డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ కన్ను
మహబూబ్నగర్ డీసీసీబీ పీఠంపై హస్తం పార్టీ కన్నేసింది. ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పార్టీ పావులు కదుపుతోంది.
మహబూబ్నగర్ డీసీసీబీ కార్యాలయం
ఈనాడు, మహబూబ్నగర్: మహబూబ్నగర్ డీసీసీబీ పీఠంపై హస్తం పార్టీ కన్నేసింది. ఛైర్మన్ పదవిని కైవసం చేసుకోవడానికి పార్టీ పావులు కదుపుతోంది. భారాస నుంచి పార్టీ మారడానికి ఇప్పటికే 55 మంది పీఏసీఎస్ ఛైర్మన్లతో సంతకాలు కూడా సేకరించినట్లు సమాచారం. వీరంతా వారం, పది రోజుల్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డీసీసీబీ ఛైర్మన్గా మక్తల్కు చెందిన నిజాం పాషా(భారాస) ఉన్నారు. రెండేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2020 ఫిబ్రవరిలో ప్రాథమిక సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో భారాస మద్దతుదారులు ఏకపక్షంగా ఛైర్మన్, వైస్ ఛైర్మన్గా ఎంపికయ్యారు. మొత్తం 67 సొసైటీల్లో ఛైర్మన్ స్థానానికి ఎన్నికలు జరగ్గా 65 స్థానాల్లో భారాస మద్దతుదారులే ఛైర్మన్లుగా, 15 మంది డైరక్టర్లుగా ఎంపికయ్యారు. ఛైర్మన్గా నిజాం పాషా, వైస్ చైర్మన్ వెంకటయ్య ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో పలుచోట్ల పాలకవర్గాలకు అవిశ్వాస తీర్మాణాలు పెడుతున్నారు. అందులో భాగంగా డీసీసీబీ ఛైర్మన్కు అవిశ్వాస తీర్మాణం పెట్టాలని తొలుత భావించారు. దీని కోసం పెద్ద ప్రక్రియ ఉండటంతో అనారోగ్య కారణాలతో నిజాం పాషాను రాజీనామా చేయించాలన్న ఆలోచనల్లో ప్రస్తుత పాలక మండలి ఉంది. ఇప్పటికే 55 మంది పీఏసీఎస్ ఛైర్మన్లు పార్టీ మారడానికి సిద్ధమైన నేపథ్యంలో ఆయన్ని పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో డీసీసీబీ బడ్జెట్ను ఆమోదించడానికి ప్రస్తుతం డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఛైర్మన్ పీఠం కోసం వనపర్తి, రంగారెడ్డి జిల్లాల నుంచి ఇద్దరు డైరెక్టర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం. వీరూ భారాస నుంచి కాంగ్రెస్లో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇందులో ఓ డైరెక్టర్ తనకు మద్దతుగా పలువురు పీఏసీఎస్ ఛైర్మన్లతో సంతకాలు కూడా సేకరించినట్లు తెలిసింది.
సీఎం పచ్చజెండా ఊపితే..
మహబూబ్నగర్ డీసీసీబీ ఛైర్మన్ పీఠం మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇస్తే తర్వాత జరిగే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రక్రియ ముందుకు సాగడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ లోగా ప్రస్తుతం ఉన్న డీసీసీబీ ఛైర్మన్తో రాజీనామా చేయిస్తే కొత్త సారథి ఎంపిక సునాయాసంగా మారే అవకాశం ఉంది. దీనికోసం ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ కార్పొరేషన్ ఛైర్మన్ను రంగంలోకి దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీనితోపాటు డీసీఎంఎస్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరంతా భారాసకు చెందిన వాళ్లే. త్వరలో ఉమ్మడి జిల్లాకు చెందిన పీఏసీఎస్ ఛైర్మన్లు రేవంత్రెడ్డితో సమావేశమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాల్లో వసతులపై ఆరా
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వస్తువులపై శనివారం తాహసీల్దార్ హరికృష్ణ వివరాలు సేకరించారు. -
చదువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
[ 27-04-2024]
ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి నిర్వహించనున్న వేసవి చదువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫౌండేషన్ కోఆర్డినేటర్ సాయికుమార్ అన్నారు. -
రాష్ట్రంలో విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి: కేసీఆర్
[ 27-04-2024]
తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు