logo

వారధి నిర్మిస్తేనే వానాకాలంలో రాకపోకలు

వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో భారీ వర్షాలు కురిసినప్పుడు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి.. రాయికోడ్‌ మండలంలోని కుస్నూర్‌ సమీపంలో పెద్ద వాగుపై వారధి నిర్మాణం చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులను విన్నవిస్తూనే ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

Published : 02 Jun 2023 01:55 IST

వంతెన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో భారీ వర్షాలు కురిసినప్పుడు రోజుల పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి.. రాయికోడ్‌ మండలంలోని కుస్నూర్‌ సమీపంలో పెద్ద వాగుపై వారధి నిర్మాణం చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులను విన్నవిస్తూనే ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మండలంలోని రాయికోడ్‌ కూడలి నుంచి న్యాల్‌కల్‌ మండలంలోని రాఘవాపూర్‌ వరకు తారు రహదారి నిర్మాణం చేపడుతున్నారు. ఈ మార్గంలోని వారధిని విస్మరించారు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే పెద్ద వాగు వద్ద ఉన్న లో-లెవల్‌ వంతెనపై నుంచి వరద భారీగా ప్రవహిస్తుంది. రాకపోకలు నిలిచిపోతాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చొరవచూపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు.

న్యూస్‌టుడే, రాయికోడ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని