లక్ష్యం దిశగా ఉపాధి అడుగులు
రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారితో కూలీల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇలాంటి తరుణంలో పల్లెల్లోని రోజువారీ కూలీలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం వరంగా మారింది. ఈ పథకం కింద ఉన్న ఊళ్లోనే పనిని చేపడుతూ కుటుంబాలను సాకుతున్నారు. కరోనాతో ఉపాధి కొరవడంతో ఎక్కువ శాతం మంది ఉపాధి హామీ పథకం వైపు మొగ్గుచూపారు. దీంతో నిర్దేశిత గడువుకు ముందుగానే లక్ష్యం పూర్తికానుంది. అధికారుల ప్రత్యేక
రాజపేట శివారులో హరితహారంలో మొక్కలు నాటేందుకు శుభ్రం చేస్తున్న ఉపాధి కూలీలు
రాజపేట, న్యూస్టుడే: రెండేళ్లుగా కొవిడ్ మహమ్మారితో కూలీల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇలాంటి తరుణంలో పల్లెల్లోని రోజువారీ కూలీలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం వరంగా మారింది. ఈ పథకం కింద ఉన్న ఊళ్లోనే పనిని చేపడుతూ కుటుంబాలను సాకుతున్నారు. కరోనాతో ఉపాధి కొరవడంతో ఎక్కువ శాతం మంది ఉపాధి హామీ పథకం వైపు మొగ్గుచూపారు. దీంతో నిర్దేశిత గడువుకు ముందుగానే లక్ష్యం పూర్తికానుంది. అధికారుల ప్రత్యేక చొరవ తీసుకోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలంలో ఇప్పటికే నూరుశాతం కూలీలకు పనులు చేయగలిగారు. అడ్డగూడూరు, ఆత్మకూర్(ఎం), వలిగొండ, గుండాల మండలాలు యాభై శాతంలోపు పనులతో వెనుకంజలో ఉండగా.. మిగతా మండలాలు లక్ష్యానికి చేరువలో ఉన్నాయి.
ఈసారి చేపట్టిన పనులివీ..
జిల్లాలో మొత్తం 17 మండలాలకు గానూ 3,42,267 కార్డుదారులు ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా బీడు భూముల అభివృద్ధి, ఫాంపాండ్, వ్యవసాయ బావులకు రహదారుల నిర్మాణాలు, హరితహారం, భూమి చదును, నర్సరీల సంరక్షణ, మట్టికట్టల లాంటి పనులు చేపట్టారు. మరో రెండు నెలల గడువు ముగిసేలోగా మరికొన్ని మండలాలు నూరుశాతం పనిదినాలు పూర్తి చేసుకొనే జాబితాలో చేరతాయనడంలో సందేహం లేదు.
సమన్వయంతో లక్ష్యం చేరాం
-పరశురాములు, ఏపీవో, రాజపేట
రాజపేట మండలంలో మొత్తం 22,973 జాబ్కార్డుదారులున్నారు. జిల్లా అధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని వారి సూచనల మేరకు ఎంపీడీవో నల్ల రామరాజు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో రెండు నెలల ముందుగానే చేరుకోగలిగాం. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయంలో అధికారుల సలహాలను పాటించి పూర్తి స్థాయిలో పనులు కల్పించడం కలిసివచ్చింది. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం.
ప్రణాళికలు రూపొందించాం
-ఉపేందర్రెడ్డి, డీఆర్డీవో, యాదాద్రి భువనగిరి
ఈ ఆర్థిక సంవత్సరంలో గడువుకు ముందే ఎంచుకున్న లక్ష్యం చేరేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రణాళికలు రూపొందించాం. ముఖ్యంగా రాజపేట, ఆలేరు మండలాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఉపాధి పనులు జరుగుతున్న తీరుపై మిగతా మండలాల అధికారులనూ అప్రమత్తం చేశాం. పనిదినాలు పూర్తి చేసుకున్న జిల్లాగా యాదాద్రికి పేరు తీసుకువచ్చేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యాదాద్రిలో హరిహరుల ఆరాధనలు
[ 07-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరుల ఆరాధనలు ఆయా ఆలయాల ఆచారంగా కొనసాగాయి. ప్రధానాలయంలో వైష్ణవ పద్ధతిలో పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య పూజలు నిర్వహించారు -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ
[ 07-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
అభివృద్ధిని వివరించి.. ఆమోదీంచాలని అభ్యర్థించి..!
[ 07-05-2024]
భువనగిరి పార్టీ అభ్యర్థులు బూర నర్సయ్యగౌడ్, సైదిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన జనసభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. -
ఓటుహక్కుపై అవగాహన పెరిగేలా ప్రచారం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ చిట్యాల సమీపంలోని గాంధీగుడి ఆధ్వర్యంలో నల్గొండలో ప్రచారం నిర్వహించారు. -
సౌర విద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు
[ 07-05-2024]
విద్యుత్తు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్తులో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రానుంది. -
ఆమె ఇంటికే పరిమితమైతే..అంతే..!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది. అతివలు తలచుకుంటే అందలం ఎక్కడం పక్కా అని తెలుస్తుంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లుకు ఇబ్బందులు కలగొద్దు
[ 07-05-2024]
ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. -
మాట తప్పితే రాజీనామా చేస్తావా..!
[ 07-05-2024]
ప్రియమైన లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థికి సమస్కారం. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్న తలంపు. -
అల్లాపురం విద్యార్థి.. సికింద్రాబాద్ అభ్యర్థి
[ 07-05-2024]
చౌటుప్పల్ మండలం అల్లాపురానికి చెందిన విద్యార్థి రాసాల వినోద్ యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు -
రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన
[ 07-05-2024]
‘ముఖ్యమంత్రి కాగానే రేవంత్రెడ్డి ఈ (భువనగిరి) ప్రాంత ప్రజల మేలు కోరి మూసీ ప్రక్షాళనను రూ.50 వేల కోట్లతో చేపడుతామని వెల్లడించారు. -
సామాజిక వేదికలు.. ప్రచారాస్త్రాలు
[ 07-05-2024]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు. -
నాన్నకు భారమై.. అమ్మకు దూరమై..!
[ 07-05-2024]
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర