logo

సీఆర్పీఎఫ్‌ జవాన్‌ దుర్మరణం

మండలంలోని వేపూర్‌కి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ సాకలి విష్ణు(26) మంగళవారం అర్ధరాత్రి కోల్‌కతా సరిహద్దులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Published : 29 Mar 2024 03:34 IST

హన్వాడ, న్యూస్‌టుడే: మండలంలోని వేపూర్‌కి చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ సాకలి విష్ణు(26) మంగళవారం అర్ధరాత్రి కోల్‌కతా సరిహద్దులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విష్ణు సోదరుడు శేఖర్‌ తెలిపిన సమాచారం ప్రకారం.. విధి నిర్వహణలో ఉండగా జరిగిన కాల్పుల్లో మృతి చెందాడని అక్కడి హెడ్‌క్వార్టర్‌ కార్యాలయం నుంచి బుధవారం సమాచారం వచ్చిందన్నారు. తాను మరో ఇద్దరం కలిసి అక్కడికి వెళ్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఏడాదిన్నర క్రితమే సీఆర్పీఎఫ్‌లో ఉద్యోగం పొందారని, ప్రొబిషనరీ పూర్తయిందని, ఇటీవలే ఎస్‌బి పోలీసులు వ్యక్తిగత వివరాలపై పూర్తి విచారణ జరిపారని శేఖర్‌ చెప్పారు. ఇంతలో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని వివరించారు. ఈ సంఘటనపై హన్వాడ పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదు. ఎస్‌బి అధికారులు కూడా సమాచారం తెలియదని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని