అమాత్యుడి హామీ అమలయ్యేనా?
దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు.
శ్రీశైలం ప్రాజెక్టు ముంపు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు
సోమశిల తీరంలో తేలిన ముంపు భూములు
కొల్లాపూర్, న్యూస్టుడే : దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. ప్రజల్లో వెలుగులు నింపడం కోసం త్యాగం చేసిన నిర్వాసిత రైతులకు న్యాయం చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పురావస్తు, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీతో ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన భూములను పేద రైతులకు పంచుతామని ఈనెల 25న మంత్రి అధికారికంగా ప్రకటించడంతో ఆనందం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లకు సాగు చేసుకోవడానికి కొంతభూమి దొరుకుతుందని నిర్వాసితులు ఆశపడుతున్నారు. 1999 నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతూ అధికార కాంగ్రెస్, భారాస పార్టీలతోపాటు ప్రస్తుతం అధికార కాంగ్రెస్లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు పెంట్లవెల్లి మండలం మంచాలకట్టలో ప్రకటించిన విధంగా అమలు చేయాలంటూ నిర్వాసిత రైతులు కోరుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1980లో నిర్మాణం చేసిన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్, వనపర్తి, అలంపూర్ నియోజకవర్గాల్లో 65 గ్రామాలు, 1.10 లక్షల ఎకరాలు 12 వేల కుటుంబాలు ముంపునకు గురయ్యాయి. చాలా గ్రామాలు ఆనవాలు లేకుండా జలగర్భంలో కలిసిపోయాయి. కొంతమంది గ్రామాల ప్రజలు కృష్ణా తీరంలోని ఎగువ ప్రాంతానికి తరలివచ్చి నివసిస్తున్నారు. ఉన్న భూములు మునిగిపోవడంతో చాలామంది ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. నదిలో చేపల వేట, కూలీ పనులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ముంపునకు గురై తేలిన తర్వాత భూముల్లో పంటల సాగుకు వెళ్తే అధికార రాజకీయ అండతో కొందరు నేతలు, పెట్టుబడిదారులు నిర్వాసిత రైతులను అడ్డుకుంటూ రానిచ్చేవారు కాదు. కృష్ణాతీరంలో భూ, మత్య్స మాఫియా విస్తరించింది. వరద జలాలు చేరినప్పుడు చేపలవేట, తేలిన తర్వాత పంటలసాగు, అక్రమంగా మట్టి తరలింపు చేసుకుంటూ కొందరు అక్రమార్కులు మాత్రమే బాగుపడుతున్నారు. చాలా మంది నిర్వాసితులకు పంటల సాగు లేకుండా పోయింది. ఆలయాలు, దర్గాలకు చెందిన భూములతోపాటు గ్రామాలు విడిచివెళ్లిన పెద్ద రైతుల భూములను రాజకీయ నేతలు ఆక్రమించుకొని తమ కబ్జాలో పెట్టుకున్నారు.
- ప్రభుత్వపరంగా ముంపు భూములకు పరిహారం ఇచ్చిన కృష్ణాతీరంలో ఈ భూములకు విపరీతంగా డిమాండ్ వచ్చింది. దీంతో ఎకరా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. భూమిలేని నిరుపేదలు డబ్బులు లేకపోవడం, ఉపాధిలేక నష్టపోతున్నారు. ఈ సమస్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి కొల్లాపూర్ మండలం మంచాలకట్ట రైతులు తీసుకెళ్లారు. స్వయంగా ఈనెల 25న మంత్రి ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించి పేదరైతులకు ముంపు భూములను కేటాయిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆనందం నెలకొన్నది. ఏళ్లుగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు ఈ హామీని నెరవేర్చాలంటూ కృష్ణాతీరంలోని నిర్వాసిత గ్రామాల రైతులు కోరుతున్నారు. వందల ఎకరాలు కొందరు నేతల చేతుల్లోనే ఉన్నాయని, పార్టీల పరంగా చూడకుండా ఎలాంటి భూములులేని పేదలందరికి పంపిణీ చేసి న్యాయం చేయాలంటూ వారు మంత్రిని వేడుకొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాల్లో వసతులపై ఆరా
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వస్తువులపై శనివారం తాహసీల్దార్ హరికృష్ణ వివరాలు సేకరించారు. -
చదువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
[ 27-04-2024]
ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి నిర్వహించనున్న వేసవి చదువుల పండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫౌండేషన్ కోఆర్డినేటర్ సాయికుమార్ అన్నారు. -
రాష్ట్రంలో విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి: కేసీఆర్
[ 27-04-2024]
తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఓటు హక్కుపై మహిళలకు అవగాహన
[ 27-04-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. -
పోరుబాటతో గులాబీ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ‘పోరుబాట’ బస్సుయాత్ర శుక్రవారం మహబూబ్నగర్లో విజయవంతం కావడంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. పాలమూరులో రెండు రోజులపాటు కొనసాగే ఈ కార్యక్రమానికి మొదటి రోజు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. -
తుది జాబితాపై కసరత్తు పూర్తి
[ 27-04-2024]
పాలమూరులో ఓటర్ల తుది జాబితాపై కసరత్తు పూర్తయ్యింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్ఎస్ఆర్-2024కు అదనంగా కొత్త ఓటర్లను జత చేసి తుది జాబితాను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. -
గంజాయి దందా.. యువతే నిండా
[ 27-04-2024]
పాలమూరు పట్టణంలో గంజాయి వ్యాపారం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఎక్సైజ్, పోలీసు శాఖలు నిఘా పెట్టినా.. వారి కళ్లు గప్పి గంజాయిని విక్రయిస్తూనే ఉన్నారు. ఈ కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన వాళ్లు కూడా బయటకు వచ్చాక మళ్లీ అదే దందా చేస్తున్నారు. -
పాలమూరు సిబ్బందికి పరీక్ష!
[ 27-04-2024]
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)లో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి అధికారులు ‘పరీక్ష’ నిర్వహించేందుకు సన్నాహాలు చేయటం దుమారం రేపుతోంది. -
35 నామపత్రాల ఆమోదం.. ఏడు తిరస్కరణ
[ 27-04-2024]
మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గానికి దాఖలైన నామపత్రాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకుడు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. -
గుంభనంగా ద్వితీయ శ్రేణి
[ 27-04-2024]
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు ప్రచారంలో తేడా ఉంది. అగ్రనాయకుల హడావుడి తప్పా కింది స్థాయి నాయకుల్లో ఇంకా ఎన్నికల ఉత్సాహం కనిపించడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటికీ కార్యకర్తల్లో ఉత్తేజం కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు రావడంతో అంతటా స్తబ్ధత నెలకొంది. -
అరచేతిలో సకల సమాచారం
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేసింది. డిజిటల్ సాంకేతికత వినియోగించుకుంటూ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అడుగులు వేస్తోంది. -
పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం
[ 27-04-2024]
పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. -
కాంగ్రెస్ అభ్యర్థి గెలవరనే ఆందోళనలో సీఎం
[ 27-04-2024]
మహబూబ్నగర్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గెలిచే పరిస్థితి లేకపోవటంతో తన పదవి ఊడుతుందని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని, అందుకే మహబూబ్నగర్లో తరచూ పర్యటిస్తూ భాజపా అభ్యర్థి డీకే అరుణపై నోరు పారేసుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ విమర్శించారు. -
బీ ఫాం ఉన్న వారికే పార్టీ గుర్తు
[ 27-04-2024]
గ్రామ పంచాయతీ ఎన్నికలు మినహా మిగతా అన్ని ఎన్నికల్లో అభ్యర్థులు రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తే బీ ఫారం అందజేయాల్సి ఉంటుంది. ఒక రాజకీయ పార్టీ తరపున ఏ అభ్యర్థి అయితే బీ ఫారం అందజేస్తారో ఆ అభ్యర్థికే పార్టీ గుర్తు కేటాయిస్తారు. -
ప్రతి ఓటరుకు స్లిప్పు అందేలా చర్యలు: కలెక్టర్
[ 27-04-2024]
ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఉదయ్కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. -
తెల్లజొన్నలకు పచ్చరంగు
[ 27-04-2024]
పచ్చజొన్నలకు మార్కెట్లో విపరీతంగా డిమాండ్ ఉండటంతో జోరుగా కల్తీ జరుగుతోంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతున్న వారు బియ్యంనకు బదులు పచ్చజొన్నలపై ఆసక్తి కనబరుస్తున్నారు. -
తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటాం..
[ 27-04-2024]
నిత్యవసర సరకులు, తినుబండారాలను కల్తీ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సహజ సిద్ధంగా పండిన జొన్నలను కల్తీ చేస్తున్నట్లు సమాచారం ఉంది. -
లక్ష్యం బారెడు... సేకరణ మూరెడు
[ 27-04-2024]
జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ లక్ష్యం సుదూరంగా కనిపిస్తోంది. పౌరసరఫరాలశాఖ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 27 రోజులు కావస్తున్నా ఇంతవరకు అనుకున్న లక్ష్యంలో కనీసం ఒకశాతం కూడా సేకరించలేదు. -
సేవల సౌలభ్యానికి అంగన్వాడీల సర్వే
[ 27-04-2024]
అయిజ పట్టణంలోని భరత్నగర్ కాలనీకి చెందిన శాంతమ్మ టీచర్స్ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పరిధిలో ఉంది. సుమారు అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజూ వెళ్లి రావాలంటే ఇబ్బంది. చిన్నారులను కేంద్రానికి పంపాలన్నా ఇబ్బందే.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు