ఒకరి కోసం వచ్చి.. ముగ్గుర్ని చంపారా..?
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జాతీయ రహదారి పక్కనే మంగళవారం అర్ధరాత్రి ముగ్గురి హత్యల ఘటన కలకలం రేపుతోంది. షెడ్డు లోపల మంచంపై మెకానిక్ హర్పాల్ సింగ్ (33), మరో
పోలీసులకు సవాల్గా మారిన కేసు
ఈనాడు, నిజామాబాద్, న్యూస్టుడే-నిజామాబాద్ నేరవార్తలు, డిచ్పల్లి
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో జాతీయ రహదారి పక్కనే మంగళవారం అర్ధరాత్రి ముగ్గురి హత్యల ఘటన కలకలం రేపుతోంది. షెడ్డు లోపల మంచంపై మెకానిక్ హర్పాల్ సింగ్ (33), మరో మంచంపై అతడి బంధువు జోగిందర్సింగ్(45) మృతదేహాలు దుప్పటి కప్పి ఉన్నాయి. బయట ఉన్న మంచంపై క్రేన్ డ్రైవర్ సునీల్ (24) చనిపోయి ఉన్నాడు.
లోపలి వ్యక్తి కోసం వచ్చారా..?
హత్యలు జరిగిన షెడ్డుకున్న సీసీ కెమెరా పనిచేయటం లేదు. పక్కనే గల ద్విచక్రవాహనాల షోరూం సీసీ కెమెరాలో ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి దాటాక అటుగా వచ్చినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో మద్యం సీసాలు దొరికాయి. ఎవరెవరు తాగారనేది తేలాలి. ఎవరైనా రెక్కీ చేసి ప్రణాళిక వేసుకొని హతమార్చి ఉంటారా అని అనుమానిస్తున్నారు. జోగిందర్ సింగ్ మూడురోజుల కిందట ఇక్కడికి వచ్చారంటున్నారు. ఇద్దరిది పంజాబ్..ఆ ప్రాంతంలో వీరికి గొడవలుండి..ఎవరైనా వెంబడించి వచ్చి ఇలా చేసి ఉంటారా.? ఒకరి కోసం వచ్చి..సాక్ష్యం ఉండొద్దని మిగతా ఇద్దరినీ చంపారా..అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ కోసం వచ్చి ఉంటే..బయట నిద్రించిన అతడిని చంపి వెళ్లిపోయేవారు. కచ్చితంగా లోపల ఉన్న వ్యక్తి కోసమే వచ్చారనే అనుమానం బలపడుతోంది. ఘటనా స్థలంలో డబ్బుల పెట్టె తెరిచి ఉండటం.. మృతుల జేబుల్లోనూ డబ్బులు, చరవాణులు లేకపోవటంతో దోపిడీ ముఠాల పని అనే కోణమే మొదట కనిపించింది. మెకానిక్ షెడ్డులో పనిచేసే వాళ్లను చంపి తీసుకెళ్లే అంత సొమ్ములుంటాయా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. క్లూస్ టీం గుర్తించిన ఆధారాలు.. పోస్టుమార్టం రిపోర్టు కేసు దర్యాప్తునకు కీలకమయ్యే అవకాశం ఉంది. మృతుల ఫోన్ల కాల్డేటానూ పరిశీలించనున్నారు. ఇప్పటికే మూడు బృందాలు హంతకులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి.
ఒకే రకమైన గాయాలు
హత్యకు గురైన వారందరి తలలపైనా ఒకే రకమైన సుత్తితో ఒకే చోట దాడి చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. గతంలో నమోదైన పలు కేసుల్లోనూ సైకోలు ఈ తరహాలో హత్యలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ః పోలీసు కమిషనర్ కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ రాత్రి 10-12 గంటల మధ్యలో ఘటన జరిగిందన్నారు. మంగళవారం రాత్రి 10:30-11 గంటల సమయంలో హత్యలు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే రోడ్డు ప్రమాదం చోటు చేసుకొందన్నారు. అక్కడికి పోలీసుల వాహనాలు వచ్చాయని, హంతకులు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండే అవకాశం లేదన్నారు.
మూడు నెలలు.. ఏడు హత్యలు
నిజామాబాద్ నేరవార్తలు: నిజామాబాద్ కమిషనరేట్లో హత్యానేరాల పరంపర కొనసాగుతోంది. ఆస్తి కోసం కొందరు, పాతకక్షలతో మరికొందరు దారుణాలకు తెగిస్తున్నారు. అన్నదమ్ములు, తల్లిదండ్రులనూ లెక్క చేయకుండా హతమారుస్తున్నారు. డిచ్పల్లి మండలంలో గత మూడు నెలల్లో ఏడు హత్యలు జరిగాయి. అన్ని ఘటనల్లో నిందితులు చిక్కారు. రెండు కేసుల్లో చరవాణులు, నగదు కోసం చంపినట్లు తేలింది. మరో కేసులో కుటుంబ తగాదా కారణంగా గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్