భారీగా పెరిగారు..!
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి..
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. ఒక రిజర్వుడు, ఒక జనరల్ స్థానం నుంచి ఇద్దరు లోక్సభ సభ్యులను ఎన్నుకునేవారు. 1952, 1957లో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకటే లోక్సభ స్థానం ఉండగా.. తొలి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 7,29,504 ఉండేది. 1962లో మిర్యాలగూడ నియోజకవర్గం కొత్తగా ఏర్పడడంతో నల్గొండ ఓటర్ల సంఖ్య 4,46,641కు తగ్గిపోయింది. ప్రతి ఎన్నికల నాటికి వారి సంఖ్య పెరుగుతూ వస్తుండగా.. ప్రస్తుతం నల్గొండ లోక్సభ నియోజకవర్గంలో 17,18,954 మంది ఓటర్లు ఉన్నారు.
పునర్విభజనతో తగ్గారు..
ప్రతి ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తుండగా.. 1996 నుంచి 1998 నాటికి 31,491 మంది ఓటర్లు తగ్గారు. అనంతరం 2004లో 16,05,163 మంది ఓటర్లు ఉండగా.. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో జరిగిన ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 14,55,016కి తగ్గింది. అప్పటి నుంచి ఏటా ఓటర్లు పెరుగుతూ ప్రస్తుతం 17 లక్షలు దాటింది.
నామినేషన్ ఫీజు పెంపునకు నల్గొండ ప్రజలే కారణం
ఏ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా అభ్యర్థులు నామినేషన్ వేసే సమయంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సాధారణ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉండేది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సాధారణ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.125 చెల్లించాల్సి ఉండేది. ఫ్లోరైడ్ బాధితులు, రైతులు తమ ఉద్యమంలో భాగంగా 1996లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి 537 మంది నామినేషన్లు వేయగా.. పరిశీలన తర్వాత 480 మంది బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. నెల రోజుల పాటు పోలింగ్ వాయిదా వేసి బుక్లెట్ ఆకారంలో బ్యాలెట్ పత్రం రూపొందించి.. బ్యాలెట్ పెట్టెలు పెద్ద సైజులో చేయించి.. ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఓట్ల లెక్కింపునకు సైతం రెండు రోజుల సమయం పట్టింది. ఈ ఎన్నిక తర్వాత ఎన్నికల సంఘం పలు సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా నామినేషన్ డిపాజిట్ రుసుమును సాధారణ అభ్యర్థులకు రూ.500 నుంచి రూ.25 వేలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.12,500కు పెంచింది. అదే విధంగా శాసనసభ ఎన్నికల్లో జనరల్ అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.10వేలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.125 నుంచి రూ.5వేలకు పెంచింది.
న్యూస్టుడే, మిర్యాలగూడ పట్టణం
ఎన్నికల అనుమతులకు.. సువిధ పోర్టల్
నాంపల్లి, భానుపురి, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికతను ఉపయోగించి ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తోంది. ర్యాలీలు మొదలుకొని ప్రదర్శనల వరకు ఎలాంటి అనుమతులు కావాలన్నా సంబంధిత అధికారులు, పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ‘సువిధ పోర్టల్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో అనుమతులు లభిస్తాయి.
అన్ని ప్రచార అనుమతులకు..
అభ్యర్థులు ముందుగా https://suvidha.eci.gov.in వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. అనంతరం మీటింగ్లు, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక పార్టీ కార్యాలయం ఏర్పాటు హెలికాప్టర్, హెలీప్యాడ్, ఇంటింటి ప్రచారం, బ్యానర్లు, పార్టీ జెండాలు, ఎయిర్ బెలూన్లు, వీడియో వ్యాన్లు, హోర్డింగ్ల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సువిధ పోర్టల్ ద్వారా నామినేషన్ సమర్పించే వెసులుబాటు సైతం ఉంది. ఆన్లైన్లోనూ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ప్రచార అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు.. కసరత్తు
[ 30-04-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నైరాశ్యంలో ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కల్పించడం, ఉమ్మడి నల్గొండలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో సత్తా చాటేలా ప్రతిపక్ష భారాస వ్యూహరచన చేస్తోంది. -
ముందస్తుకు మస్తు స్పందన
[ 30-04-2024]
పట్టణాల్లో ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అడ్వాన్స్గా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రభుత్వం కల్పించడంతో ఇంటి యజమానులు ముందుకొచ్చి చెల్లిస్తున్నారు. -
తేలిన బరి..!
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. -
పోటెత్తాలి.. పౌరుడా..!
[ 30-04-2024]
మిత్రులతో కబుర్లు చెబుతూ గంటల సమయాన్ని వృథా చేస్తుంటాం. మనకు సంబంధం లేని, ఎలాంటి ఉపయోగం లేని ఇతరుల విషయాల్లో కలగజేసుకుని మరీ వివరాలను ఆరా తీస్తుంటాం. -
కార్మికులకు కలిసొచ్చే కాలమే..!
[ 30-04-2024]
‘మూఢం’ వచ్చేసింది.. పెళ్లిళ్లు, పేరంటాళ్లు, శుభకార్యాలకు అంతరాయం ఏర్పడింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని ‘మూఢం’గా పండితులు పరిగణిస్తారు. -
ఒకేసారి గెలిచిన ఇద్దరు యోధులు
[ 30-04-2024]
1991లో నిర్వహించిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నల్గొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి తెలంగాణ సాయుధ పోరాట యోధులు బొమ్మగాని ధర్మభిక్షం, భీమిరెడ్డి నర్సింహారెడ్డిలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. -
పోలింగ్ నమోదుపై బెంగ
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో నమోదయ్యే పోలింగ్ శాతంపై అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంది. -
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం!
[ 30-04-2024]
ఓటర్లకు అసెంబ్లీ ఎన్నికలపై ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి సడలిపోతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు వేసేందుకు ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. -
కొల్లూరులో వీరగత్తె విగ్రహం గుర్తింపు
[ 30-04-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామ శివారులోని పాటిగడ్డ శివాలయం, వైష్ణవ ఆలయాల మధ్య అరుదైన, అపురూపమైన వీరగత్తె విగ్రహాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేష్ గుర్తించారు. -
గ్యాస్ కట్టర్తో ఏటీఎంలో చోరీకి యత్నం
[ 30-04-2024]
గ్యాస్ కట్టర్ సహాయంతో ఏటీఎంలో ఉన్న నగదును చోరీ చేసే క్రమంలో నిప్పు రవ్వలు రాజుకొని రూ.8.20 లక్షల నగదు దగ్ధమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
తొందర ఉందా.. అయితే అక్కడికి వెళ్లండి..!
[ 30-04-2024]
స్కానింగ్ చేయాలా.. తొందర ఉందా.. పక్కనే ప్రైవేట్ ల్యాబ్ ఉంది.. అక్కడికి వెళ్లండి.. అంటూ భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులకు చెబుతూ డబ్బులు దండుకుంటున్నాడు ఓ ఉద్యోగి. -
ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలి
[ 30-04-2024]
అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చు తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హన్మంత్ కె.జెండగే తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్సింగ్ క్షేత్రమయుమ్, -
సర్కారు బడి.. గురుకుల ఒడి
[ 30-04-2024]
ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల.. గురుకుల ప్రవేశాలకు చిరునామాగా మారింది. ఇక్కడ చదివే ప్రతి పది మంది చిన్నారుల్లో ఒక్కరికి కచ్చితంగా గురుకుల పాఠశాలలో ప్రవేశం లభిస్తోంది. -
మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు
[ 30-04-2024]
మతిస్థిమితం లేని బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి న్యాయస్థానం ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.25,000 జరిమానా విధించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు