8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాం!
పాలమూరులో 2014 కంటే ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గుర్తు తెచ్చుకోవాలని రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు.. ఎప్పుడు వస్తదో తెలియదు.. ఎరువుల కోసం కొట్లాటలు..
2014 కంటే ముందు ఈ ప్రాంతం ఎలా ఉండేది?
రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
మహబూబ్నగర్, పేట జిల్లాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
కోస్గిలో కూరగాయల మార్కెట్ ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్కుమార్,
శ్రీనివాస్గౌడ్, కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, ఎంపీ శ్రీనివాస్రెడ్డి
మహబూబ్నగర్ (ఈనాడు డిజిటల్), భూత్పూరు, అడ్డాకుల, దేవరకద్ర గ్రామీణం, కోస్గి, కోస్గి గ్రామీణం, కోస్గి న్యూటౌన్ (న్యూస్టుడే) : పాలమూరులో 2014 కంటే ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గుర్తు తెచ్చుకోవాలని రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు.. ఎప్పుడు వస్తదో తెలియదు.. ఎరువుల కోసం కొట్లాటలు.. చెప్పులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.. తెలంగాణ వచ్చాక పాలమూరులో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతోందని పేర్కొన్నారు. కేంద్రం మాత్రం పాలమూరును చిన్నచూపు చూస్తోందన్నారు. వికారాబాద్ నుంచి నారాయణపేట మీదుగా రైలు మార్గం, గద్వాల - మాచర్ల రైలు మార్గాలు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం, నారాయణపేట జిల్లాలోని కోస్గిలో మంత్రి కేటీఆర్ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్లతో, కోస్గిలో రూ.40.65 కోట్ల అభివృద్ధి పనుల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా భూత్పూరులోని అమిస్తాపూర్లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. 4 వేల ఎకరాలకు సాగునీరు అందించే పేరూరు ఎత్తిపోతల పథకం పనులకు రూ.55 కోట్లతో శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేని విధంగా దేవరకద్రలో 21 చెక్డ్యామ్లు ఏర్పాటు చేసుకోవడంపై సంతోషం వ్యక్తపరిచారు. కొత్తకోట పురపాలికకు రూ.4 కోట్లు విడుదల చేస్తానని చెప్పారు. అదేవిధంగా భూత్పూరులో అధికారుల కార్యాలయాల సముదాయానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానన్నారు. దేవరకద్ర గ్రామపంచాయతీ గడువు ముగియగానే పురపాలికగా మార్చి రూ.20 కోట్ల నిధులు అందిస్తామన్నారు. కొత్తకోటలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. సిద్దాయిపల్లిలో రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీ సమయంలో లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూశానన్నారు. సొంత జాగా ఉన్నవారికి ఇళ్లు కట్టుకోవడానికి నియోజకవర్గంలో మూడు వేల మందికి రూ.3 లక్షల చొప్పున అందిస్తామని చెప్పారు.
* రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా ఉందన్నారు. ఈ విషయాన్ని భాజపా పెద్దలు, పార్లమెంటులో ఆ పార్టీ వాళ్లే ఒప్పుకొన్నట్లు చెప్పారు. చిన్న గ్రామంగా ఉన్న భూత్పూరును పురపాలికగా మార్చి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేశారన్నారు. ఒక్క భూత్పూరు మాత్రమే కాదు.. రాష్ట్రంలోని 142 పురపాలికలను శుభ్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.
అమిస్తాపూర్ సభకు హాజరైన జనం
*రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. 70 ఏళ్లలో పాలమూరును అప్పటి పాలకులు వలసగా జిల్లాగా మార్చారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరవాత ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతోందన్నారు. అప్పటి పాలకులు కనీసం 5 టీఎంసీల నీటిని వాడుకునేలా ఒక్క ప్రాజెక్టుకు కూడా డిజైను చేయలేదన్నారు. ఆర్డీఎస్ను బద్దలు కొట్టినా ఇక్కడి నేతలు ఎవరూ మాట్లాడలేదన్నారు. ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలిస్తుంటే హారతులు పట్టారని చెప్పారు. మళ్లీ ఒకసారి ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి ఇద్దరు వ్యక్తులు జాతీయ నాయకులుగా తిరుగుతున్నారన్నారు. పాలమూరు నుంచి ముంబయి, పుణే, దుబయి వెళ్లినవారు తిరిగి వస్తున్నారన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, నరేందర్రెడ్డి, డా.లక్ష్మారెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, రాజేందర్రెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్రెడ్డి, అబ్రహాం, అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, సురభి శ్రీవాణి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.
* కోస్గి సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒక్క బస్సు డిపో కూడా ఏర్పాటు కాలేదని.. మొదటి బస్ డిపో కోస్గిలో ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు కోస్గి, కొడంగల్పై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమన్నారు. త్వరలోనే అర్హులైన అందరికి పింఛన్లు అందిస్తామన్నారు. కోస్గిలో 50 పడకల ఆస్పత్రి, కొడంగల్లో 100 పడకల ఆస్పత్రి పూర్తయిందన్నారు. ఇది నియోజకవర్గంలో కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి కాదా అని అన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో సర్పంచులందరూ పాల్గొనాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 27-04-2024]
మండలంలోని పోచమ్మగడ్డ తండాకు చెందిన వడ్తవత్ యశ్వంత్ నాయక్ సివిల్స్కు ఎంపికయ్యాడు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులపై ఆరా
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వస్తువులపై శనివారం తాహసీల్దార్ హరికృష్ణ వివరాలు సేకరించారు. -
చదువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
[ 27-04-2024]
ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి నిర్వహించనున్న వేసవి చదువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫౌండేషన్ కోఆర్డినేటర్ సాయికుమార్ అన్నారు. -
రాష్ట్రంలో విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి: కేసీఆర్
[ 27-04-2024]
తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి