Telangana News: ఆసుపత్రిలో చూపిస్తానని.. భార్య పేరిట ఆస్తి రిజిస్ట్రేషన్
మాయమాటలతో వృద్ధురాలి స్థిరాస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
కట్టంగూరు: మాయమాటలతో వృద్ధురాలి స్థిరాస్తిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కల్మెరకు చెందిన బెల్లి ఎల్లమ్మ (80) జ్వరంతో 20 రోజుల క్రితం బాధపడుతూ, తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. ఆ సమయంలో ఆమె బంధువు అదే గ్రామానికి చెందిన బెల్లి వీరయ్య ఆసుపత్రిలో చూపిస్తానని కరోనా పరీక్షలు జరిపిస్తానని ఎల్లమ్మతో నమ్మబలికాడు. ఆమె కుటుంబ సభ్యులకు తెలియకుండా కట్టంగూరు తహసీల్ కార్యాలయానికి తీసుకెళ్లి, ఎల్లమ్మ పేరుపై ఉన్న 27 గుంటల స్థిరాస్తిని తన భార్య వాణి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. బాధితురాలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శనివారం తెలిపారు.
నా భర్తను ఎస్సై కొట్టారు: బెల్లి వాణి, వీరయ్య భార్య
మేము బెల్లి ఎల్లమ్మ, ఆమె కుమారుడు యాదయ్యకు డబ్బులిచ్చి 27 గుంటల స్థిరాస్తిని నా పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఇప్పుడు మనవళ్ల మద్దతుతో మాపై తప్పుడు కేసు పెట్టింది. ఇదే అదనుగా కట్టంగూరు ఎస్సై నాభర్త వీరయ్యను కొట్టారు. వీరయ్య ఆస్వస్థతకు గురి కావడంతో నల్గొండ ప్రభుత్వాసుపత్రితో చికిత్స చేయిస్తున్నాం.
ప్రచారంలో వాస్తవం లేదు: విజయ్కుమార్, ఎస్సై
అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఎల్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెల్లి వీరయ్యను పోలీస్ స్టేషన్కు పిలిపించి, వీరయ్య సోదరుడు, గ్రామ పెద్ద సమక్షంలో వివరాలు తెలుసుకొని పంపించాము తప్పితే ఎవరిపై చేయి చేసుకోలేదని ఎస్సై విజయ్కుమార్ తెలిపారు. నిఘా నేత్రాల సమక్షంలోనే విచారణ జరిపి పంపించామని, తాను కొట్టినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ‘న్యూస్టుడే’కు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మే డేను జయప్రదం చేయండి
[ 28-04-2024]
ప్రపంచ కార్మిక దినోత్సవమైన మే డేను యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించి ఎర్ర జెండాలు ఎగురవేసి కార్మికుల ఐక్యతను చాటాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు పిలుపునిచ్చారు. -
భాజపాతోని మాదిగలకు న్యాయం
[ 28-04-2024]
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎస్సీ మోర్చా కార్యకర్తల సమ్మేళనం ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బుగ్గ దేవేందర్ అధ్యక్షతన పట్టణంలో ఆదివారం జరిగింది. -
హస్తంలోకి ఆహ్వానం..!
[ 28-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. రెండు స్థానాలకు ఇన్ఛార్జులుగా మంత్రి ఉత్తమ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహరిస్తున్నారు. -
పక్షం రోజుల లక్ష్యం.. ప్రచారాస్త్రాలు సిద్ధం
[ 28-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులెవరో ఇప్పటికే తేలిపోవడంతో నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రచారం వేడెక్కుతోంది. -
వారు ఆడిందే ఆట.. కాసుల వేట
[ 28-04-2024]
కంచే చేను మేసినట్లుగా.. ఔషధ దుకాణాల్లో జరిగే అవినీతిని అరికట్టాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో రూ.లక్షలు వసూళ్లు చేసుకుని రూ.కోట్ల విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఇటీవల ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. -
నిద్రలేమి.. నిండు ప్రాణాలు బలి
[ 28-04-2024]
నిద్రలేమి కారణంగానే ఈ మధ్యలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారి వెంబడి నిలిపి ఉంచిన వాహనాలను నేరుగా వచ్చి ఢీకొట్టడం వెనక గత రాత్రి డ్రైవర్లకు నిద్ర లేకుండా ఉండటం, ఏకాగ్రత లోపించడమే ప్రధాన కారణం. -
ఆయిల్పాం తోటలకు నీటి కొరత
[ 28-04-2024]
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రోత్సహిస్తున్న ఆయిల్పాం సాగుపై కరవు ప్రభావం పడుతోంది. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు అందక, ఈ తోటల్లో బిందుసేద్యం పరికరాలు సరిగా పనిచేయక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పంచనారసింహులకు భక్తుల పూజలు
[ 28-04-2024]
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం నిర్వహించిన పూజారులు బిందేతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. -
ఆటాడుకుందాం..రా..!
[ 28-04-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు చరవాణులకే పరిమితం కాకుండా.. వాటి నుంచి చిన్నారుల దృష్టి మళ్లించి క్రీడా నైపుణ్యం వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. -
సంఘాలను కాదని.. సంస్థకు అప్పగించి..
[ 28-04-2024]
పురపాలక సంఘం పరిధిలో చేపట్టాల్సిన పనులకు ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. అర్హులకు లబ్ధి చేకూరకపోగా పనులు ముందుకు సాగడం లేదు. -
లెక్కకు మించితే వేటే
[ 28-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల ఖర్చులపై ఎన్నికల సంఘం కన్నేసింది. -
లోక్సభ ప్రచారంలో.. స్థానిక వ్యూహం
[ 28-04-2024]
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆరు మాసాలకే జరుగుతున్న లోక్సభ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు డిజిటల్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. -
ద్విసభ.. పదేళ్ల ముచ్చట
[ 28-04-2024]
లోక్సభకు 1951లో తొలిసారి ఎన్నికలు జరగగా హైదరాబాద్, ఆంధ్రా ప్రాంతానికి 1952లో జరిగాయి. మద్రాసు రాష్ట్రం పరిధిలోని ఆంధ్రా ప్రాంతానికి, హైదరాబాద్ పరిధిలోని కొన్ని ప్రాంతాలకు ఇద్దరు చొప్పున సభ్యులను ఎన్నుకునే వారు. -
మరో ఉద్యమానికి శ్రీకారం: జగదీశ్రెడ్డి
[ 28-04-2024]
ఉమ్మడి రాష్ట్రంలో 14 ఏళ్ల పోరాటం చేసి దిల్లీ పెద్దల మెడలు వంచి రాష్ట్రం సాధించిన భారాస మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
-
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?