సీనియర్లకు సీట్లు...పూర్వ వైభవానికి ఫీట్లు
ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామని, పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్ నాయకత్వం ఇంతవరకు 17 లోక్సభ, 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు ఫలించేనా?
నువాపడలో మంగళవారం శరత్ పట్నాయక్ పాదయాత్ర
భువనేశ్వర్, న్యూస్టుడే : ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామని, పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్ నాయకత్వం ఇంతవరకు 17 లోక్సభ, 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కొంతమంది సీనియర్ నేతలను ఎన్నికల బరిలోకి దించింది. ఇది ప్రయోగం ఎంతమాత్రం కాదని, అనుభవజ్ఞుల అవసరం ఉందన్న దూరదృష్టితో వారికి అవకాశం ఇచ్చామని చెప్పుకుంది.
తీరని నష్టం
ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు తీరని నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అసెంబ్లీలో 9 మంది సభ్యులున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో 90 స్థానాలు గెలుచుకుంటుందని ఆ పార్టీ నాయకత్వం చెప్పుకొంది. అదే సమయంలో పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు మొదలయ్యాయి. అగ్రనేతలెంతో మంది బిజద తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్కు ఇది తీవ్రంగా నష్టపెట్టింది. బిజద, భాజపాల నుంచి టిక్కెట్లు రాని అసంతుష్టులు హస్తం గూటికి వస్తారన్న అంచనాలు తలకిందులయ్యాయి.
వేచి చూసినా నిరాశే
ఇతర పార్టీలకంటే ముందుగా జాబితా ఖరారు చేస్తామన్న కాంగ్రెస్ నాయకత్వం ‘ఆయారాం’ల కోసం వేచి చూసినా నిరాశే మిగిలింది. ఎట్టకేలకు రెండు దశల్లో ఇంతవరకు 17 లోక్సభ, 119 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పాత నేతలకు ఈసారి బరిలోకి దించుతామని, యువత, మహిళలకు అవకాశమిస్తామన్న పీసీసీ పెద్దలు కొంతమంది అనుభవజ్ఞులకు నిలబెట్టారు. రాజకీయ అనుభవం లేని వారికీ కొత్తగా అవకాశమిచ్చారు.
ఆ పార్టీలకు శృంగభంగం
జయదేవ్ జెనా మాట్లాడుతూ... అధికారమే పరమావధిగా చేసుకుని విర్రవీగుతున్న భాజపా, బిజదలకు ఈసారి శృంగభంగం తథ్యమన్నారు. ఈ రెండు పార్టీల విజయాలకు బ్రేకులు పడతాయన్నారు. కొద్దిమంది నేతలు పార్టీ వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగదని, ఫిరాయింపుదారులకు ఓటర్లు బుద్ధి చెబుతారన్నారు. అనుభవజ్ఞులంతా ఎన్నికల బరిలో ఉన్నందున మంచి ఫలితాలుంటాయన్న ఆశాభావం ఉందన్నారు.
భొండారి పొఖరిలో ప్రసార సాధనాలతో నిరంజన్ పట్నాయక్
ఎన్నికైన తర్వాత ముఖాలు చాటేస్తున్నారు
జేబీ కుమారుడు పృథ్వీ బల్లబ్ మాట్లాడుతూ... తన నాన్నగారు సీఎంగా ఉన్న సమయంలో స్వయంగా అందర్నీ కలిసేవారని, ఇంటికి పిలిచి మాట్లాడేవారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిని ఆయన సహచరులే కలుసుకోలేని దుస్థితి ఉందన్నారు. కాంగ్రెస్కు పూర్వ వైభవం కల్పించాలన్న ధ్యేయంతో తాను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగానని, పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం ఉందని చెప్పారు.
వీరంతా హేమాహేమీలు
పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ నువాపడ అసెంబ్లీ అభ్యర్థి కాగా, కేంద్రమాజీ మంత్రి భక్తచరణ దాస్ కలహండి జిల్లా నర్లా నుంచి పోటీకి సన్నద్ధమయ్యారు. పీసీసీ మాజీ అధ్యక్షుల్లో నిరంజన్ పట్నాయక్ బాలేశ్వర్ జిల్లా భొండారిపొకిరి నుంచి, జయదేవ్ జెనా కేంఝర్ జిల్లా ఆనందపూర్ నుంచి బరిలో ఉన్నారు. మరో అగ్రనేత మాజీ మంత్రి కిశోర్ పటేల్ ఝార్సుగుడ జిల్లా బ్రజరాజనగర్ అభ్యర్థి కాగా, మాజీ (దివంగత) ముఖ్యమంత్రి జానకిబల్లభ్ పట్నాయక్ తనయుడు పృథ్వీవల్లభ్ ఖుర్దా జిల్లా బెగునియా బరిలో ఉన్నారు. పృథ్వీ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. మరో కేంద్రమంత్రి శ్రీకాంత్ జెనాను ఏఐసీసీ నాయకత్వం కోరి మరీ బాలేశ్వర్ లోక్సభ స్థానం కేటాయించింది. యువజన కాంగ్రెస్ నేత యూసిర్ నవాజ్ను భువనేశ్వర్ లోక్సభ బరిలో దించారు. ప్రకటించిన వారిలో మరికొందరు అనుభవజ్ఞులున్నారు.
పార్టీ గొప్పది... నేతలు కాదు
నిరంజన్ పట్నాయక్ మంగళవారం బాలేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ... పార్టీ గొప్పదని, దాని ముందు నేతలు తక్కువేనని వివరించారు. ప్రతీ రాజకీయ పార్టీకి ఉత్థానపతనాలుంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఈసారి పూర్వ వైభవం సాధిస్తుందని, అనుభవం గల నేతల సేవలు వినియోగించుకోవాలన్న ధ్యేయం మంచిదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మగువ.. ప్రచారంలో తెగువ
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో మహిళలు ముందంజలో ఉన్నారు. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా పాదయాత్రలు, రోడ్షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. -
పొట్టంగిలో అన్నతో చెల్లి పోటీ
[ 29-04-2024]
పొట్టంగి నియోజకవర్గంలో ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉన్న అధికార బిజద పార్టీ అభ్యర్థి ప్రఫుల్ల కుమార్ పంగితో ఆయన చెల్లి అంబికా పంగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతుండడం చర్చనీయాంశమైంది. -
మధుబాబు సేవలు చిరస్మరణీయం: గవర్నర్
[ 29-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమానికి ఊపిరిలూదిన ఉత్కళగౌరవ్ మధుసూదన్ దాస్ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఉత్కళీయులకు మార్గదర్శిగా నిలిచారని గవర్నరు రఘుబర్దాస్ అభివర్ణించారు. -
మండుటెండల్లో.. చల్లచల్లగా!
[ 29-04-2024]
ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్న నేపథ్యంలో బీరు విక్రయాలు జోరందుకున్నాయి. ఎండల నుంచి ఉపశమనం కోసం మందు బాబులు బీరు వైపు మొగ్గు చూపుతుండడంతో వీటి అమ్మకాలు అమాంతంగా పెరిగాయి. -
మౌనమేలనోయి!
[ 29-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ నెల 29న నామినేషన్ల ఉపసంహరణ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. -
‘జగన్నాథ్’లకు అగ్ని పరీక్ష
[ 29-04-2024]
రాయగడ జిల్లాలో బిసంకటక్ విధానసభ నియోజకవర్గం ప్రతిష్ఠాత్మకం కానుంది. ఇక్కడ అభ్యర్థులకు గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గెలుపోటములు చవిచూసిన రాష్ట్ర మంత్రి, బిజద అభ్యర్థి జగన్నాథ సరక, భాజపా నుంచి జగన్నాథ నుండ్రుక రంగంలోకి దిగారు. -
డబుల్ ఇంజిన్ నినాదం ఇక్కడ ఫలితమివ్వదు
[ 29-04-2024]
రాష్ట్రంలో భాజపా డబుల్ ఇంజిన్ పాలన నినాదం పనిచేయదని, నవీన్ ఇంజిన్ మాత్రమే పరుగులు తీస్తుందని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ అన్నారు. -
పొట్టంగిలో భారీ వర్షం
[ 29-04-2024]
కొరాపుట్ జిల్లాలో ఎండల తీవ్రతతో ప్రజల ఇబ్బంది పడుతుండగా, ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. పొట్టంగి ప్రాంతంలో పెను గాలులతో కూడిన వర్షం కురిసింది. -
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో: రాహుల్
[ 29-04-2024]
ప్రసార సాధనాలు మోదీ, నవీన్ గుప్పెట్లో ఉన్నాయని, విశ్వసనీయత కోల్పోయాయని రాహుల్ గాంధీ సాలెపూర్ సమావేశంలో ఆదివారం అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్