అంతులేని కథలు..!
సూర్యాపేట జిల్లాలో యూఐ (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసుల సంఖ్య రోజురోజుకూ కుప్పలుతెప్పలుగా పేరుకుపోతోంది. కొన్ని ముఖ్యమైన కేసులనూ యూఐ జాబితాల్లోకి నెట్టడంతో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలు, కిడ్నాప్లు, చోరీ తదితర కేసుల విచారణను సైతం పోలీసు అధికారులు అటకెక్కిస్తున్నారు. మరికొన్ని కేసులు సంవత్సరాలుగా విచారణ
సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే
సూర్యాపేటలో హత్యకు గురైన ఆలేటి జానకమ్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (పాత చిత్రం)
సూర్యాపేట జిల్లాలో యూఐ (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసుల సంఖ్య రోజురోజుకూ కుప్పలుతెప్పలుగా పేరుకుపోతోంది. కొన్ని ముఖ్యమైన కేసులనూ యూఐ జాబితాల్లోకి నెట్టడంతో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలు, కిడ్నాప్లు, చోరీ తదితర కేసుల విచారణను సైతం పోలీసు అధికారులు అటకెక్కిస్తున్నారు. మరికొన్ని కేసులు సంవత్సరాలుగా విచారణ దశలోనే ఉంటున్నాయి. జిల్లాలోని ‘యూఐ’ కేసులపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
విచారణకు ఆధారాలే కీలకం..
తప్పు చేసిన ప్రతి నేరస్థుడు ఎక్కడో ఒకచోట చిన్న ఆధారాన్ని వదిలి వెళ్తాడన్నది పోలీసుల విశ్వాసం. అలాంటి చిన్న ఆధారమే కేసు మిస్టరీని బహిర్గతం చేస్తుంది. అలవాటుగా నేరాలకు పాల్పడే నేరస్థుడి విధానం ఒకలాగా.. కొత్తగా నేరం చేసిన వారైతే మరోలా నేరస్వభావాన్ని పోలీసులు అంచనా కట్టగలుగుతారు. ఇటీవల కాలంలో కొన్ని కేసులు మాత్రం అంతులేని కథలుగానే మిగిలిపోతున్నాయి. నేరస్థులు తెలివిగా ప్రవర్తిస్తున్నారా..? నేరస్థులు వదిలేస్తున్న ఆధారాలను పోలీసులు పసిగట్టలేకపోతున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు పంచాయితీలకే మొగ్గు...
జిల్లాలో ఇటీవల పోలీసుల పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా ఠాణాల్లో ఎస్సైలు ప్రైవేటు పంచాయతీలకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మూడు నెలల క్రితం సూర్యాపేట గ్రామీణ ఎస్సై లవకుమార్ ఓ హోటల్ నిర్వాహకుడి నుంచి రూ.1.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే. ఇటీవల తిరుమలగిరి ఎస్సై లోకేశ్పై ఆరోపణలు రావడంతో ఎస్పీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. మరోవైపు కొన్ని ఠాణాల్లో ఇసుక దందాలో ఎస్సైలు నిత్యం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు హల్చల్ చేస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడం, ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించడం, ఇతర సాధారణ విధుల్లో తలమునకలై ఉండటంతోనే కొన్ని కేసుల విచారణలు ముందుకు సాగడం లేదని ఓ పోలీసు అధికారి ‘న్యూస్టుడే’తో వాపోయారు.
* చివ్వెంల మండలం దురాజ్పల్లి సమీపంలో సైదిరెడ్డి అలియాస్ సంజీవ, విజయ దంపతులకు చెందిన మూడు నెలల శిశువును ఈ ఏడాది మార్చి 5న గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. నూతనకల్ గ్రామానికి చెందిన ఈ దంపతులు సంచార జీవనం సాగిస్తూ దురాజ్పల్లి గుట్ట సమీపంలో నివాసం ఉంటున్నారు. ఊయలలో ఉన్న చిన్నారిని రెప్పపాటులో దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు రోజులు హడావుడి చేసి వదిలేశారు. బాబును ఎవరు ఎత్తుకెళ్లారన్న విషయాన్ని పోలీసులు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.
* 2021 మార్చి 23న సాయంత్రం పూట సూర్యాపేట పురపాలిక పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఆలేటి జానకమ్మ (70)ను ఇంట్లోనే దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆమె ఒంటిపై తులంన్నర బంగారం, వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. హత్య జరిగిన ప్రాంతం ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. హత్య జరిగిన రోజు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం కావడంతో దేశ వ్యాప్తంగా సుమారు 700 మంది క్రీడాకారులు హాజరయ్యారు. దీంతో సెల్ఫోను కాల్ డిటెయిల్ రికార్డ్ (సీడీఆర్) ఆధారంగా దోషులను పట్టుకోవడం ప్రతిబంధకంగా మారిందని పోలీసులు సెలవిస్తున్నారు. రెండేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న జానకమ్మను ఎవరు హత్య చేశారో కనిపెట్టడం పోలీసులకు ఇప్పటికీ సవాల్గా మిగిలిపోయింది.
* జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిద్రిస్తుండగా 2019 డిసెంబరులో జడ బుచ్చయ్య (72)ను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. హత్య జరిగి రెండున్నరేళ్లు పూర్తయినా నేటికీ దోషులను పోలీసులు గుర్తించలేకపోయారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఇటీవల పోలీసులు ఈ కేసు ఫైల్ను మూసేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు హక్కు వినియోగించుకోవాలి
[ 07-05-2024]
ఓటు వేయడం మన ప్రాథకమిక బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
[ 07-05-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పట్టణంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. -
భారాసకు ఎమ్మార్పీఎస్ మద్దతు
[ 07-05-2024]
భువనగిరి పట్టణంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం సుగుణ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగ సంఘ నేతలు
[ 07-05-2024]
జిల్లా జేఏసి ఛైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, టీఎన్జీఓ అధ్యక్షుడు డి.భగత్, ఉద్యోగ సంఘం నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
యాదాద్రిలో హరిహరుల ఆరాధనలు
[ 07-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరుల ఆరాధనలు ఆయా ఆలయాల ఆచారంగా కొనసాగాయి. ప్రధానాలయంలో వైష్ణవ పద్ధతిలో పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య పూజలు నిర్వహించారు -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ
[ 07-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
అభివృద్ధిని వివరించి.. ఆమోదీంచాలని అభ్యర్థించి..!
[ 07-05-2024]
భువనగిరి పార్టీ అభ్యర్థులు బూర నర్సయ్యగౌడ్, సైదిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన జనసభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. -
ఓటుహక్కుపై అవగాహన పెరిగేలా ప్రచారం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ చిట్యాల సమీపంలోని గాంధీగుడి ఆధ్వర్యంలో నల్గొండలో ప్రచారం నిర్వహించారు. -
సౌర విద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు
[ 07-05-2024]
విద్యుత్తు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్తులో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రానుంది. -
ఆమె ఇంటికే పరిమితమైతే..అంతే..!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది. అతివలు తలచుకుంటే అందలం ఎక్కడం పక్కా అని తెలుస్తుంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లుకు ఇబ్బందులు కలగొద్దు
[ 07-05-2024]
ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. -
మాట తప్పితే రాజీనామా చేస్తావా..!
[ 07-05-2024]
ప్రియమైన లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థికి సమస్కారం. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్న తలంపు. -
అల్లాపురం విద్యార్థి.. సికింద్రాబాద్ అభ్యర్థి
[ 07-05-2024]
చౌటుప్పల్ మండలం అల్లాపురానికి చెందిన విద్యార్థి రాసాల వినోద్ యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు -
రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన
[ 07-05-2024]
‘ముఖ్యమంత్రి కాగానే రేవంత్రెడ్డి ఈ (భువనగిరి) ప్రాంత ప్రజల మేలు కోరి మూసీ ప్రక్షాళనను రూ.50 వేల కోట్లతో చేపడుతామని వెల్లడించారు. -
సామాజిక వేదికలు.. ప్రచారాస్త్రాలు
[ 07-05-2024]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు. -
నాన్నకు భారమై.. అమ్మకు దూరమై..!
[ 07-05-2024]
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్
-
‘నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు’: ప్రధాని మోదీ
-
తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై ఈసీ ఆంక్షలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన