ప్రయోగాత్మకం.. మెరుగైన ఆదాయమే లక్ష్యం
అన్నదాతలకు అన్నీ కష్టాలే. ఆరుగాలం శ్రమించినా చివరికి నష్టాలే అన్నట్లుగా ఉంది పరిస్థితి. వ్యయప్రయాసలకు తట్టుకుని పంటలు పండించినా గిట్టుబాటు ధర అనుమానమే. పండ్ల తోటల్లో రైతులకు ఈ సమస్య ఉండదు.
ఎఫ్ఆర్ఎస్లో సిద్ధమవుతున్న మొక్కలు
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్
అన్నదాతలకు అన్నీ కష్టాలే. ఆరుగాలం శ్రమించినా చివరికి నష్టాలే అన్నట్లుగా ఉంది పరిస్థితి. వ్యయప్రయాసలకు తట్టుకుని పంటలు పండించినా గిట్టుబాటు ధర అనుమానమే. పండ్ల తోటల్లో రైతులకు ఈ సమస్య ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది ఇప్పుడు తోటల పెంపకం దిశగా ముందుకు సాగుతున్నారు. డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన మొక్కలు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో సంగారెడ్డిలోని కొండా లక్ష్మణ్ ఫల పరిశోధన స్థానం కార్యాచరణ రూపొందించింది.
నాణ్యమైనవి అందించాలని..
సంగారెడ్డి ఫల పరిశోధన స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ 50 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాలు తోటలున్నాయి. ఇందులో అత్యధికంగా మామిడి 42.20హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. 470 మామిడి రకాలు ఇక్కడ ఉండటం విశేషం. జామ, సీతాఫలం, సపోట తోటలు కూడా ఉన్నాయి. రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలన్న లక్ష్యంతో నర్సరీలను సైతం నిర్వహిస్తున్నారు.
మామిడిపై ప్రధాన దృష్టి..
మొక్కల్ని నాటేందుకు సిద్ధంగా నర్సరీల్లో పెంచుతున్నారు. ఈ సీజన్కు అత్యధికంగా మామిడి మొక్కలు 75వేలు సిద్ధం చేసి విక్రయించారు. కరోండా, ప్యాషన్ ఫ్రూట్, నిమ్మ, జామతోపాటు ఆయుర్వేద మొక్కల్ని పెంచుతున్నారు. మొక్కల్ని అంటుకట్టేందుకు పుల్లల సేకరణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో మదర్ బ్లాక్(తల్లి మొక్కలు)ను ఇక్కడ ఏర్పాటు చేశారు. మదర్ బ్లాక్ ద్వారా 64 మామిడి రకాల మొక్కల్ని పెంచనున్నారు. ఐదేళ్ల కిందటే ఈ బ్లాక్ను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం మొక్కలు అంటుగట్టేందుకు అవసరమైన పుల్లల్ని ఇందులోంచే సేకరిస్తున్నారు.
రెండేళ్లు పరిశీలించిన తర్వాతే..
ప్రస్తుతం ప్రైవేటు నర్సరీల్లో రెండేళ్లు వయస్సు మామిడి మొక్కలకు డిమాండ్ పెరుగుతోంది. ఎఫ్ఆర్ఎస్లో ఏడాది మొక్కలనే విక్రయిస్తున్నారు. వీటిని నాటితేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నా.. రైతులు పెద్ద మొక్కల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొక్కల పెంపకాన్ని ప్రయోగాత్మకంగా కొత్తగా ప్రారంభించారు. వీటిలో కొన్ని మొక్కల్ని ఏడాది కాగానే పరీక్షించనున్నారు. వేర్లు బలంగా ఉన్నాయా లేదా అని గమనిస్తారు. మిగతా మొక్కల్ని విత్తిన రెండేళ్ల తర్వాత మొదట ఎఫ్ఆర్ఎస్లోనే నాటి ఫలితాలను బట్టి నర్సరీల్లో పెద్ద మొక్కల్ని పెంపుపై నిర్ణయం తీసకుంటారు.
అన్నదాతల డిమాండ్కు అనుగుణంగా.. : - రాజ్కుమార్, ఎఫ్ఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త
నాణ్యమైన మొక్కల్ని నర్సరీల్లో పెంచుతున్నాం. తోటలు వేసుకునే వారు ఇక్కడి నుంచి కొనుగోలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఎఫ్ఆర్ఎస్ నుంచి మొక్కల కొనుగోలుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వస్తుంటారు. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని నర్సరీలో పెంచే మొక్కల సంఖ్యను పెంచుతున్నాం. పెద్ద మొక్కల పెంపకాన్ని ఈసారి ప్రయోగాత్మకంగా ప్రారంభించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు రంగులు ఎగరాలి.. మెతుకు సీమ మురవాలి
[ 10-05-2024]
ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. -
343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
[ 10-05-2024]
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. -
ఓటెందుకు వేయాలంటే..
[ 10-05-2024]
ఎంత ఎక్కువ పోలింగ్ నమోదైతే అంత చక్కటి తీర్పు వస్తుందన్నది నిపుణుల మాట. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలో గణనీయంగా పోలింగ్ నమోదవుతున్నా.. -
భారాస అభ్యర్థికి మద్దతిస్తూ తీర్మానం
[ 10-05-2024]
చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ యాదవ సంఘం సభ్యులు మెదక్ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి ఓట్లు వేస్తామని గురువారం ఏకగ్రీవ తీర్మానం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
ప్రతిష్ఠాత్మకం.. సార్వత్రికం
[ 10-05-2024]
పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూనే సొంత నియోజకవర్గంలో మెజార్టీ సాధించడం జహీరాబాద్ లోక్సభ పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. -
స్థానిక నాయకా.. బాధ్యత నీదిక!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలు ఏడు అసెంబ్లీ నియోజవర్గాలకు విస్తరించి ఉండటంతో సమయాభావంతో అభ్యర్థులు, స్టార్ ప్రచారకర్తలు అన్నిచోట్లా రోడ్డుషోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు చేపట్టలేరు. -
వేగులు.. నేతలకు గుబులు
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గరపడింది. ఈ నెల 13న పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటు పవిత్రమైనది
[ 10-05-2024]
ఓటు పవిత్రమైనది. దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది మన బాధ్యతగా గుర్తించాలి. -
నిజమైన హిందూ ధర్మ పరిరక్షకుడు కేసీఆర్
[ 10-05-2024]
‘శత చండీ హోమం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, భాజపా ముఖ్యమంత్రులు ఎవరూ ఈ హోమం చేయలేదు. -
మోదీతో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవు
[ 10-05-2024]
కేంద్రంలో నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఉండవని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. -
12 వేల కోట్లతో అభివృద్ధి చేశా: బండి సంజయ్
[ 10-05-2024]
కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీలు ఇచ్చి మోసం చేసిందని, వీటి అమలుకు ప్రశ్నించేది, కోట్లాడేది తానేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
గురుశిష్యుల ప్రయాణమే.. బ్రహ్మచారి
[ 10-05-2024]
ముప్పై ఏళ్ల గురుశిష్యుల కలల ప్రయాణంతో పురుడుపోసుకుంది బ్రహ్మచారి చిత్రం. -
మద్యం తాగొద్దన్నందుకు తండ్రిని హతమార్చిన తనయుడు
[ 10-05-2024]
మద్యం తాగి కుటుంబ సభ్యులను హింసిస్తున్నావని, పద్ధతి మార్చుకోవాలని సూచించిన తండ్రిని, తనయుడు కత్తితో పొడిచి చంపిన ఘటన సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. -
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు
[ 10-05-2024]
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నిందితుణ్ని కుకునూరుపల్లి పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?