2.64 లక్షల ఎకరాలకు సాగునీరు
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 2.64 లక్షల ఎకరాలకు సాగునీరువిడుదల చేయనున్నారు. ఈ మేరకువివిధ ప్రాజెక్టులు, ఎత్తిపోతల ద్వారా 23.832 టీఎంసీలు కేటాయించారు. నిజాంసాగర్ కింద ఈ నెల 15, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఈ నెల 25 నుంచి నీటిని
యాసంగికి 23.832 టీఎంసీలు
ఆమోదం తెలిపిన సలహా బోర్డు
సమావేశంలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేష్ వి పాటిల్,
ఎమ్మెల్యే హన్మంత్షిండే, ఎమ్మెల్సీ వీజీగౌడ్, నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విఠల్రావు
ఈనాడు, నిజామాబాద్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో 2.64 లక్షల ఎకరాలకు సాగునీరువిడుదల చేయనున్నారు. ఈ మేరకువివిధ ప్రాజెక్టులు, ఎత్తిపోతల ద్వారా 23.832 టీఎంసీలు కేటాయించారు. నిజాంసాగర్ కింద ఈ నెల 15, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద ఈ నెల 25 నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధ్యక్షతన స్థానిక ప్రగతిభవన్లో శనివారం జరిగిన నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో ఈ మేరకు ఆమోదం తెలిపారు.
నిజాంసాగర్ ఆయకట్టుకు ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 13 వరకు ఆరు తడులుగా నీళ్లివ్వనున్నారు. శ్రీరాంసాగర్ ఆయకట్టుకు ఈ నెల 25 నుంచి మే 18 వరకు నిరంతరాయంగావిడుదల చేస్తారు. అలీసాగర్ ఎత్తిపోతల కింద ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 18 వరకు ఆరుతడులుగా ఇవ్వనున్నారు. అర్గుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం కింద ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 30 వరకు ఏడు తడుల కింద అందిస్తారు. పోచారం ప్రాజెక్టు ద్వారా జనవరి 1 నుంచి ఏప్రిల్ 20 వరకు తొమ్మిది తడులుగా, కౌలాస్ నాలా కింద ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 6 వరకు ఏడు తడులు, రామడుగు కింద ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 28 వరకు ఏడు తడులుగా నీటి విడుదల ఉండనుంది.
వరిసాగుపై మంత్రి విజ్ఞప్తి
ఎమ్మెల్యేలు, ఆయకట్టు రైతుల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ప్రశాంత్రెడ్డి చెప్పారు. యాసంగిలో ధాన్యం కొనే అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. రైతులు ఆలోచించి పంటలు వేయాలన్నారు. వరి సాగు చేయాల్సి వస్తే రైస్మిల్లర్లు, వ్యాపారులతో బైబ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలని చెప్పారు. వానాకాలం వడ్ల కొనుగోలులో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని యంత్రాంగానికి అభినందనలు తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యే హన్మంత్షిండే, జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్రావు, డీసీఎంఎస్ ఛైర్మన్ మోహన్, నుడా ఛైర్మన్ ప్రభాకర్రెడ్డి, జలవనరుల శాఖ నిజామాబాద్, కామారెడ్డి సీఈలు మధుసూదన్రావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ