పోయేవారే.. మరి వచ్చేవారేరీ..!
ఆర్టీసీలో గత పదేళ్లుగా నూతన నియామకాలు చేపట్టడం లేదు.దీంతో ఉద్యోగుల సంఖ్య ఏటా భారీగా తగ్గిపోతోంది.
ఆర్టీసీలో పదేళ్లుగా నిలిచిన కొలువుల భర్తీ
మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: ఆర్టీసీలో గత పదేళ్లుగా నూతన నియామకాలు చేపట్టడం లేదు.దీంతో ఉద్యోగుల సంఖ్య ఏటా భారీగా తగ్గిపోతోంది. ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందకపోవడంతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న వారిపై పని ఒత్తిడి పెరుగుతుందని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2013లో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 2015లో సుమారు 3,000 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉండగా.. 2021 నాటికి 2,377 మంది, ప్రస్తుతం 2,005 మంది మాత్రమే ఉన్నారు. ఏటా సుమారు 120 మంది ఉద్యోగ విరమణ చేస్తున్నప్పటికీ నూతన నియామకాలు చేపట్టకపోవడంతో సిబ్బంది సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.
ఉద్యోగులపై ఒత్తిడి..
ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 2021లో 1,227 మంది కండక్టర్లు, 1,150 డ్రైవర్లు ఉండగా..2023లో కండక్టర్లు 1,104 మంది, డ్రైవర్లు 901 మందికి తగ్గారు. రెండేళ్లలో డ్రైవర్లు 249, కండక్టర్లు 123 మంది.. మొత్తమ్మీద 372 మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేశారు. నూతన ఉద్యోగాల నియామకం చేపట్టకపోవడంతో ఉన్న వారిపై పని ఒత్తిడి పెరుగుతుందని కార్మికులు వాపోతున్నారు. అదనపు విధులు, అదనపు పనిగంటలు చేయాల్సి వస్తుండడంతో కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గతేడాది స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రవేశ పెట్టగా పదుల సంఖ్యలో కార్మికులు వీఆర్ఎస్ తీసుకున్నారు. ఒత్తిడి కారణంగా అనేక మంది అనారోగ్యంతో మరణిస్తున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
భారీగా పెరిగిన అద్దె బస్సులు..
మరో వైపు ఆర్టీసీలో అద్దె బస్సుల హవా నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల్లో ఆర్టీసీ బస్సులతో సమానంగా అద్దె బస్సులు ఉండగా..నార్కట్పల్లి డిపోలో మాత్రం ఆర్టీసీ బస్సులు 3, అద్దె బస్సులు 11 ఉన్నాయి. 2021లో ఆర్టీసీ బస్సుల సంఖ్య 484 ఉండగా..ప్రస్తుతం 387కు తగ్గాయి. దీంతో ప్రయాణికులను చేరవేసేందుకు అద్దె బస్సులే దిక్కయ్యాయి. అయితే అద్దె బస్సుల్లో డ్రైవర్లు ప్రైవేట్ వారే ఉండడంతో ఆర్టీసీ డ్రైవర్లకు విధులు కేటాయించడం కష్టంగా మారింది. దీంతో తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడతారేమోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగ సంఘ నేతలు
[ 07-05-2024]
జిల్లా జేఏసి ఛైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి, టీఎన్జీఓ అధ్యక్షుడు డి.భగత్, ఉద్యోగ సంఘం నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
యాదాద్రిలో హరిహరుల ఆరాధనలు
[ 07-05-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో సోమవారం హరిహరుల ఆరాధనలు ఆయా ఆలయాల ఆచారంగా కొనసాగాయి. ప్రధానాలయంలో వైష్ణవ పద్ధతిలో పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా పంచనారసింహులను ఆరాధిస్తూ నిత్య పూజలు నిర్వహించారు -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ
[ 07-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. -
అభివృద్ధిని వివరించి.. ఆమోదీంచాలని అభ్యర్థించి..!
[ 07-05-2024]
భువనగిరి పార్టీ అభ్యర్థులు బూర నర్సయ్యగౌడ్, సైదిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన జనసభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. -
ఓటుహక్కుపై అవగాహన పెరిగేలా ప్రచారం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ చిట్యాల సమీపంలోని గాంధీగుడి ఆధ్వర్యంలో నల్గొండలో ప్రచారం నిర్వహించారు. -
సౌర విద్యుత్తు ఉత్పత్తికి కసరత్తు
[ 07-05-2024]
విద్యుత్తు వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్తులో విద్యుత్తు కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇందుకు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రానుంది. -
ఆమె ఇంటికే పరిమితమైతే..అంతే..!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలు మార్చే శక్తి మహిళా ఓటర్లపైనే ఉంది. అతివలు తలచుకుంటే అందలం ఎక్కడం పక్కా అని తెలుస్తుంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటర్లుకు ఇబ్బందులు కలగొద్దు
[ 07-05-2024]
ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన ఆదేశించారు. -
మాట తప్పితే రాజీనామా చేస్తావా..!
[ 07-05-2024]
ప్రియమైన లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న అభ్యర్థికి సమస్కారం. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యం.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలన్న తలంపు. -
అల్లాపురం విద్యార్థి.. సికింద్రాబాద్ అభ్యర్థి
[ 07-05-2024]
చౌటుప్పల్ మండలం అల్లాపురానికి చెందిన విద్యార్థి రాసాల వినోద్ యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు -
రూ.50 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన
[ 07-05-2024]
‘ముఖ్యమంత్రి కాగానే రేవంత్రెడ్డి ఈ (భువనగిరి) ప్రాంత ప్రజల మేలు కోరి మూసీ ప్రక్షాళనను రూ.50 వేల కోట్లతో చేపడుతామని వెల్లడించారు. -
సామాజిక వేదికలు.. ప్రచారాస్త్రాలు
[ 07-05-2024]
ఒకప్పుడు ఎన్నికల ప్రచారం అంటే నాయకులు నానా తిప్పలు పడాల్సి వచ్చేది. బరిలో ఉన్న అభ్యర్థులు ఏం చెబుతున్నారో, ఎలాంటి భావజాలంతో ఉన్నారో సభలకు వెళ్తేకానీ తమ నియోజకవర్గ ప్రజలకు తెలిసేది కాదు. -
నాన్నకు భారమై.. అమ్మకు దూరమై..!
[ 07-05-2024]
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య