ప్రవేశాలకు వేళాయె..!
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
మిర్యాలగూడలోని కేంద్రీయ విద్యాలయం
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఇటీవలే ప్రారంభం కాగా.. ఆపై తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి ఏప్రిల్ మూడు నుంచి ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
* ఉమ్మడి జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరిలో కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్ఈ సిలబస్తో పాటు క్రీడలు, యోగా, స్కౌట్స్, ఎన్సీసీల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యం. కేంద్ర ప్రభుత్వ అనుబంధ, రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు వరుసగా ప్రాధాన్యం కల్పిస్తారు. సాధారణ విద్యార్థులకు చివరి ప్రాధాన్యం ఇస్తారు.
ఒకటో తరగతిలో 80 మంది..
ఒకటో తరగతిలో ప్రతి పాఠశాలలో సెక్షన్కు 40 మంది చొప్పున మొత్తం రెండు సెక్షన్లకు కలిపి 80 మందికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు 2023 మార్చి 31 నాటికి ఆరేళ్లు పూర్తయి, ఎనిమిదేళ్ల లోపు ఉండాలి. ఏప్రిల్ 17 వరకు http:///kvsonlineadmission.kvs.gov.in వెబ్సైట్లో కానీ.. కేవీఎస్ అడ్మిషన్ యాప్లో దరఖాస్తు చేసుకోవాలి.
* రెండు నుంచి పై తరగతులకు ఆఫ్లైన్లో నేరుగా పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పాఠశాలల్లోని ఖాళీల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 3 నుంచి 12 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. ఏకైక సంతానం ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. మెరిట్ జాబితాను ఏప్రిల్ 17న వెల్లడిస్తారు.
* ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో విద్యార్థులకు ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. పదకొండో తరగతిలో ప్రవేశాలకు పదో తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.
పారదర్శకంగా విద్యార్థుల ఎంపిక
- మిన్నీ ముల్లత్, ప్రిన్సిపల్, కేంద్రీయ విద్యాలయం, మిర్యాలగూడ.
కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆపై తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి ఏప్రిల్ మూడు నుంచి ఆఫ్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. విద్యార్థుల ఎంపిక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతుంది.
తరగతుల వారీగా అర్హత వయస్సుల వివరాలు..
రెండు, మూడో తరగతిలో ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్లు, నాలుగో తరగతికి 8 నుంచి 10, ఐదో తరగతికి 9 నుంచి 11, ఆరో తరగతికి 10 నుంచి 12, ఏడో తరగతికి 11 నుంచి 13 వరకు, ఎనిమిదో తరగతికి 12 నుంచి 14 వరకు, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15, పదో తరగతికి 14 నుంచి 16ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భానుడి వేడి..దొరకని నాడి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. -
మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
[ 05-05-2024]
మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన
[ 05-05-2024]
ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. -
చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్
[ 05-05-2024]
ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. -
నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు -
ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు
[ 05-05-2024]
ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. -
ఆయకట్టులో ఆగని చోరీలు
[ 05-05-2024]
సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టొద్దు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
భానుడి ప్రతాపం.. బాతులకు తాపం
[ 05-05-2024]
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతో పక్షులు సేదతీరేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. -
నేనేంటీ.. నాకింత విలువేంటి..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. -
నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్
[ 05-05-2024]
ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. -
6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. -
కొనసాగిన ఇంటి వద్ద పోలింగ్
[ 05-05-2024]
జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. -
రూ.2తో ఓటు సవాల్
[ 05-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం
[ 05-05-2024]
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.