వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకం: తెదేపా
గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు.
ప్రచారం చేస్తున్న దగుమాటి, సుబ్బానాయుడు తదితరులు
దగదర్తి, న్యూస్టుడే: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకమైందని కావలి తెదేపా కూటమి అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం మండలంలోని వెలుపోడు, కాట్రాయపాడు, ధర్మవరంలో పర్యటించారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్రెడ్డి మండల తెదేపా అధ్యక్షుడు హనుమంతరావు, తెదేపా నాయకులు సుధాకర్ నాయుడు, శ్రీహరి, శీనయ్య, మల్లికార్జున, సీˆహెచ్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు తమ్ముళ్ల సందడి
కందుకూరు బయల్దేరిన తెలుగు తమ్ముళ్లు
గుడ్లూరు : గుడ్లూరులో తెలుగు తమ్ముళ్లు సందడి చేశారు. కందుకూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్ సందర్భంగా మండలంలోని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ మండల బాధ్యులు నాగరాజు, వేణు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. లింగసముద్రం : లింగసముద్రం మండలం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు వెళ్లారు. లింగసముద్రం, పెంట్రాల, చినపవని, పెదపవని, వి.ఆర్.కోట నుంచి పార్టీ శ్రేణులు వాహనాల్లో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు రంగయ్య, బ్రహ్మయ్య, గాలంకి ప్రసాద్, కిలారి రమణయ్య, నరసయ్య పాల్గొన్నారు.
తెదేపా ప్రచారం
వింజమూరు : ప్రచారం చేస్తున్న సురేష్
వింజమూరు : స్థానిక ప్రధాన రహదారిలో కాకర్ల సురేష్ స్థానిక నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.బొమ్మరాజుచెరువులో వైకాపాకు చెందిన 19వ వార్డు సభ్యురాలు కూసుపాటి జయలక్ష్మి 20 కుటుంబాలతో కాకర్ల సమక్షంలో చేరారు.
ఉదయగిరి : జి.చెరువుపల్లి వైకాపా నాయకుడు కప్పా వెంకటేశ్వర్లు అనుచరులతో గంగిరెడ్డిపల్లిలో మన్నేటి వెంకటరెడ్డి నివాసంలో తెదేపాలో చేరారు. మాజీ సర్పంచి కప్పా శ్రీనివాసులు, నాయకులు ప్రవీణ్రాజు, సుబ్బయ్య, శ్రీనివాసులు పాల్గొన్నారు. దుత్తలూరు: రాష్ట్రంలో అరాచక పాలన అంతం చేయాలని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, విజయరామిరెడ్డి పేర్కొన్నారు. మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం ఆధ్వర్యంలో మంగళవారం రాచవారిపల్లి, భైరవరం పంచాయతీల్లో ప్రచారం నిర్వహించారు.
వరికుంటపాడు : శ్రీకోదండరామస్వామి ఆలయంలో మంగళవారం శ్రీసీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఉదయగిరి తెదేపా అభ్యర్థి కాకర్ల సురేష్, ప్రణీత దంపతులు హాజరయ్యారు. స్థానిక నాయకులు సుంకర అంజనాద్రి, వెంకటాద్రి ఘనస్వాగతం పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాకాసి చట్టం.. రాబందులకే చుట్టం!
[ 06-05-2024]
కొత్త చట్టంలో టీఆర్వోలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తారు. ఏ స్థాయి అధికారికి బాధ్యత అప్పగిస్తారనే దానిపై స్పష్టత లేదు. -
నెల్లూరు గళం పార్లమెంట్లో వినిపిస్తాం
[ 06-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొప్పుల రాజు గతంలో ఈ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఇక్కడి సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగం.. తొలిరోజే గందరగోళం!
[ 06-05-2024]
జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్కు దూరం చేసేందుకు వైకాపాకు కొమ్ముకాసే కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఒక్కరితో బోధనెలా మామయ్యా!
[ 06-05-2024]
కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు. -
ఈ జలం గరళం
[ 06-05-2024]
వేసవికాలం వచ్చింది. తాగునీటి వనరులు అడుగంటి కలుషితమవుతాయి. ఈనీరు తాగి వ్యాధులు ప్రబలుతాయి. -
పింక్ మోడల్ పోలింగ్ కేంద్రం ప్రారంభం
[ 06-05-2024]
పట్టణంలోని ఎన్జీవో కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పింక్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జనరల్ పరిశీలకులు రామ్కుమార్గౌతమ్, సబ్కలెక్టర్ జి.విద్యాధరి ప్రారంభించారు. -
అంబటి చెప్పినా ఏదీ ఫలితం?
[ 06-05-2024]
మెరుపు వరదలకు.. పెన్నానది పెట్టింది పేరు. దీనికి కుందు, సగిలేరు, చెయ్యేరు, గుంజనవాగు, పాపాఘ్ని, జయమంగళ, తీతా, బీరాపేరు, బొగ్గేరు తదితర వాగులు, ఉపనదులు ఉన్నాయి. -
మంచి పేరున.. ముంచిన జగన్
[ 06-05-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 10,500, ఆయాలు, మినీ కేంద్రాల కార్యకర్తలకు రూ. 7,500 చెల్లించారు. -
క్షేత్ర సహాయకుడి సస్పెన్షన్
[ 06-05-2024]
కొండికందుకూరు ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు ఏపీవో సుజాత తెలిపారు. -
విష గుళికలు మింగి..
[ 06-05-2024]
జలదంకికి చెందిన మింగికళ్లోల వెంకయ్య (40) - వెంగమ్మ దంపతులు కూలీ పనుల కోసం కొన్నిరోజుల క్రితం కరీంనగర్ జిల్లా బంజరుపల్లికి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
భూ హక్కు చట్టంపై నీతి ఆయోగ్ ఏం చెప్పింది.. మీరేం చేశారు?
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా విమానయాన సంస్థ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!