పచ్చబొట్టు ఆధారంగా వీడిన మహిళ హత్య మిస్టరీ
రెండు నెలల క్రితం చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామ శివారులో గుర్తుపట్టలేని స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసు మిస్టరీని ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగానే ఛేదించామని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్, చిత్రంలో
నిందితుడు(ముసుగులో) , డీఎస్పీ నాగభూషణం, అధికారులు
సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: రెండు నెలల క్రితం చివ్వెంల మండలం దురాజ్పల్లి గ్రామ శివారులో గుర్తుపట్టలేని స్థితిలో లభ్యమైన మహిళ మృతదేహం కేసు మిస్టరీని ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగానే ఛేదించామని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. డబ్బు విషయంలోనే ఈ హత్య జరిగినట్లు వివరించారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం వాసి సామ జయమ్మ(60) తన భర్తతో గొడవ పడి కొన్నేళ్లుగా పిల్లలతో కలిసి సూర్యాపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు. బీవీ కాలనీకి చెందిన ఆర్టీసీలో ఒప్పంద డ్రైవర్గా పనిచేస్తున్న కొరిపెల్లి సైదులుతో చనువుగా ఉండేవారు. నెలలో తిరిగి చెల్లిస్తానని కొద్ది రోజుల క్రితం జయమ్మ వద్ద సైదులు రూ.90 వేలు అప్పుగా తీసుకున్నాడు. గడువులోగా డబ్బు ఇవ్వకపోవడంతో వారి మధ్య తరచూ గొడవ జరిగేది. గతేడాది నవంబరు 17న ఆమెను సైదులు ద్విచక్ర వాహనంపై తీసుకొని దురాజ్పల్లి శివారులోని ఆదర్శ పాఠశాల వెనక చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగి డబ్బుల విషయంలో ఘర్షణ పడ్డారు. దీంతో జయమ్మను ఛాతిపై సైదులు బలంగా కొట్టాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో చీరను మెడకు చుట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెండు రోజుల తర్వాత స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె చేతిపై గల పచ్చబొట్టు, వస్త్రాలు, చెప్పుల ఆధారంగా ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలకు పోస్టర్లూ అంటించారు. మృతురాలి కుమారుడు ఇటీవల ఆటోపై వేసిన పోస్టర్ను చూసి చేతిపైగల పచ్చబొట్టును గుర్తుపట్టారు. రెండు నెలలుగా తన తల్లి కనిపించడం లేదని తెలిపారు. ఆమె ఫోను నంబరు ఆధారంగా దర్యాప్తు చేయడంతో కొరిపెల్లి సైదులుతో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరం అంగీకరించాడని ఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు సైదులును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. కేసు దర్యాప్తులో కష్టపడి పనిచేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు పురస్కారం అందజేశారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం, గ్రామీణ సీఐ సోమ్ నారాయణసింగ్, తుంగతుర్తి సీఐ నాగార్జున, చివ్వెంల ఎస్సై విష్ణుమూర్తి, పెన్పహాడ్ ఎస్సై శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలి
[ 10-05-2024]
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అబ్జర్వర్ నవీన్ షైనీ.. (IPS) నిఘా బృందాలను హెచ్చరించారు. -
వ్యక్తి దారుణ హత్య
[ 10-05-2024]
మండలంలోని ఆంగోతుతండాలో ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగ్రు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు -
నిర్లక్ష్యమా.. అవగాహన లోపమా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే వారిలో 90శాతం పైగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటారు -
విమర్శలు చేసే.. విజయం కాంక్షించే
[ 10-05-2024]
భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి
[ 10-05-2024]
ప్రజలు గత 25 ఏళ్లుగా తనను గెలిపించి.. మంత్రి అయ్యే వరకు తీసుకొచ్చారని శాశ్వతంగా గుర్తు ఉండేలా తాను అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
పారదర్శకంగా లోక్సభ ఎన్నికలు
[ 10-05-2024]
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.. -
మూత్ర పిండం.. పొంచి ఉన్న గండం
[ 10-05-2024]
మానవునికి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. వాతావరణ పరిస్థితుల్లో భాగంగా కిడ్నీ గండం ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. -
తస్మాత్ జాగ్రత్త.. స్థానికేతరులు వెళ్లాల్సిందే!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు ముందు జిల్లాలో 48గంటల నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నారు. -
నిరంతరం నిఘా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. -
నాడు హవా.. నేడు నామమాత్రం
[ 10-05-2024]
ఉమ్మడి జిల్లాలో నాడు కమ్యూనిస్టులదే హవా. జాతీయస్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది వారే. ఎన్నిక ఏదైనా గెలుపు కమ్యూనిస్టులదే అనే స్థాయి. -
సరిహద్దులు దాటుతున్న తెలంగాణ మద్యం
[ 10-05-2024]
వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు. -
గట్టెక్కేలా.. ప్రత్యేక వ్యూహం
[ 10-05-2024]
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి -
నిర్బంధం చేస్తేనే.. వస్తారా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు మరో రెండు రోజులు గడువు పెంచడం చూస్తే విద్యావంతులు కూడా ఓటు వేసేందుకు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం