గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్ల మూసివేత
మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు.
మిడ్జిల్లోని క్లినిక్ను మూసివేసిన మండల వైద్యాధికారి డా.శశికాంత్, అధికారులు
పాలమూరు, మిడ్జిల్, న్యూస్టుడే : మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్లను సీజ్ చేశారు. డీఎంహెచ్వో మాస్ మీడియా అధికారి డా.తిరుపతిరావు కథనం ప్రకారం.. ‘గర్భవిచ్ఛిత్తితో మహిళ మృతి’ శీర్షికతో ఈనెల 22న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఎంహెచ్వో కృష్ణ, ఇతర అధికారులు వేముల గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు సేకరించారు. మహబూబ్నగర్ పట్టణం పద్మావతి కాలనీ వెనక ఉన్న భాగ్యనగర్ కాలనీ పాలకొండ తండాలో క్లినిక్ నిర్వహిస్తున్న వరలక్ష్మి అనే మహిళ ఆబార్షన్ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరలక్ష్మిని విచారించగా తన వద్దకు మిడ్జిల్ మండల కేంద్రంలో క్లినిక్ నడిపే రమేశ్ గర్భిణిని పంపించారని చెప్పారు. పాలకొండ తండాలోని వరలక్ష్మి క్లినిక్ను అధికారులు సీజ్ చేశారు. మిడ్జిల్లో రమేశ్కు చెందిన క్లినిక్ను మండల వైద్యాధికారి డా.శశికాంత్, ఆర్ఐ అంబిక తదితరులు సీజ్ చేశారు. ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని, పోలీసు కేసు కూడా నమోదు చేయించి కఠిన చర్యలు తీసుకుంటామని డా.తిరుపతిరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
[ 06-05-2024]
భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని రాహుల్గాంధీ అన్నారు. ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలో ఆదివారం జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. -
ప్రయాణ ప్రాంగణాల్లో జన జాతర
[ 06-05-2024]
పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాక చిన్నా.. పెద్దా లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఆర్టీసీ ఉగాది ఛాలెంజ్ పేరిట ప్రతి స్టేజీ వద్ద బస్సు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవాలని, అందుకు తగ్గట్లు బహుమతులు కూడా ఉంటాయని ఉత్తర్వులు జారీ చేసింది. -
డిగ్రీ ప్రవేశాలకు వేళాయె
[ 06-05-2024]
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రకటన శుక్రవారం విడుదలైంది. మూడు విడతల్లో జరిగే ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 6 నుంచి ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఎన్నికల్లోనే వినిపించే రైల్వేకూత
[ 06-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలో రైల్వే లైను కోసం నలభై ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. దశాబ్దాలు గడిచినా ఆ కల నేరవేరటం లేదు. మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలో కృష్ణా-వికారాబాద్ రైల్వే లైను ప్రతిపాదన రెండు దశాబ్దాలుగా కొనసాగుతోంది. -
ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. -
రేవంత్ పాలనను కుప్ప కూల్చాలి : ఆర్ఎస్ ప్రవీణ్
[ 06-05-2024]
రాష్ట్రంలో రేవంత్ పాలనను కుప్పకూల్చి, కేసీఆర్ పాలనను తిరిగి తెచ్చుకోవాలని నాగర్కర్నూల్ భారాస పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన రోడ్షోలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజుతో కలిసి మాట్లాడారు. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యం
[ 06-05-2024]
విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండటం వలన, వివాహ శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతో ఇళ్లకు తాళాలు వేసి సొంతూరు, ఇతర గ్రామాలు, పట్టణాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. -
అంజన్నా! నీ భూమి కాపాడుకో
[ 06-05-2024]
అటు రాయచూరు, ఇటు జిల్లా కేంద్రం నారాయణపేట, మరోవైపు మహబూబ్నగర్, హైదరాబాద్ వెళ్లడానికి చక్కని రవాణా సదుపాయం ఉన్న పట్టణం మక్తల్... అంతే కాదు వ్యాపార, ఆధ్యాత్మిక కేంద్రంగానూ ఈ పట్టణానికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. -
బడి బాగుకు రూ.8.71 కోట్లు
[ 06-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.8.71 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో పనులు పూర్తి చేసే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.