అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట
‘స్మార్ట్ఫోన్లతో అరచేతిలో అంతర్జాలం అందుబాటులోకి వచ్చింది. ఏ అవసరమైనా, ఎలాంటి సమాచారం కావాలన్నా ముందుగా ఆన్లైన్లో జల్లెడ పడుతున్నారు.
సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు అవసరం
‘ఈనాడు-ఈటీవీ’ తెలంగాణ సదస్సులో పోలీసు అధికారులు
న్యూస్టుడే, నిజామాబాద్ నగర బృందం
ప్రసంగిస్తున్న సీపీ నాగరాజు, చిత్రంలో ఏసీపీ వెంకటేశ్వర్, గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి, నగర సీఐ వెంకట్ నారాయణ, సైబర్ బృంద సభ్యులు
‘స్మార్ట్ఫోన్లతో అరచేతిలో అంతర్జాలం అందుబాటులోకి వచ్చింది. ఏ అవసరమైనా, ఎలాంటి సమాచారం కావాలన్నా ముందుగా ఆన్లైన్లో జల్లెడ పడుతున్నారు. అందులో ఉన్న సమాచారాన్ని సులువుగా నమ్మేస్తూ ఆన్లైన్ మోసాల బారిన పడుతున్నారు’ అని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. సురక్షిత అంతర్జాల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్లోని గిరిరాజ్ కళాశాల ఆడిటోరియంలో ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’ ‘ఈటీవీ-భారత్’ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సీపీ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్ హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గతంతో పోలిస్తే సైబర్ నేరాల రేటు గణనీయంగా పెరిగిందని, ఇందుకు సామాజిక మాధ్యమాలే ప్రధాన కారణమన్నారు. ఇలాంటి నేరాల తీరుపై అవగాహన పెంచుకొంటేనే మోసపోకుండా ఉంటారని స్పష్టం చేశారు. కళాజాత ఇన్ఛార్జి పాషా ఆధ్వర్యంలో సీత, శ్రీనివాస్, శేఖర్, నరేష్, బాల్రాజ్ ప్రదర్శనలు ఇచ్చారు. షీ బృందం మహిళా ఎస్సై స్రవంతి, సిబ్బంది శ్రీకాంత్, నాగరాజు, రేఖారాణి, హరితారాణి పాల్గొన్నారు.
రోజుకో తరహాలో..
- ముఖీద్ పాషా, సైబర్ సెల్ సీఐ
ప్రస్తుతం రోజుకో తరహాలో నేరాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత ఫొటోలను చోరీ చేసి మార్ఫింగ్ చేస్తున్నారు. అనవసర యాప్ల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఎలాంటి సమాచారం ఉన్నా కమిషనరేట్లోని సహాయక కేంద్రాన్ని సంప్రదించాలి. వివరాలు గోప్యంగా ఉంచి సమస్యను పరిష్కరిస్తాం.
ఓటీపీలు పంపించి..
- వెంకట్నారాయణ, నగర సీఐ
విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో అనవసర వెబ్సైట్లు, లింకులు, యాప్ల్లో వివరాలు నమోదు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్చేసినా ఓటీపీ నంబరు చెప్పేస్తున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలి.
గుర్తుతెలియని నంబర్లతో..
- రామ్మోహన్రెడ్డి, గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్
చరవాణి వినియోగం తప్పనిసరైన పరిస్థితుల్లో గుర్తు తెలియని నంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దు. సమాచార సేకరణ కోసం అంతర్జాల వినియోగం అత్యవసరంగా మారింది.
యువత మోసపోవద్దు
ఆన్లైన్ మోసాల్లో ఎక్కువగా చదువుకున్న యువత బాధితులుగా ఉంటున్నారు. తగిన సమాచారం తెలుసుకోకుండానే కొన్ని యాప్లను నమ్మి షాపింగ్ చేస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. బాధితుల వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సేకరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా సమయం కేటాయించేవారు వ్యక్తిగత వివరాలు పోస్టు చేయకపోవడం ఉత్తమం. ముఖ్యంగా విద్యార్థినులు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీ బృందాలకు చెప్పాలి. చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితులకు అండగా ఉంటాం.
నాగరాజు, సీపీ
సులువుగా నమ్మేస్తున్నారు
కొందరు ఆన్లైన్లో వచ్చే లింకులు, సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని సులువుగా నమ్మేస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన హ్యాకర్లు వ్యక్తిగత వివరాలు సేకరించి దిల్లీ, యూపీ, హరియాణా కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ఓ యువతి వివాహం కోసం ఆమె తండ్రి సంబంధాలు చూస్తుండగా విదేశాల్లో ఉన్న యువకుడి సమాచారం లభించింది. అది సైబర్ నేరగాళ్లు పెట్టిన తప్పుడు సమాచారం అని గుర్తించకుండా అతడికి రూ.25 లక్షలు వరకు చెల్లించి మోసపోయారు. వీటి కట్టడి దిశగా ‘ఈనాడు’ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం అభినందనీయం.
ఆరె వెంకటేశ్వర్, నిజామాబాద్ ఏసీపీ
సైబర్ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ నంబర్లకు తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
జాతీయ టోల్ ఫ్రీ: 1930
డయల్ 100
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బీబీ పాటిల్పై చేస్తున్న తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
[ 26-04-2024]
జహీరాబాద్ ఎంపీగా భాజపా అభ్యర్థి బీబీ పాటిల్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. -
ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలి
[ 26-04-2024]
నరేంద్రమోదీ హయాంలో భాజపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుతున్నారని భాజపా జహీరాబాద్ పార్లమెంట్ ప్రభారీ పెద్దోళ్ల గంగారెడ్డి అన్నారు. -
భారీ మెజార్టీతో గెలిపించాలి
[ 26-04-2024]
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షట్కర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. -
అభివృద్ధికి పట్టం కట్టాలి
[ 26-04-2024]
నాగిరెడ్డిపేట మండలంలోని రాఘవపల్లి గ్రామంలో గురువారం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. -
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత