ఉత్కంఠకు తెర
మెదక్ నియోజకవర్గంలో భాజపా టికెట్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రెండో జాబితాలో నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించిన అధిష్ఠానం, మెదక్కు వెల్లడించలేదు.
విజయ్కుమార్కు మెదక్ కమలం టికెట్
సమావేశంలో మాట్లాడుతున్న విజయ్కుమార్
న్యూస్టుడే, మెదక్: మెదక్ నియోజకవర్గంలో భాజపా టికెట్ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రెండో జాబితాలో నర్సాపూర్ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించిన అధిష్ఠానం, మెదక్కు వెల్లడించలేదు. గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో అభ్యర్థిని ఖరారు చేసింది. ఇక కమలం ప్రచారంలోకి దిగనుంది.
సాఫ్ట్వేర్ నుంచి: నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్కుమార్ పీజీ పూర్తి చేశారు. 2000లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కెరీర్ ప్రారంభించారు. అమెరికా, కెనడాల్లో వివిధ కంపెనీల్లో విధులు నిర్వహించారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల వైపు దృష్టి సారించారు. 2014లో స్వదేశానికి చేరుకున్న ఆయన ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, స్వగ్రామం నిజాంపేటలో సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ఈ క్రమంలో 2019లో భారాసలో చేరి నిజాంపేట జడ్పీటీసీ టికెట్ పొంది విజయం సాధించారు. భారాసలో ఉన్న సమయంలో మొదట స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అనుచరుడిగా కొనసాగిన ఆయన ఆ తర్వాత ఎమ్మెల్సీ శేరిసుభాష్రెడ్డి వర్గంలో చేరారు. అనంతరం ఆగస్టులో భారాసకు రాజీనామా చేసి భాజపాలో చేరారు.
రెండు నెలలకే..: నియోజకవర్గం నుంచి భాజపా తరఫున 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జిల్లా అధ్యక్షుడితో పాటు, పార్టీ రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న నేతలున్నారు. చివరకు రెండున్నర నెలల కిందట పార్టీలో చేరిన పంజా విజయ్కుమార్కు టికెట్ దక్కడం గమనార్హం. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు భాజపా చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆశీస్సులు ఉండడం, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో విజయ్కుమార్కు అభ్యర్థిత్వం ఖరారైందని ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని రెండు అసెంబ్లీ టికెట్లను వెనకబడిన తరగతులకు(బీసీ) ఇవ్వడం విశేషం. మరో వైపు మెదక్ టికెట్ ఆశించిన 12 మందిలో ఒక్కరికే అభ్యర్థిత్వం ఖరారు కాగా, మిగతా ఆశావహులు పార్టీకి పనిచేస్తామని ఇటీవల ఏడుపాయల్లో ప్రకటించారు. టికెట్ ఎవరికి వచ్చినా అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతామని సమావేశంలో నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు..
[ 28-04-2024]
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం సదాశివపేట పట్టణంలో చోటుచేసుకొంది. -
లోక్సభ నియోజకవర్గ ఓటర్లు @ 18.28 లక్షలు
[ 28-04-2024]
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. -
ఎండ ప్రచండం.. ప్రచారానికి గండం!
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి తొలి అంకం ముగిసి అభ్యర్థుల లెక్కతేలింది. ఇక ప్రచారం మరింతగా వేడెక్కనుంది. -
భారాస హయాంలోనే తెలంగాణ అభివృద్ధి: పద్మ
[ 28-04-2024]
పద్నాలుగు ఏళ్ల పోరాటం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని, అనంతరం ప్రభుత్వం ఏర్పాటయ్యాక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపి...అన్ని రంగాలను ముందుకు నడిపి తొమ్మిదిన్నరేళ్లలో భారాస అధినేత కేసీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా -
కాంగ్రెస్ను గెలిపిస్తేనే పురోగతి
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మెదక్ అభివృద్ధి జరుగుతుందని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. -
డార్మిటరీలో స్నేహం.. చోరీల వ్యూహం
[ 28-04-2024]
ఎంజీబీఎస్ వద్ద ఉన్న డార్మిటరీలో పరిచయమై సెల్ఫోన్, ద్విచక్రవాహనాలను దొంగలిస్తూ జల్సాలు చేస్తున్న ఇద్దరు నిందితులను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. -
వక్ఫ్బోర్డు స్థలాల్లో ఆగని ఆక్రమణల పర్వం
[ 28-04-2024]
రాజకీయ పలుకుబడి ధీమాతో కబ్జాదారులు వక్ఫ్బోర్డు స్థలాల్లో ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. ఇటీవల వక్ఫ్బోర్డుకు ఛైర్మన్ను నియమించిన నేపథ్యంలోనైనా వాటి స్థలాల్లో ఆక్రమణలకు అడ్డుకట్ట పడుతుందని భావించినా... -
తెలంగాణ గాంధీ కేసీఆర్: చింతా ప్రభాకర్
[ 28-04-2024]
ప్రాణాల సైతం లెక్కచేయకుండా తెలంగాణ కోసం పోరాడిన కేసీఆర్ తెలంగాణ గాంధీ అని సంగారెడ్డి ఎమ్మెల్యే, భారాస జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. -
పెరుగుతుందా.. తగ్గుతుందా..!
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందించుకుని ప్రచారం చేస్తున్నాయి. జహీరాబాద్ లోక్సభ పరిధిలో మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో పోలింగ్శాతం ప్రభావంపై ఆయా పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. -
కేసీఆర్ ఒక్కరే!
[ 28-04-2024]
గజ్వేల్ నుంచి పార్లమెంటు బరిలో గెలిచిన నేతగా కేసీఆర్ ఒక్కరే రికార్డు సృష్టించారు. గజ్వేల్ నియోజకవర్గం 2008 వరకు అప్పటి సిద్దిపేట లోక్సభ స్థానం పరిధిలో ఉండేది. -
పోలింగ్ కేంద్రాలు.. సమగ్ర వివరాలు
[ 28-04-2024]
ఈ సారి లోక్సభ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎలాంటి అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఉండేలా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. -
ఓట్లు కురిసె.. ఆధిక్యం మెరిసె..
[ 28-04-2024]
పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధిస్తేనే ముందంజలో నిలుస్తారు. ఇదే ఎన్నికల్లోనూ వర్తిస్తుంది. తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు ఓట్ల ఆధిక్యమే కీలకం. అందుకే పోటీదారులు దీనిపై ప్రత్యేక దృష్టిసారిస్తారు. -
హైదరాబాద్ వీడి చేవెళ్లలో చేరి..
[ 28-04-2024]
జిల్లా కేంద్రమైన వికారాబాద్, తాండూరు, చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్లు 2008 వరకు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉండేవి. -
ఎన్నికల సంఘం వాట్సాప్ ఛానల్...
[ 28-04-2024]
సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటోంది ఎన్నికల సంఘం. ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. -
61వ రాజ్యాంగ సవరణతో..
[ 28-04-2024]
తొలినాళ్లలో ఓటు వేయడానికి కనీస వయసు 21 ఏళ్లుగా ఉండేది. దీన్ని రాజ్యాంగంలోనూ పొందుపర్చారు. అయితే 1988లో 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించాలని అప్పటి పాలకులు నిర్ణయించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!