నామినేషన్ వేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త
వివరాలు సక్రమంగా లేకపోతే తిరస్కరణ
న్యూస్టుడే, నిజామాబాద్ అర్బన్
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. అధికార యంత్రాంగం దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసే ముందు వివరాలన్ని సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి. అఫిడవిట్లో చిన్నపాటి తప్పులున్నా, పూర్తిగా నింపకపోయినా తిరస్కరణకు గురయ్యే ఆస్కారం ఉంది.
అఫిడవిట్ కీలకం
ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్ కీలకంగా ఉంటుంది. అభ్యర్థిపై క్రిమినల్ కేసులు నమోదై ఉంటే సంబంధిత వివరాలు అందులో పొందుపర్చాలి. ఏదైనా కేసులో న్యాయస్థానం గతంలో శిక్ష విధించినా, అప్పీల్కు వెళ్లినా ఆ సమాచారం తెలపాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్కు నోటరీ తప్పనిసరి. నామినేషన్ వేసే సమయంలో అభ్యర్థి రిటర్నింగ్ అధికారి వద్ద ప్రమాణం చేయాల్సి ఉంటుంది. స్థిర, చరాస్తుల వివరాలతో పాటు బ్యాంకు, చేతిలో ఉన్న నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్స్, బీమా పాలసీలు, అప్పులు, ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాలు వంటి వివరాలను అఫిడవిట్లో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలను కూడా నింపాలి. ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా ప్రస్తావించాలి.
వీటిని సిద్ధం చేసుకోవాలి
నామినేషన్ దాఖలు చేసే వారు జనరల్ అభ్యర్థులు అయితే రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.12,500 డిపాజిట్ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని నగదు, చలానా రూపంలో చెల్లించాలి. చెక్కులు తీసుకోరు.
- జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేసే నియోజకవర్గంలో ఎవరైనా ఒక ఓటరు నామినేషన్ను ప్రతిపాదించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్, స్వతంత్ర అభ్యర్థులకైతే పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. * అభ్యర్థులు మూడు నెలలలోపు దిగిన ఒక పాస్ ఫొటోను అఫిడవిట్పై, స్టాంప్ సైజ్ ఫొటోను నామపత్రాలపై అతికించాలి.
- ఇతర పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఈఆర్వో జారీ చేసిన ఓటరు ధ్రువీకరణ పత్రం జత చేయాలి.
- కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి.
- రూ.95 లక్షల వరకు గరిష్ఠంగా ఖర్చు చేయొచ్చు.
- విద్యుత్తు, నీటి, ఇతర పన్నుల బిల్లులు పెండింగ్లో ఉండొద్దు. అన్నింటిని చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్ జత చేయాలి .
- పార్టీ కండువాలు, టోపీలతో వస్తే అనుమతించరు. అభ్యర్థితో పాటు మరో నలుగురిని లోనికి అనుమతిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కదలాలి యువత
[ 30-04-2024]
ఓటు నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్వీప్ ఆధ్వర్యంలో ప్రైవేటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో అవగాహన కల్పించి నమోదు చేయించారు. పోలింగ్ కేంద్రాల్లోనూ శిబిరాలు నిర్వహించారు. -
జహీరాబాద్ బరిలో 19 మంది
[ 30-04-2024]
నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. -
ఉక్కపోత.. రోగులకు వెత
[ 30-04-2024]
వేసవి తీవ్రరూపం దాల్చింది. 43 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతుతోంది. జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 12 అయిందంటే చాలు తీవ్రమైన ఉక్కపోత రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
‘కాళేశ్వరం పేరిట దోచుకున్నారు.. హామీలు మరిచారు’
[ 30-04-2024]
భారాస ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం పేరిట దోచుకున్నారు... కోట్లాది రూపాయలను వృథా చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. -
పల్లెల్లో వేసవి క్రీడా శిబిరాలు
[ 30-04-2024]
విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడానైపుణ్యాలకు పదునుపెట్టడానికి జిల్లాలో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు శిబిరాలను కొనసాగించనున్నారు. -
నిజామాబాద్ బరిలో 29 మంది
[ 30-04-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బరిలో 29 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 42 మంది నామినేషన్లు వేయగా పరిశీలనలో పది మందివి తిరస్కరణకు గురయ్యాయి. -
శుభముహూర్తాలకు సెలవు
[ 30-04-2024]
శుభాకార్యాలకు బ్రేక్ పడింది. మూడాలు, ఆషాఢంతో వచ్చే మూడు నెలల పాటు శుభముహూర్తాలు లేవని వేదపండితులు చెబుతున్నారు. గతంలో వేసవిలో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరిగేవి. -
అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు
[ 30-04-2024]
అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు -
ఇంకుడు గుంతలపై మొక్కుబడి సర్వే
[ 30-04-2024]
ఎండల తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఈ తరుణంలో ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఒకే స్థానం..జిల్లాలు మూడు
[ 30-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ గ్రామీణం, బాల్కొండ నియోజకవర్గాలు ఉండగా.. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు జగిత్యాల జిల్లాలో ఉన్నాయి. -
పట్టణ ఓటర్లారా..బాధ్యత మరవొద్దు
[ 30-04-2024]
పట్టణాలు, నగరాలు అంటే ‘ఆధునికత’ అనే భావన ఉంటుంది. అలాంటి ప్రాంతాలే గ్రామీణ ఓటర్లకు మార్గదర్శకంగా ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రాంత ఓటర్లే ఓటింగ్కు దూరంగా ఉండటం సరికాదనే అభిప్రాయం పౌర సమాజం నుంచి వ్యక్తమవుతోంది. -
ఎవరి ప్రభావమెంత..?
[ 30-04-2024]
2024 నిజామాబాద్ లోక్సభ ఎన్నికల బరిలో ఎంత మంది ఉంటారనే లెక్క తేలింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 29 మంది బరిలో ఉన్నారు. -
ఓటరు చైతన్యం.. డిజిటల్ మార్గం
[ 30-04-2024]
ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు, కరపత్రాల ఆవిష్కరణ, మహిళలకు ముగ్గుల పోటీలు, పాఠశాలలు, కళాశాలల్లో నమూనా పోలింగ్ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది. -
ఓటు అవగాహన.. ఛాయాచిత్ర ప్రదర్శన
[ 30-04-2024]
ప్రతి వ్యక్తి నిజాయతీగా ఓటేయాలని పార్లమెంట్ సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ తెలిపారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్టాండు ఆవరణలో ఓటరు అవగాహనపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను అదనపు కలెక్టర్ కిరణ్కుమార్తో కలిసి ప్రారంభించి మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత