుడు దాచూరి రామిరెడ్డి ఉద్యమ స్ఫూర్తి ఉపాధ్యాయ లోకానికి దిక్సూచి లాంటిదని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు. -
తెదేపాలో చేరికలు
[ 02-05-2024]
ఆదోని పట్టణంలో 3వ వార్డు బసన్న కట్ట, గోకర్ జెండా ప్రాంతానికి చెందిన 150 మంది వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరారు. -
పెన్షన్ కోసం వృద్ధుల అవస్థలు
[ 02-05-2024]
ఆదోని పట్టణంలో పెన్షన్ దారులు బ్యాంకుల వద్ద గురువారం ఇబ్బందులు పడ్డారు. -
బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. -
కూటమి గెలుపుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
[ 02-05-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని తెదేపా ఫ్లోర్ లీడర్ దయాసాగర్ అన్నారు. -
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి
[ 02-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జేసీ, నంద్యాల ఎన్నికల అధికారి రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. -
అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడి మృతి
[ 02-05-2024]
మండలంలోని కైరవాడి గ్రామంలో అనారోగ్యంతో తెదేపా సీనియర్ నాయకుడు గురువారం మృతి చెందారు. -
సకల జనుల సంక్షేమం
[ 02-05-2024]
ఒక్క రూపాయి కూడా కట్టే పని లేకుండానే.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను.. ఉద్యోగులు, యువత, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు.. ఇలా సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందంటూ క్షేత్రస్థాయిలో ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. -
హామీలు గుప్పించి.. సేవలు వికటించి
[ 02-05-2024]
జగన్ ప్రభుత్వ ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఆసుపత్రి భవనాల నిర్వహణ గాలికొదిలేసింది. -
దారితప్పిన మాటలు.. పుర వాసులకు కష్టాలు
[ 02-05-2024]
-
4న లోకేశ్ రాక
[ 02-05-2024]
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 4న నంద్యాలలో యువగళం సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ తెలిపారు. -
పింఛను దూరం 90 కి.మీ.
[ 02-05-2024]
జగన్నాటకంలో పండుటాకులు విలవిలలాడుతున్నారు. -
3 ఎమ్మెల్యేలు.. 6కి.మీ..18ఏళ్లు
[ 02-05-2024]
ఈ అంకెలు ఏంటీ అనుకుంటున్నారా..? సి.బెళగల్ మండలం కొండాపురం- ఇనగండ్ల మధ్య 6 కి.మీ. మట్టి రోడ్డును బీటీగా మారుస్తామని గత 18 ఏళ్లలో ముగ్గురు ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. -
మ్యానిఫెస్టోలో అన్నివర్గాలకు ప్రాధాన్యం
[ 02-05-2024]
రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు దర్పణం పట్టేలా తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో ఉందని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
గడప.. గడపలో అబద్ధాలు చెప్పండి!
[ 02-05-2024]
అన్ని వర్గాలను అలరించేలా ఉన్న తెదేపా మ్యానిఫెస్టోపై అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేయించేందుకు వైకాపా నాయకులు కుట్రలకు తెర తీశారు. -
ప్రజా సంక్షేమమే తెదేపా ధ్యేయం
[ 02-05-2024]
మండలంలోని నల్లచెలిమల, ఎంకే కొట్టాల, గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బంటుపల్లి, బేతపల్లి, బండపల్లి, ఈదులదేవరబండ గ్రామాల్లో తెదేపా కూటమి అభ్యర్థి వీరభద్రగౌడు, జనసేన ఇన్ఛార్జి వెంకప్ప బుధవారం ప్రచారం నిర్వహించారు. -
మద్యం అమ్మకాలపై నిరంతర నిఘా
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, టూరిజం బార్లలో మద్యం అమ్మకాలపై నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ పర్యవేక్షణాధికారి, ఏపీఎస్బీసీఎల్ డిపో మేనేజర్ ఎం.సుధీర్బాబు తెలిపారు. -
అక్రమ మద్యం తరలిస్తూ పట్టుపడ్డ వైకాపా నాయకుడు
[ 02-05-2024]
అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న వైకాపా నాయకుడు శ్రీకాంత్రెడ్డితో పాటు మరో నలుగురిని సెబ్ పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలూరులో బుధవారం జరిగింది. -
డోన్లో 45.7 డిగ్రీలు
[ 02-05-2024]
పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. -
శిశువు అపహరణకు యత్నం
[ 02-05-2024]
కర్నూలు సర్వజన వైద్యశాలలోని గైనిక్ విభాగం నుంచి ప్రమీల అనే మహిళ బుధవారం రాత్రి 7 గంటలకు నవజాత శిశువును ఎత్తుకెళ్తూ సెక్యూరిటీ గార్డుకు పట్టుబడటం సంచలనంగా మారింది. -
హత్యాయత్నం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
[ 02-05-2024]
అనుమానంతో కట్టుకున్న భార్యను చంపేందుకు యత్నించిన నంద్యాల జిల్లా వెలుగోడుకు చెందిన రాజుకు పదేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కర్నూలు అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ