ఎత్తు పెంపునకు మోక్షం ఎన్నడో..!
జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపురం ఆనకట్ట (వనదుర్గా) ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ముందుకు సాగడం లేదు. గతంలో నిధులు మంజూరవడంతో పనులు ప్రారంభించగా ఐదేళ్లు కావస్తున్నా ఇంత వరకు పూర్తి చేయలేదు.
న్యూస్టుడే, పాపన్నపేట: జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపురం ఆనకట్ట (వనదుర్గా) ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ముందుకు సాగడం లేదు. గతంలో నిధులు మంజూరవడంతో పనులు ప్రారంభించగా ఐదేళ్లు కావస్తున్నా ఇంత వరకు పూర్తి చేయలేదు. కొల్చారం-పాపన్నపేట మండలాల మధ్య 1905లో మంజీరా నదిపై ఘనపురం ఆనకట్టను నిర్మించగా దీని పూర్తి సామర్థ్యం 0.135 టీఎంసీలు. ఇది ఇలా ఉండగా ఈ ప్రాజెక్టు కింద 21,625 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రాజెక్టుకు రెండు కాల్వలు ఉన్నాయి. మహబూబ్నహర్ కాల్వ ద్వారా కొల్చారం, మెదక్, హవేలి ఘనపూర్ మండలాలకు, ఫతేనహర్ కాల్వ ద్వారా పాపన్నపేట మండలంలోని పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనకట్ట కింద సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో పాటు చివరి ఆయకట్టుకు కూడా నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు పెంపునకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2016లో రూ.43.64 కోట్లతో పనులు ప్రారంభించగా ఐదేళ్లు దాటుతున్నా ఇంకా పనులు పూర్తికాలేదు. మొదట్లో ఎత్తు పెంపు పనుల్లో భాగంగా వరద తాకిడిని తట్టుకునేందుకు పునాది, ఆప్రాన్ పనులను చేపట్టారు. భూసేకరణ, పరిహారం చెల్లించడంలో జాప్యంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇందులో రూ.13.1 కోట్లను భూసేకరణ కోసం, మిగతా వాటిని ఎత్తు పెంపు పనులకు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఆనకట్ట ఎత్తు 462.775 జీటీఎస్ లెవల్ ఉండగా ఎత్తును 464.7 జీటీఎస్ లెవల్కు పెంచాల్సి ఉంది. తద్వారా పాపన్నపేట, కొల్చారం మండలాల్లోని సుమారు 300 మంది రైతులకు చెందిన 191 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఎత్తు పెంచడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలకు పెరగనుంది. దీంతో అదనంగా ఐదు వేల ఎకరాలకు, మరీ ముఖ్యంగా యాసంగిలో సింగూరుపై ఆధారపడకుండా చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. ఎత్తు పెంచే ప్రక్రియలో భాగంగా ముంపునకు గురయ్యే పొలాలకు ఎకరాకు రూ.7.56 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం రూ.13.1 కోట్లకుగాను రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రూ.లక్షలు విలువ చేసే భూములకు ప్రభుత్వం నామమాత్రం పరిహారం ఇస్తుందని గతంలో రైతులు ఆందోళనకు దిగారు. న్యాయంగా పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు కూడా పూర్తిగా రాకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పరిహారాన్ని విడుదల చేసి, ఎత్తు పెంచాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
వరద తాకిడిని తట్టుకునేందుకు ఆప్రాన్ను నిర్మించారిలా..
న్యాయపరమైన పరిహారం చెల్లించాలి..- హన్మంతు, రైతు, కొడుపాక
ముంపునకు గురవుతున్న భూములకు న్యాయపరమైన పరిహారం చెల్లించిన తర్వాతే పనులు మొదలుపెట్టాలి. అధికారులు అంచనా వేసిన భూముల కంటే అధికంగా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఎత్తు పెంచితే ఆయకట్టు పరిధిలోని అన్నదాతలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రతిపాదనలు పంపించాం.. - శ్రీనివాసరావు, ఈఈ, నీటి పారుదల శాఖ
భూసేకరణకు సంబంధించిన పరిహారం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు రావాల్సి ఉంది. అవి రాగానే పనులు ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రంగులు ఎగరాలి.. మెతుకు సీమ మురవాలి
[ 10-05-2024]
ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. -
343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
[ 10-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
ఓటెందుకు వేయాలంటే..
[ 10-05-2024]
ఎంత ఎక్కువ పోలింగ్ నమోదైతే అంత చక్కటి తీర్పు వస్తుందన్నది నిపుణుల మాట. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలో గణనీయంగా పోలింగ్ నమోదవుతున్నా.. -
భారాస అభ్యర్థికి మద్దతిస్తూ తీర్మానం
[ 10-05-2024]
చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ యాదవ సంఘం సభ్యులు మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 10-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. -
వేగులు.. నేతలకు గుబులు
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్నారు. -
రూ.లక్ష వేతనం.. వైద్యసేవలు ఉచితం
[ 10-05-2024]
ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వ్యక్తికి కేంద్రం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. -
ఓటు పవిత్రమైనది
[ 10-05-2024]
ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి. -
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్
[ 10-05-2024]
‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు. -
మోదీతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవు
[ 10-05-2024]
కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. -
12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్
[ 10-05-2024]
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
గురుశిష్యుల ప్రయాణమే.. బ్రహ్మచారి
[ 10-05-2024]
ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం. -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని హతమార్చిన తనయుడు
[ 10-05-2024]
మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 10-05-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
-
ఓడితే గుజరాత్ ఇంటికే.. చెన్నై గెలిస్తే ముందుకే!
-
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
-
ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ట్విస్ట్..!
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్త