మారని రాత.. తీరని వెత
వారం రోజులక్రితం నల్గొండలోని దేవరకొండ రోడ్డుకు చెందిన షన్ముఖచారి కడుపులో మంట వస్తుందని ఓ ప్రైవేటు వైద్యుడిని సంప్రదించారు. పరీక్షించిన వైద్యుడు కడుపులో మంట తగ్గడానికి వాల్యూ-20 ఎంజీ మాత్ర వారం రోజులు పరిగడుపున వేసుకోవాలని సూచించారు.
జనరల్ ఆసుపత్రిలో వైద్యులు రాసిన రోగి సమాచారం, మందులు
వారం రోజులక్రితం నల్గొండలోని దేవరకొండ రోడ్డుకు చెందిన షన్ముఖచారి కడుపులో మంట వస్తుందని ఓ ప్రైవేటు వైద్యుడిని సంప్రదించారు. పరీక్షించిన వైద్యుడు కడుపులో మంట తగ్గడానికి వాల్యూ-20 ఎంజీ మాత్ర వారం రోజులు పరిగడుపున వేసుకోవాలని సూచించారు. కానీ.. ఔషధాల దుకాణ నిర్వాహకుడు వాలిమ్-2 ఎంజీ అనే నిద్ర మాత్రలు ఇచ్చారు. దీంతో బాధితుడు రోజూ ఉదయం ఆ మాత్ర వేసుకుని నిద్రలోకి జారుకుంటున్నారు. మూడు రోజుల తరువాత మరో ప్రాంతంలోని ఔషధాల దుకాణదారుడిని సంప్రదిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఓ ప్రైవేటు వైద్యుడు రాసిన మందుల చీటి
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: జనరల్, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేటు వైద్యులు రెండు వేల వరకు ఉన్నారు. వీరితో పాటు నాలుగు వేల మంది ఆర్ఎంపీ, పీఎంపీల పేరుతో గ్రామీణ వైద్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో 80 శాతం మంది రోగుల కోసం రాసే మాత్రలు, ఇంజెక్షన్లను అర్ధం కానటువంటి భాషలో రాస్తారు. మరో 40 శాతం మంది వైద్యుల చేతి రాతలు వారికి సంబంధించిన ఔషధ దుకాణదారులకు మాత్రమే అర్ధమవుతాయి. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం 2016లో రోగికి అర్ధమయ్యేలా పెద్దక్షరాల్లో (క్యాప్టల్ లెటర్స్) రాయాలని అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ.. దీనిని జిల్లాలో ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదు. దీంతో రోగులు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారు. అర్ధం కానటువంటి రాతలు రాసే వైద్యలకు జరిమానా వేయడం, లైసెన్సులు రద్దు చేయాల్సి ఉన్నా.. అధికారులు పట్టించుకోవట్లేదు. దీంతో చేతిరాతల్లో వైద్యులు ఏమాత్రం మారడంలేదు.
జరిమానా విధించాలి..
చిలుకూరి పరమాత్మ, డ్రగ్గిస్టు రాష్ట్ర కార్యదర్శి
వైద్యుల చేతి రాతపై 2018 ఆగస్టు 9న అప్పటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్కు 670 పేజీల లేఖలు పంపారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై న్యాయ స్థానాన్ని కూడా సంప్రదించాం. కొంత మంది వైద్యుల చేతి రాతలు ఫార్మాసిస్టులకు కూడా అర్ధం కావడం లేదు. ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం వైద్యుల చేతి రాతలు ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యేలా ఉండాలి. దుకాణదారుడికి వైద్యుల రాత అర్ధం కాకుంటే ఏదో ఒక మందు ఇస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం..
- అన్నిమల కొండల్రావు, డీఎంహెచ్వో, నల్గొండ
ప్రతి వైద్యుడు క్యాప్టల్ లెటర్లోనే మందులు రాయాలి అనే జీవో కూడా ఉంది. ప్రస్తుతానికి దీనిని ఎక్కువ శాతం వైద్యులు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపై పలు సమావేశాల్లోనూ చర్చించి సూచనలు చేస్తున్నాం. వైద్యులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వ్యక్తి దారుణ హత్య
[ 10-05-2024]
మండలంలోని ఆంగోతుతండాలో ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగ్రు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు -
నిర్లక్ష్యమా.. అవగాహన లోపమా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే వారిలో 90శాతం పైగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటారు -
విమర్శలు చేసే.. విజయం కాంక్షించే
[ 10-05-2024]
భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి
[ 10-05-2024]
ప్రజలు గత 25 ఏళ్లుగా తనను గెలిపించి.. మంత్రి అయ్యే వరకు తీసుకొచ్చారని శాశ్వతంగా గుర్తు ఉండేలా తాను అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
పారదర్శకంగా లోక్సభ ఎన్నికలు
[ 10-05-2024]
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.. -
మూత్ర పిండం.. పొంచి ఉన్న గండం
[ 10-05-2024]
మానవునికి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. వాతావరణ పరిస్థితుల్లో భాగంగా కిడ్నీ గండం ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. -
తస్మాత్ జాగ్రత్త.. స్థానికేతరులు వెళ్లాల్సిందే!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు ముందు జిల్లాలో 48గంటల నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నారు. -
నిరంతరం నిఘా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. -
నాడు హవా.. నేడు నామమాత్రం
[ 10-05-2024]
ఉమ్మడి జిల్లాలో నాడు కమ్యూనిస్టులదే హవా. జాతీయస్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది వారే. ఎన్నిక ఏదైనా గెలుపు కమ్యూనిస్టులదే అనే స్థాయి. -
సరిహద్దులు దాటుతున్న తెలంగాణ మద్యం
[ 10-05-2024]
వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు. -
గట్టెక్కేలా.. ప్రత్యేక వ్యూహం
[ 10-05-2024]
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి -
నిర్బంధం చేస్తేనే.. వస్తారా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు మరో రెండు రోజులు గడువు పెంచడం చూస్తే విద్యావంతులు కూడా ఓటు వేసేందుకు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం