logo

ఆ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు వరంలాంటివి

పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అమలు చేస్తు్న్న కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు వరం లాంటివని ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌ అన్నారు

Updated : 22 Jan 2022 17:52 IST

బీర్కూర్‌: పేదింటి ఆడబిడ్డలకు ప్రభుత్వం అమలు చేస్తు్న్న కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు వరం లాంటివని ఎంపీపీ రఘు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు ద్రోణవల్లి సతీశ్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎనిమిది గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. బీర్కూర్‌, బైరాపూర్‌, బరంగ్‌ఎడిగి, అన్నారం, దామరంచ, కిష్టాపూర్‌, వీరాపూర్‌, తిమ్మాపూర్‌ గ్రామాల్లోని 17 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, 12 మందికి షాదీముబారక్‌ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కో-ఆప్షన్‌ సభ్యుడు అరీఫ్‌, ఎంపీటీసీ సభ్యుడు సందీప్‌, సర్పంచిలు నాగేశ్వరరావు, బాబూరావు, వైస్‌ ఎంపీపీ కాశీరాం, తెరాస యువజన సంఘం మండల అధ్యక్షుడు శశికాంత్‌, తెరాస నాయకులు రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని