శిక్షకులేరీ..?
వేసవి ఎండలు మండుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు సరదా కోసం ఈతకు వెళ్తున్నారు. చిన్నారులు వేసవి సెలవుల్లోనే ఈత నేర్చుకుంటారు.
నిబంధనలకు విరుద్ధంగా ఈత కొలనుల నిర్వహణ
సూర్యాపేటలో కొనసాగుతున్న ప్రైౖవేటు ఈత కొలను
సూర్యాపేట పురపాలిక, చిట్యాల, న్యూస్టుడే: వేసవి ఎండలు మండుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు సరదా కోసం ఈతకు వెళ్తున్నారు. చిన్నారులు వేసవి సెలవుల్లోనే ఈత నేర్చుకుంటారు. ఇందుకు కొందరు వ్యవసాయ భూములు, కుంటలు, చెరువుల వద్దకు వెళ్తున్నారు. ఇలాంటి చోట్ల తల్లిదండ్రులు, ఈత వచ్చిన వారి పర్యవేక్షణ తప్పనిసరి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో పదుల సంఖ్యలో ఈతకొలనులు ఉన్నాయి. వాటిలో చిన్నారులు భద్రతాపరంగా అన్ని సౌకర్యాలు, నిష్ణాతులైన శిక్షకులు, సిబ్బంది ఉన్న వాటినే ఎంచుకోవాలి. లేదంటే ఈత నేర్చుకునే క్రమంలో చిన్నారులు నీటిమునిగే ప్రమాదం ఉంది. సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు పట్టణ ప్రాంత చిన్నారులు ఉదయం, సాయంత్రం స్థానిక ఈత కొలనుల్లో శిక్షణకు వెళ్తున్నారు. కొందరు చిన్నారులు తమ తండ్రితో వచ్చి సాధన చేస్తున్నారు. మరికొందరు శిక్షకుల పర్యవేక్షణలో నేర్చుకుంటున్నారు. పురపాలికల్లో ఎక్కడా కూడా శిక్షకులు లేరు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ప్రభుత్వ ఈత కొలనులు లేవు. అన్నీ ప్రైవేటువే. వీటి వద్ద నిబంధనలు పాటించటం లేదని, కనీసం శిక్షకులు కూడా ఉండటం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈత నేర్చుకోవాలనే పిల్లలు, యువత కుతుహలాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు వ్యక్తులు అనుమతి తీసుకోకుండా, శిక్షకులు, ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు, కనీస నిబంధనలు పాటించకుండానే ఈత కొలనులను నడుపుతున్నారు. చిట్యాలలో ఏర్పాటుచేసిన ఓ ప్రైవేటు ఈత కొలనులో ఈతకు వెళ్లిన నూనె శ్రవణ్కుమార్ అనే యువకుడు సోమవారô నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. దీని నిర్వాహకులు పురపాలిక నుంచి అనుమతులు తీసుకోలేదు. పైగా ఇక్కడ శిక్షకులూ లేరు. నిబంధనల అమలుపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని దర్యాప్తులో గుర్తించి ఆ ఈతకొలనును సీజ్ చేసినట్లు చిట్యాల ఎస్సై సైదాబాబు పేర్కొన్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- ఈత కొలనుల నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్(ఎన్ఐఎస్) ధ్రువపత్రం ఉన్న శిక్షకులు కనీసం నలుగురు, అనుభవం ఉన్న లైఫ్గార్డులు, లైఫ్ సేవర్లను నియమించుకోవాలి.
- ఎక్కడ కూడా నిపుణులైన శిక్షకులు లేరు. కేవలం లైఫ్ సేవర్, లైఫ్గార్డు ధ్రువపత్రాలున్న వారితోనే ఈతకొలనులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోవటం లేదు.
- చిన్నారులకు చర్మవ్యాధులు, అలర్జీలు రాకుండా ఈత కొలనుల్లో మలినాలు లేకుండా రసాయనాలతో నిత్యం శుద్ధి చేయాలి.
- కొలనులకు ఇరువైపులా తాడు, ట్యూబులు, వెదురు బొంగులు అందుబాటులో ఉంచాలి. ఎవరైనా నీట మునిగితే వెంటనే తాళ్లను నీటిలోకి విసిరి, వెదురుబొంగులు అందించి పైకి లాగేందుకు అవకాశం ఉంటుంది.
- ప్రైవేటు ఈతకొలనుల్లో భద్రతపరంగా అన్ని ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో డీఎస్ఏ అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరముంది.
- తల్లిదండ్రులు కూడా అన్నీ పరిశీలించాకే పిల్లలను పంపించాలి. చిన్నారుల చెవులు, కళ్లల్లోకి నీరు పోకుండా క్యాప్, కళ్లజోడు వాడాలి.
కచ్చితంగా నిబంధనలు పాటించాలి
- శ్రీనివాస్, పుర కమిషనర్, సూర్యాపేట
పురపాలికల్లో ప్రైవేటు ఈత కొలనులు నిర్వహించేవారు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. నిర్వాహకులు కనీస నిబంధనలు పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చేపడితే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం