ప్రీమియం దోపిడీ
ఇంధన బంకుల్లో ఇష్టారాజ్యం ‘‘మండుతున్న ఇంధన ధరలకు వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు జిల్లాకేంద్రంలోని కొన్ని బంకుల్లో ప్రీమియం పెట్రోల్ను వినియోగదార్లకు బలవంతంగా అంటగడుతున్నారు.’’
ఇంధన బంకుల్లో ఇష్టారాజ్యం ‘‘మండుతున్న ఇంధన ధరలకు వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు జిల్లాకేంద్రంలోని కొన్ని బంకుల్లో ప్రీమియం పెట్రోల్ను వినియోగదార్లకు బలవంతంగా అంటగడుతున్నారు.’’
ఈనాడు డిజిటల్, కామారెడ్డి: ప్రతి బంకులో సాధారణ పెట్రోలు, డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. వీటితో పాటు కాస్త ధర ఎక్కువగా ఉండే ప్రీమియం ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారుల ఆసక్తి, ఎంపికకు అనుగుణంగా వారు కోరుకున్నది వాహనాల్లో నింపాల్సి ఉండగా.. ప్రీమియం పెట్రోలు మాత్రమే విక్రయిస్తూ దోపిడీకి తెగబడుతున్నారు.
పర్యవేక్షణ లేకపోవడంతో
బంకులపై పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటం వారికి కలిసివస్తోంది. నిల్వలు, సరఫరా ఆటంకం కారణంగా ఒకటి, రెండు రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటే తప్పులేదు. ఇక్కడ రోజుల తరబడి ఇదే తతంగం కొనసాగుతోంది. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పోయించుకోండి. లేకపోతే వెళ్లిపోండంటూ దురుసుగా వ్యవహరిస్తున్నారు.
జేబుకు భారమే
ప్రస్తుతం జిల్లాకేంద్రంతోపాటు డిజవిన్, మండల కేంద్రాల్లోని చాలా బంకుల్లో సాగుతున్న ప్రీమియం దందా సామాన్యుడి జేబుకు భారంగా మారింది. సాధారణ పెట్రోలు, ప్రీమియానికి ధరలో రూ.7 వరకు వ్యత్యాసముంటోంది.
అవసరాన్ని బట్టి..
వినియోగదారుల అవసరాన్ని బంకుల నిర్వాహకులు అవకాశంగా తీసుకుంటున్నారు. ఉదయం వేళల్లో ఉద్యోగులు కార్యాలయాలకు పరుగులు పెడుతుంటారు. ఇదే సమయాన్ని అవకాశంగా మలుచుకుని ఉదయం 9.30 నుంచి 10.30 వరకు ప్రీమియం మాత్రమే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకేంద్రంలో కూటమి కట్టి ఈ దందాకు తెరదీశారు. పౌరసరఫరాల అధికారులు వీరికి వంతపాడుతున్నారు.
ఉపయోగం ఏంటీ..?
ఇంధనంలో రెగ్యులర్, ప్రీమియం అనే రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా పెట్రోలు గ్రేడ్ను దాని ఆక్లేన్ విలువ ఆధారంగా వర్గీకరిస్తారు. సాధారణ పెట్రోలు ఆక్లేన్ విలువ 87 కాగా.. ప్రీమియానిది 91 వరకు ఉంటుంది. ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ ఇంధనం వినియోగంకాకుండా, కార్బన్పై తక్కువ ప్రభావం చూపడం, ఇంజిన్ శబ్దం తగ్గింపు తదితర అంశాలు ఆక్లేన్ విలువను పెంచేందుకు దోహదం చేస్తున్నాయి. వాస్తవానికి అధిక కంప్రెషన్ సిస్టం ఉన్న ఆధునిక శక్తివంతమైన వాహనాలకు ప్రీమియం పెట్రోలు, డీజిల్ ప్రయోజనకరం. వాహనం అయిదేళ్ల పైబడిది అయితే సాధారణ ఇంధనం సరిపోతుందని, శక్తివంతమైన మోడల్ అయితే ప్రీమియం ఉత్తమమని మెకానిక్లు చెబుతున్నారు.
పరిశీలించి చర్యలు
- పద్మ, పౌరసరఫరాల శాఖ అధికారి, కామారెడ్డి
బంకుల్లో విధిగా సాధారణ పెట్రోలు అందుబాటులో ఉంచాలి. ప్రీమియం అంటూ బలవంతంగా విక్రయించొద్దు. వినియోగదారుల కోరికకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా ఇందుకు విరుద్ధంగా చేస్తున్నట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ