అంచెలంచెలుగా ఎదిగి అసెంబ్లీకి!
రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేతల్లో చాలామంది కిందిస్థాయి నుంచి ఎదిగిన వాళ్లే. జడ్పీటీసీ సభ్యులుగా సేవలందించింది గుర్తింపు పొంది తర్వాత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.
జడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలు
న్యూస్టుడే, మహబూబ్నగర్ పట్టణం : రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేతల్లో చాలామంది కిందిస్థాయి నుంచి ఎదిగిన వాళ్లే. జడ్పీటీసీ సభ్యులుగా సేవలందించింది గుర్తింపు పొంది తర్వాత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా, పార్టీల కీలక నేతలుగా ఎదిగారు. ఇలాంటి నేతల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్రెడ్డి ఉన్నారు.
పీసీసీ సారథిగా రేవంత్రెడ్డి..
వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన ఎనుముల రేవంత్రెడ్డి 2007లో మిడ్జిల్ మండల జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2007లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. 2009లో తెదేపా తరఫున కొడంగల్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లోనూ ఇదే నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి భారాస అభ్యర్థి పట్నం నరేందర్రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. కొద్ది సమయంలోనే కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజకీయ చతురత, వాక్చాతుర్యంతో ఈ స్థాయికి ఎదిగారు.
జడ్పీ ఛైర్పర్సన్గా సీతాదయకర్రెడ్డి..
మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్రెడ్డి కూడా తన ప్రస్థానం జడ్పీటీసీ సభ్యురాలి స్థాయి నుంచే ప్రారంభించారు. ఆమె 2001లో దేవరకద్ర జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నియ్యారు. జడ్పీ ఛైర్పర్సన్గానూ ఎన్నికై 2006 వరకు కొనసాగారు. దేవరకద్ర నియోజకవర్గం కొత్తగా ఏర్పడ్డాక తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి దేవరకద్ర ఎమ్మెల్యేగా 2009లో విజయం సాధించారు. ఇదే సంవత్సరం తెదేపా తరఫున మక్తల్ ఎమ్మెల్యేగా ఆమె భర్త దయాకర్రెడ్డి గెలుపొందారు. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి శాసనసభలో ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టి రికార్డు నెలకొల్పారు. ఇన్నాళ్లు తెదేపాలోనే కొనసాగిన ఆమె ఇటీవల కాంగ్రెస్లో చేరారు.
కీలక నేతగా డీకే అరుణ..
గద్వాలకు చెందిన డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2001లో పాన్గల్ మండల జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి ఎన్నియ్యారు. 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అభ్యర్థిగా గద్వాల అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్లో చేరిన ఆమె 2009లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా సేవలు అందించారు. 2014లోనూ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాలతో భాజపాలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.
ఎమ్మెల్యేగా వెంకటేశ్వర్రెడ్డి..
భూత్పూరు మండలం అన్నాసాగర్కు చెందిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి భారాస నుంచి దేవరకద్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన తెదేపాలో చురుకుగా ఉంటూ 2009లో భూత్పూరు జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఆ తర్వాత భారాసలో చేరి 2014లో దేవరకద్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి శాసనసభకు ఎన్నియ్యారు. ఇప్పుడు మూడో సారి భారాస అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాలమూరులో గెలిచి.. దిల్లీలో మెరిసి
[ 28-04-2024]
వెనకబడిన ప్రాంతంగా పేరున్న మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం ఉద్దండులైన ఎంపీలను అందించింది. ఇక్కడ గెలిచిన పలువురికి మంత్రి పదవులు దక్కగా కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు. -
భారాస హయాంలోనే అభివృద్ధి
[ 28-04-2024]
50 ఏళ్ల కాంగ్రెస్, తెదేపా పాలనలో పాలమూరుకు ఏమైనా న్యాయం జరిగిందా? అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఆయన చేపట్టిన ‘పోరుబాట’ బస్సుయాత్ర శనివారం నాగర్కర్నూల్లో కొనసాగింది. -
యువత.. మార్చేను నేతలరాత
[ 28-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములపై యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు యువ మంత్రం జపిస్తున్నారు. -
రానున్న ఐదురోజులు వడగాల్పులు: కలెక్టరు హెచ్చరిక
[ 28-04-2024]
రానున్న ఐదు రోజులు నారాయణపేట జిల్లాలో తీవ్రమైన వడగాల్పులతో పాటు ఉష్ణ్రోగ్రతలు రికార్డు స్థాయిలో 45డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కోరారు. -
నేడు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్ ఆర్జేసీ, ఆర్డీసీ సెట్ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్ తెలిపారు. -
ఓటర్లు ప్రలోభాలకు లొంగొద్దు
[ 28-04-2024]
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఓటరు విధిగా వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. ఈ నెల 29న ఓటరు చైతన్య శోభాయాత్ర పేరుతో జిల్లా కేంద్రంలో మెగా ర్యాలీ నిర్వహించే కార్యక్రమంపై -
అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగొద్దు: కలెక్టర్
[ 28-04-2024]
జిల్లాలో వచ్చే ఐదు రోజులు తీవ్రమైన వడగాలులతో పాటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 45 డిగ్రీలకు చేరుకునే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సూచించారు. -
క్రియాశీల నేతలకు ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రాధాన్యం
[ 28-04-2024]
భాజపా, భారాస అసత్య ప్రచారాలను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు కట్టుబడి పనిచేయాలని.. లోక్సభ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించే యువజన కాంగ్రెస్ కార్యకర్తల్లో 60 శాతం మందికి స్థానిక ఎన్నికల్లో అవకాశాలు కల్పిస్తామని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, -
కృష్ణానీటిపై జగన్తో కేసీఆర్ చీకటి ఒప్పందం : యెన్నం
[ 28-04-2024]
కృష్ణానది నీటిని ఆంధ్రప్రదేశ్కు ఇచ్చేలా జగన్తో అప్పటి సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
దామరగిద్దలో వివాహిత దారుణహత్య
[ 28-04-2024]
దామరగిద్దలో మహిళ దారుణ హత్యకు గురైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన మహిళ మరో ఇంట్లో మృతదేహమై కనిపించింది. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యం
[ 28-04-2024]
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. -
నేడు బీసీ గురుకులాల్లో ప్రవేశానికి పరీక్ష
[ 28-04-2024]
మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల జిల్లా సమన్వయకర్త సుగుణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య