మొరం.. అక్రమార్కుల పరం
జిల్లాలో అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అధికారులు, నాయకు
జిల్లాలో యథేచ్ఛగా దందా
తనిఖీలు మరిచిన యంత్రాంగం
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్
భిక్కనూరు మండలంలో మొరం తరలిస్తున్న టిప్పర్
జిల్లాలో అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అధికారులు, నాయకుల కనుసన్నల్లో ఈ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ప్రభుత్వ భూములను సొమ్ము చేసుకుంటున్నా అధికార యంత్రాంగం కన్నెత్తిచూడడం లేదు. జిల్లావ్యాప్తంగా పగలురాత్రి తేడా లేకుండా మొరం వ్యాపారం సాగిస్తున్నారు. భిక్కనూరు, రాజంపేట, కామారెడ్డి, తాడ్వాయి, బాన్సువాడ, గాంధారి, సదాశివనగర్, మాచారెడ్డి మండలాల్లో అధికంగా తవ్వకాలు జరుగుతున్నాయి.
* అనుమతులు తప్పనిసరి.. మొరం తవ్వకాలు చేపట్టాలంటే కచ్చితంగా మైనింగ్, అటవీ అధికారుల అనుమతులు తీసుకోవాలి. వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. మొరం ఉన్న ప్రాంతంలో ఎన్ని క్యూబిక్ మీటర్ల వరకు లీజు ఇవ్వాలో రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తారు. మైనింగ్ అధికారులు వే బిల్లులు జారీ చేయాలి. మొరం లభ్యతను బట్టి 60 రోజుల వరకు తాత్కాలిక అనుమతులు పొందొచ్చు. తవ్వకాలు జరిపే పరిధిలోని గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్కరూ అనుమతి తీసుకోవడం లేదు. కొందరు తాత్కాలికంగా తీసుకుని ఏడాదంతా తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
* ప్రగతి పనుల పేరిట.. ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, కంపోస్టుషెడ్లు వంటి పనులకు మొరం అవసరం ఉంటుంది. ఇది కాకుండా గ్రామాల్లో చెడిపోయిన అంతర్గత రోడ్ల మరమ్మతులు కావాలి. స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామానికి 50- 80 టిప్పర్ల మొరం అవసరమంటూ స్థానిక తహసీల్దారు వద్ద అనుమతి తీసుకుంటున్నారు. గ్రామ అవసరాలు తీరిపోయిన తర్వాత కూడా మూడునాలుగు రోజుల వరకు తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు
- నర్సారెడ్డి, ఏడీ, మైనింగ్,కామారెడ్డి
జిల్లాలో మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం ఒకరు మాత్రమే దరఖాస్తు పెట్టుకున్నారు. వారు సూచించిన భూమిని పరిశీలించాం. ఇంకా అనుమతివ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్న వారిపై జరిమానాలు విధిస్తున్నాం. మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటాం.
ఒక టిప్పర్కు రూ.2 వేల వరకు
* టిప్పర్తో మొరం సరఫరా చేస్తే రూ.1800- 2000 వరకు తీసుకుంటున్నారు.
* ట్రాక్టర్ ట్రాలీతో రూ.400- 600 వసూలు చేస్తున్నారు.
* గృహనిర్మాణాలు అధికంగా సాగే పట్టణాలు, మండల కేంద్రాల్లో ఈ దందా అధికంగా సాగుతోంది.
* వ్యాపారులు పట్టణ శివారు ప్రాంతాలు, గ్రామాల్లో తవ్వకాలు చేపడుతున్నారు.
* నిబంధనలకు విరుద్దంగా పట్టా, అసైన్డ్ భూముల్లో తవ్వకాలు చేపట్టి సరఫరా చేస్తున్నారు.
* కొత్తగా వెలుస్తున్న వెంచర్ల అభివృద్ధికి పెద్దఎత్తున మొరం వినియోగిస్తున్నారు.
* దీని గురించి స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిసినా చర్యలకు వెనుకంజ వేస్తున్నారు. ఒకవేళ అడ్డుకున్నా వెంటనే రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. దీంతో వదిలివేయక తప్పడం లేదనే వాదన వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా