బలం పెంచుకునేలా వ్యూహాలు
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
పార్టీ శ్రేణులతో అభ్యర్థుల అంతర్గత సమావేశాలు
ఈనాడు, కామారెడ్డి
జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పోరులో గెలుపు, ఓటములపై పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. మొదటిసారి త్రిముఖ పోటీ నెలకొనడంతో ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారాస, కాంగ్రెస్, భాజపా అభ్యర్థులు తమ పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు జరుపుతూ ఆయా ప్రాంతాల్లో వారికి కలిసొచ్చే అంశాలను పరిశీలిస్తూ విజయం సాధించేందుకు అవసరమైన వ్యూహాలు రచిస్తున్నారు.
స్వల్ప వ్యత్యాసమే
త్రిభాష సంగమంగా పేరొందిన జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారాస అభ్యర్థి బీబీపాటిల్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావుపై స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పరంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో భారాస కంటే కాంగ్రెస్ పార్టీకి 18,644 ఓట్లు అధికంగా వచ్చాయి. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారాసకు కాంగ్రెస్ కంటే 6,166 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి.
బలోపేతానికి చేరికలపై దృష్టి
మూడు ప్రధాన పార్టీలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బలాబలాలను అంచనా వేసుకుంటూ క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా చేరికలపై దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యంగా భాజపా, కాంగ్రెస్లు ఇతర పార్టీల ద్వితీయ శ్రేణి నేతలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారాస తమ నేతలు పార్టీ విడిచి వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి రప్పించేందుకు హస్తం నేతలు చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు చెందిన నేతలు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాలు కప్పుకొనేందుకు రంగం సిద్ధమైంది.
క్షేత్రస్థాయి పరిస్థితులపై సమీక్షలు
భాజపా, భారాస, కాంగ్రెస్ అభ్యర్థులు మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ముఖ్యనేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. లోపాలు తెలుసుకుంటూ మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ఏ విధమైన చర్యలు చేపట్టాలనే దానిపై వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
మద్దతు కూడగడుతున్న కుటుంబసభ్యులు
కాంగ్రెస్, భాజపా అభ్యర్థుల కుటుంబసభ్యులు తమ పార్టీతో పాటు ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, కార్యకర్తల వద్దకు వెళ్లి మద్దతు తెలపాలని కోరుతున్నారు. పార్టీలో చేరికకు ఇబ్బందులుంటే ప్రచారంలో పాల్గొనకుండా అంతర్గతంగా సహకరించాలని అడుగుతున్నారు. ఇందుకు హమీ తీసుకుంటున్నారు. భాజపా అభ్యర్థి బీబీపాటిల్ తరఫున ఆయన సోదరులతో పాటు ఇతరులు పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటిస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ఓసారి చుట్టేసి వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ కూతురు సైతం పార్టీ అనుబంధ సంఘాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ విజయం కోసం పనిచేసేలా సమాయత్తం చేస్తున్నారు. భారాస అభ్యర్థి గాలి అనిల్కుమార్ తరఫున ఆయన బంధువులు విస్తృతంగా పర్యటిస్తూ తమ సామాజికవర్గానికి చెందిన నేతలు, సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తూ గంపగుత్తగా ఓట్లు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారాసను వీడిన నేతల వద్దకు వెళ్లి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో సహకరించాలని కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పది’లమైన ఫలితాలు
[ 01-05-2024]
పదో తరగతి ఫలితాల్లో ఈ సారి 14వ స్థానంలో నిలిచింది. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించగా మంగళవారం ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 11,144 మంది బాలురు, 10,714 బాలికలు మొత్తంగా 21858 మంది పరీక్షలకు హాజరయ్యారు. -
పదిలో కాస్త తడబడి
[ 01-05-2024]
జిల్లాలో మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గతేడాది కన్నా ఈ సారి వెనుకబడ్డారు. గతేడాది 93.32 శాతం ఉత్తీర్ణత కాగా ఈ సారి 0.61 శాతం తగ్గి 92.71కి పడిపోయింది. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గతేడాది 7వ ర్యాంకు దక్కగా ఈ సారి 19కి చేరింది. -
విమర్శల జోరు... కేరింతల హోరు
[ 01-05-2024]
మెదక్ జిల్లా అల్లాదుర్గం చిల్వేర్ ఐబీ చౌరస్తాలో మంగళవారం మెదక్-జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల భాజపా విశాల్ జనసభలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా దుయ్యబట్టారు. -
న్యాయం చేయాలని గుత్తేదారు నిరసన
[ 01-05-2024]
తాను చేపట్టిన పనులకు బిల్లులు ఇవ్వకుండా పంచాయతీ అధికారులు రెండేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని ఓ గుత్తేదారు పంచాయతీ కార్యాలయంలో అధికారులు ఉండగా.. గేట్కు తాళం వేసిన ఘటన బీర్కూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. -
పరిధి దాటింది.. బిల్లు వచ్చింది
[ 01-05-2024]
ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్లరేషన్కార్డులు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తోంది. వీరికి శూన్య బిల్లులు అందజేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 44-45 డిగ్రీలకు చేరడంతో ప్రజలు ఉక్కపోతలతో అల్లాడుతున్నారు. -
దడ పుట్టిస్తున్న వడగాలులు
[ 01-05-2024]
జిల్లాలో మంగళవారం ఎండ మండిపోయింది. భానుడు తన ప్రతాపాన్ని రోజురోజుకూ పెంచుతుండడంతో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. -
ఇంటి వద్ద ఓటేసేది 1,758 మంది
[ 01-05-2024]
నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు పార్లమెంటు ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించారు. కర్ణాటకలో ఈ పద్ధతి సత్ఫలితం ఇవ్వడంతో ఎన్నికల సంఘం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మనవద్ద ప్రవేశపెట్టింది. -
‘ఆ రెండు పార్టీలు ఒక్కటే’
[ 01-05-2024]
కాంగ్రెస్, భాజపా ఒక్కటేనని భారాస నిజామాబాద్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మంగళవారం భారాస జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, మాజీ మంత్రి జి.రాజేశంగౌడ్, మాజీ మార్క్ఫెడ్ ఛైర్మన్ లోక బాపురెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. -
బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్
[ 01-05-2024]
బడుగు బలహీన వర్గాలకు తమ పార్టీ అండగా ఉంటుందని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి తెలిపారు. -
‘యూనిఫాం సివిల్ కోడ్తో ఇబ్బంది లేదు’
[ 01-05-2024]
యూనిఫాం సివిల్ కోడ్ అమల్లోకి వస్తే దేశంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎంపీ అర్వింద్ భరోసా ఇచ్చారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయం ముస్లిం మహిళలకు సంతోషాన్నిచ్చిందన్నారు. -
పదిలో మెరిశారు
[ 01-05-2024]
రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ చాటారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలబాలికలు పది జీపీఏ పాయింట్లు సాధించారు.