logo

ఇద్దరు సీఐలపై వేటు

కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్‌ వేటు పడింది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహిల్‌ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు.

Published : 19 Apr 2024 05:36 IST

నిజామాబాద్‌ నేరవిభాగం : కమిషనరేట్‌ పరిధిలో ఇద్దరు సీఐలపై గురువారం సస్పెన్షన్‌ వేటు పడింది. బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకు రాహిల్‌ను తప్పించేందుకు పంజాగుట్ట సీఐని సంప్రదించినట్లు విచారణలో తేలడంతో అప్పటి బోధన్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ సస్పెండ్‌ చేశారు. సీసీఎస్‌ సీఐ రమేశ్‌ మద్యం తాగి ఠాణాకు వెళ్లి సిబ్బందిని ఇబ్బంది పెట్టినట్లు అధికారుల దృష్టికి రావడంతో విచారణ జరిపి సస్పెన్షన్‌ వేటు వేస్తూ మల్టీజోన్‌-1 ఐజీ ఉత్తర్వులు ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని