logo

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చిత్తూరుకు చెందిన వినాయకం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పీలేరులో రాష్ట్ర కార్యవర్గ నియామక సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్‌(నెల్లూరు), కోశాధికారిగా అచార్య డాక్టర్‌ భానుప్రకాశ్‌(గుంటూరు),

Published : 24 Jan 2022 06:12 IST

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చిత్తూరుకు చెందిన వినాయకం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పీలేరులో రాష్ట్ర కార్యవర్గ నియామక సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రసాద్‌(నెల్లూరు), కోశాధికారిగా అచార్య డాక్టర్‌ భానుప్రకాశ్‌(గుంటూరు), అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా డాక్టర్‌ మోహన్‌(చిత్తూరు), రాష్ట్ర అదనపు కార్యదర్శిగా వెంకటేష్‌(అనంతపురం), రాష్ట్ర ఉపాధ్యక్షులుగా స్వతంత్య్ర బాబు(కడప), ప్రభావతి(తూ.గో జిల్లా), వెంకటేష్‌(కృష్ణా), ప్రతాప్‌(ప.గో జిల్లా), స్వాతి(గుంటూరు), శ్రీనివాసులు(చిత్తూరు), రాష్ట్ర కార్యదర్శులుగా ఉమామహేశ్వరరావు(విజయనగరం), చందూ నాయక్‌(కర్నూలు), ప్రభుదాస్‌(ప్రకాశం), ఆంజనేయులు(విశాఖ జిల్లా), పురుషోత్తం(చిత్తూరు), సురేష్‌(కడప), శ్రీకాంత్‌( గుంటూరు) తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సంఘం రాష్ట్ర ఎన్నికల అధికారిగా రవికుమార్‌(చిత్తూరు) గౌరవ అధ్యక్షుడిగా నాగరాజనాయక్‌(కడప) వ్యవహరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు