సృజనాత్మక చిత్రం.. క్షణాల్లో ఆవిష్కృతం
సృజనాత్మకమైన చిత్రాలు గీయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు ఓ యువ చిత్రకారిణి. కుంచెలను ఉపయోగించకుండా కూరగాయలు, వివిధ రకాల
కాకరకాయ ముక్కలు బ్రష్గా ఉపయోగించి అరుణ వేసిన చిత్రాలు
మఠంపల్లి, న్యూస్టుడే: సృజనాత్మకమైన చిత్రాలు గీయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు ఓ యువ చిత్రకారిణి. కుంచెలను ఉపయోగించకుండా కూరగాయలు, వివిధ రకాల పండ్లు, పూలతో పాటు వంటగదిలో వాడే వస్తువులతో జీవ కళ ఉట్టిపడే రంగుల చిత్రాలు క్షణాల్లో గీసి అబ్బురపరుస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎలాంటి నైపుణ్యం లేకున్నా బొమ్మలను ఆలవోకగా గీసే శిక్షణను యూట్యూబ్ ద్వారా ఉచితంగా ఇస్తూ తన కళాభిమానాన్ని చాటుకుంటున్నారు. బాల్యం నుంచి ఉన్న అభిరుచే ఈ రంగంలో రాణించేందుకు దోహద పడుతోందని చెబుతోన్న మన్నెం అరుణ స్వగ్రామం మఠంపల్లి. ఎమ్మెస్సీ, బీఎడ్ పూర్తి చేసిన ఆమె ఎడ్సెట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, ఓయూ పరిధిలో జరిగిన పీజీ సెట్లో 24వ ర్యాంకు సాధించారు. పదో తరగతిలోనూ 503 మార్కులతో ఈ సరస్వతీ పుత్రిక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ‘అరుణంజయ ఆర్ట్స్’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి చిత్రకళపై ఆసక్తి ఉన్న వారికోసం ఇప్పటి వరకు 82 వీడియోలు అప్లోడ్ చేశారు. శిక్షణ పొందే వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు.
అగ్గిపుల్లలను బ్రష్గా వాడి గీసిన సుందర చిత్రం
కళకు కాదేదీ అనర్హం
మండల కేంద్రానికి చెందిన మన్నెం నారాయణరెడ్డి, కళావతి దంపతుల కూతురు అరుణ చదువుల్లో రాణిస్తూనే చిత్రకళపై అభిరుచి పెంచుకున్నారు. బొమ్మలను గీయడంలో వైవిధ్యాన్ని చూపాలన్న తలంపుతో బ్రష్లను వాడకుండా కాకర, వంకాయ, బెండ, క్యారెట్ తదితర కూరగాయలను భిన్న ఆకృతులలో కోసి వాటితో రంగులు అద్దుతూ వివిధ చిత్రాలకు రూపమిస్తున్నారు. చార్టులపై ప్రకృతి సౌందర్యాన్ని గోడలపై ప్రతిబింబించేలా మయూరం, కొలనులో నడయాడే హంసలు వంటి గోడ చిత్రాలు(వాల్స్టిక్కర్స్) అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో అందుబాటులో ఉండే కూరగాయలు, పూలు, గరిటెలు, చెంచాలు, పప్పుగుత్తి తదితర వస్తువులను ఉపయోగించి రంగుల బొమ్మలు వేయడంలో నైపుణ్యాన్ని సాధించి శిక్షకులకు తర్ఫీదు ఇస్తున్నారు.
బీరకాయ పీచుతో రంగులద్దిన చిత్రం
బాపూనే స్ఫూర్తి:
మన్నెం అరుణ చిత్రకారిణి, మఠంపల్లి
ప్రముఖ చిత్రకారుడు బాపు గీసిన బొమ్మలంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్పూర్తితోనే చిత్రాలు వేయడం నేర్చుకున్నాను. ఎన్నో చిత్రాలు వేశాను. ఆబాల గోపాలాన్ని అలరించే బొమ్మలు వేయాలన్న పట్టుదల, అందరూ ఆలవోకగా ఈ కళను నేర్చుకోవాలన్న సంకల్పం ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టేలా చేశాయి. ప్రస్తుతం టెట్కు సిద్ధమవుతున్నాను. 15 రోజుల తర్వాత మరిన్ని వీడియోలు కళాసాధకుల కోసం అప్లోడ్ చేస్తాను.
బాపు స్ఫూర్తితో అరుణ వేసిన మనసును దోచే చిత్రాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తి దారుణ హత్య
[ 10-05-2024]
మండలంలోని ఆంగోతుతండాలో ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగ్రు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు -
నిర్లక్ష్యమా.. అవగాహన లోపమా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే వారిలో 90శాతం పైగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటారు -
విమర్శలు చేసే.. విజయం కాంక్షించే
[ 10-05-2024]
భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి
[ 10-05-2024]
ప్రజలు గత 25 ఏళ్లుగా తనను గెలిపించి.. మంత్రి అయ్యే వరకు తీసుకొచ్చారని శాశ్వతంగా గుర్తు ఉండేలా తాను అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
పారదర్శకంగా లోక్సభ ఎన్నికలు
[ 10-05-2024]
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.. -
మూత్ర పిండం.. పొంచి ఉన్న గండం
[ 10-05-2024]
మానవునికి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. వాతావరణ పరిస్థితుల్లో భాగంగా కిడ్నీ గండం ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. -
తస్మాత్ జాగ్రత్త.. స్థానికేతరులు వెళ్లాల్సిందే!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు ముందు జిల్లాలో 48గంటల నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నారు. -
నిరంతరం నిఘా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. -
నాడు హవా.. నేడు నామమాత్రం
[ 10-05-2024]
ఉమ్మడి జిల్లాలో నాడు కమ్యూనిస్టులదే హవా. జాతీయస్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది వారే. ఎన్నిక ఏదైనా గెలుపు కమ్యూనిస్టులదే అనే స్థాయి. -
సరిహద్దులు దాటుతున్న తెలంగాణ మద్యం
[ 10-05-2024]
వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు. -
గట్టెక్కేలా.. ప్రత్యేక వ్యూహం
[ 10-05-2024]
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి -
నిర్బంధం చేస్తేనే.. వస్తారా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు మరో రెండు రోజులు గడువు పెంచడం చూస్తే విద్యావంతులు కూడా ఓటు వేసేందుకు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వ్యభిచారం చేయడానికి వచ్చావా? పోలీసులకు పట్టిస్తాం
-
పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే: కోవై సరళ
-
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
-
మేనత్తను అవమానిస్తే ఆనందిస్తారా?: కాంగ్రెస్ ఎమ్మెల్యేపై డీకే అరుణ ఫైర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జైలుకు పోతానన్న భయంతో జగన్ లండన్కు: సీఎం రమేశ్