logo

చెప్పుల దండ వేసినందుకు భారాస నుంచి సస్పెన్షన్‌

భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్‌ 78వ బూత్‌ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు.

Published : 18 Apr 2024 02:12 IST

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: భారాస అభ్యర్థి ప్రచార రథంపై ఉన్న చిత్రపటానికి చెప్పుల దండ వేసిన కాసులాబాద్‌ 78వ బూత్‌ అధ్యక్షుడు యాదగిరిపై చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు యాదగిరిని మిరుదొడ్డి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. తన భూమిని మరొకరి పేరుపై వచ్చేలా వెంకట్రామిరెడ్డి చేశారని ఆరోపిస్తూ కాసులాబాద్‌కు చెందిన యాదగిరి, తన భార్య, తల్లితో కలిసి భారాస ప్రచార రథంపై చెప్పుల దండ వేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత విద్వేషాలతో పార్టీని బలహీనపరిచేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని అంజిరెడ్డి మాట్లాడుతూ అన్నారు. భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై అనుచితంగా వ్యవహరించడం సరికాదన్నారు. భూ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. ఆ వివాదంలో మాజీ కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి ఎలాంటి ప్రమేయం లేదన్నారు. వైస్‌ ఎంపీపీ రాజులు, గ్రామ అధ్యక్షుడు మల్లేశం, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని