జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు.
పోలీసులపై మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపణ
ఈనాడు, నిజామాబాద్: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. నేరం ఒప్పుకోవాలని తన కొడుకుపై ఒత్తిడి చేస్తున్నారని.. ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. పంజాగుట్ట ఠాణా పరిధిలో బారికేడ్లను ఢీకొట్టిన కేసులో 21 సెక్షన్లు పెట్టి వేధించటమే కాకుండా.. ఘటన జరిగిన సందర్భంలో దుబాయిలో ఉన్న తన పేరు కూడా చేర్చారన్నారు. తన కొడుకు తప్పు చేస్తే ఉరితీయాలని.. కానీ ఇప్పటికే ట్రయల్ నడుస్తున్న కేసులో ప్రమేయం లేకున్నా ఇరికించడం సరికాదన్నారు. పారదర్శకంగా విచారణ జరిపించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కేసును సీబీఐ లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తన కుమారుడికి ఏమైనా జరిగితే వెస్ట్జోన్ డీసీపీ, ఇతర పోలీసు అధికారులే బాధ్యులవుతారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పది’లమైన ఫలితాలు
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో ఈ సారి 14వ స్థానంలో నిలిచింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 11,144 మంది బాలురు, 10,714 బాలికలు మొత్తంగా 21858 మంది పరీక్షలకు హాజరయ్యారు. -
పదిలో కాస్త తడబడి
[ 01-05-2024]
జిల్లాలో మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గతేడాది కన్నా ఈ సారి వెనుకబడ్డారు. గతేడాది 93.32 శాతం ఉత్తీర్ణత కాగా ఈ సారి 0.61 శాతం తగ్గి 92.71కి పడిపోయింది. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గతేడాది 7వ ర్యాంకు దక్కగా ఈ సారి 19కి చేరింది. -
విమర్శల జోరు... కేరింతల హోరు
[ 01-05-2024]
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. -
న్యాయం చేయాలని గుత్తేదారు నిరసన
[ 01-05-2024]
తాను చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని ఓ గుత్తేదారు పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా.. గేట్కు తాళం వేసిన ఘటన బీర్కూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. -
పరిధి దాటింది.. బిల్లు వచ్చింది
[ 01-05-2024]
ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్లరేషన్కార్డులు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వీరికి శూన్య బిల్లులు అందజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు. -
దడ పుట్టిస్తున్న వడగాలులు
[ 01-05-2024]
జిల్లాలో మంగళవారం ఎండ మండిపోయింది. భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతుండడంతో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. -
ఇంటి వద్ద ఓటేసేది 1,758 మంది
[ 01-05-2024]
నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు పార్లమెంటు ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించారు. కర్ణాటకలో ఈ పద్ధతి సత్ఫలితం ఇవ్వడంతో ఎన్నికల సంఘం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనవద్ద ప్రవేశపెట్టింది. -
‘ఆ రెండు పార్టీలు ఒక్కటే’
[ 01-05-2024]
కాంగ్రెస్, భాజపా ఒక్కటేనని భారాస నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్, మాజీ మార్క్ఫెడ్ ఛైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. -
బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
[ 01-05-2024]
బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్తో ఇబ్బంది లేదు’
[ 01-05-2024]
యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి వస్తే దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎంపీ అర్వింద్ భరోసా ఇచ్చారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సంతోషాన్నిచ్చిందన్నారు. -
పదిలో మెరిశారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలబాలికలు పది జీపీఏ పాయింట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!
-
అతడికి పెద్దగా అవకాశాలు ఇవ్వలేకపోయాం..: హార్దిక్ పాండ్య