ఎన్నికల బరిలో అతివలకు అవకాశం
ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు.
సిమిలిగుడ, న్యూస్టుడే: ఎన్నికల్లో మహిళా అభ్యర్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని బిజద ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగా ఎన్నికల బరిలో పోటీపడేందుకు మహిళలకు అవకాశం కల్పించారు. ప్రతిష్ఠాత్మక నియోజకవర్గం జాజ్పూర్ నుంచి రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి ప్రణబ్ ప్రకాష్ దాస్, బిజద అగ్ర నేతలు టికెట్ కోసం ఎదురుచూస్తుండగా, అధిష్ఠానం మహిళా సంఘం అధ్యక్షురాలు సుజాతా సాహుకు అవకాశం కల్పించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రణబ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు. ్చ
దరఖాస్తు చేయకుండానే టికెట్: దాశరథిపూర్ సమితి తరపడా పంచాయతీ పెంటాబడ్కు చెందిన సుజాతా మా సరస్వతి స్వయం సహాయక సంఘం అధ్యక్షురాలుగా పని చేస్తుంది. ఈ సంఘం సభ్యులు బ్యాగులు, ఫైళ్లు, పెన్సిళ్లు తయారీ, విక్రయాల్లో బాగా రాణించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సుజాతా సమితి సభ్యురాలుగా, తర్వాత సమితి అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. మహిళలకు ఉపాధి కల్పించడంలో ఆమె చేస్తున్న కృషికిగాను మిషన్ శక్తి అధ్యక్షురాలుగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుబాయ్ కూడా వెళ్లారు. ఆమె మహిళల అభివృద్ధి కోసం కృషి చేయడంతో ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశాన్ని బిజద కల్పించింది. దరఖాస్తు పెట్టకుండా పార్టీ అధిష్ఠానం సుజాతకు అవకాశం ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రజాసేవ చేస్తానని సుజాతా విలేకరులతో చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మగువ.. ప్రచారంలో తెగువ
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. -
పొట్టంగిలో అన్నతో చెల్లి పోటీ
[ 29-04-2024]
పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. -
మధుబాబు సేవలు చిరస్మరణీయం: గవర్నర్
[ 29-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమానికి ఊపిరిలూదిన ఉత్కళగౌరవ్ మధుసూదన్ దాస్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఉత్కళీయులకు మార్గదర్శిగా నిలిచారని గవర్నరు రఘుబర్దాస్ అభివర్ణించారు. -
మండుటెండల్లో.. చల్లచల్లగా!
[ 29-04-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. -
మౌనమేలనోయి!
[ 29-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
‘జగన్నాథ్’లకు అగ్ని పరీక్ష
[ 29-04-2024]
రాయగడ జిల్లాలో బిసంకటక్ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు. -
డబుల్ ఇంజిన్ నినాదం ఇక్కడ ఫలితమివ్వదు
[ 29-04-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన నినాదం పనిచేయదని, నవీన్ ఇంజిన్ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ అన్నారు. -
పొట్టంగిలో భారీ వర్షం
[ 29-04-2024]
కొరాపుట్ జిల్లాలో ఎండల తీవ్రతతో ప్రజల ఇబ్బంది పడుతుండగా, ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. పొట్టంగి ప్రాంతంలో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. -
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో: రాహుల్
[ 29-04-2024]
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో ఉన్నాయని, విశ్వసనీయత కోల్పోయాయని రాహుల్ గాంధీ సాలెపూర్ సమావేశంలో ఆదివారం అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్